మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల అధ్యక్షులు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా. పార్టీ స్థాపకులకు మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ స్తూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్. 6. స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిందని ప్రారంభ దశలో కేవలం రెండు ఎంపీ స్థానాలతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన పార్టీ క్రమక్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలిచుకుంటూ తన బలం పెంచుకుందని మొదటి సారి అటల్ బిహారీ వాజపేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బిజెపి తన సత్తాను చాటుకుందని అనంతరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలు సాధిస్తూ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని తెలియజేస్తూ. సబ్కా సాత్ -సబ్కా వికాస్-సబ్కా విశ్వాస్”. అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతని లక్ష్యంగా చేసుకొని దేశంలో ప్రజల ఆశీర్వాదం పొందుతూ ప్రపంచంలోనే అత్యధిక శక్తివంత దేశంగా తీర్చిదిద్దుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారతదేశం ప్రజలు దీవిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తన బలం పెంచుకుందని తెలియజేస్తూ మండల బిజెపి నాయకులు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి. మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిజెపి మరింత బలపడడానికి ఆకాంక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు. ప్రధాన కార్యదర్శి ఇటికలరాజు. కోసినివిజయ్. ఇటుకల మహేందర్. యాదవ్. బోల్గంభాస్కర్ గౌడ్. బక్క శెట్టి రాజేందర్. రెడ్డి మల్ల నరసింహ. గణేష్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version