రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామాయంపేట పట్టణానికి చెందిన మెక్కొండ శ్రీశైలం అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం అనారోగ్య కారణంతో మరణించాడు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న రామాయంపేట పట్టణానికి చెందిన పుట్టి సందీప్. రొయ్యల నవీన్ ల ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి తన వంతు సహాయంగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇదే కాకుండా వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని పిల్లల చదువు గాని ఇంకేమైనా ఆర్థికంగా అవసరమన్నా కూడా ఎల్లవేళలా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రామాయంపేట పట్టణానికి చెందిన పదో వార్డ్ యూత్ సభ్యులు మార్కు సతీష్. చిలుక విరాట్. కిరణ్ సాగర్. మెక్కొండా వికాస్. శ్రీకాంత్ సాగర్. చిలుక రమాకాంత్. దేవుని రంజిత్. తదితరులు పాల్గొన్నారు.