రైతు భరోసా నిధులు విడుదల చేయాలి
బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరీ కుమార్
మొగుళ్లపల్లి నేటి దాత్రి
పంట పెట్టుబడికి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు దేవును రీ కుమార్ డిమాండ్ చేశారు యాసంగి సీజన్ ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని .
పంట సాయం అందకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తిగతం చేశారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రైతులను పట్టించుకోకుంటే తగిన గుణపాఠం తప్పదు అన్నారు వెంటనే రైతులకు పంట సాయం అందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారుఅలాగే, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రాష్ట్రంలోని రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలని కోరారు. తమది రైతు ప్రభుత్వం అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతుల సమస్యల పరిష్కారంలో, రైతుల ఆత్మహత్యల నివారణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
