యూరియా బ్లాక్‌పై రైతుల ఆందోళన హెచ్చరిక…

యూరియా ను రైతులకు పూర్తిస్థాయిలో అందించాలి

కొండు బానేష్ జిల్లా కార్యదర్శి రైతుసంఘం

మంచిర్యాల19ఆగస్టు నేటి దాత్రి

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలలో ఫర్టిలైజర్. డీ. సీ. ఎం. ఎస్. హాక. పి ఎ సి ఎస్. సెంటర్ల ద్వారా రైతులకు ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్న డీలర్లపై తనిఖీలు చేపట్టాలి.
యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్న ఎరువుల షాపులను రద్దు చేయాలి.
రైతులకు ఎరువులను సబ్సిడీ ద్వారా ఇవ్వకుండా అధికంగా వసూలు చేస్తున్న డీలర్ల లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేయాలి.
యూరియా ఎంఆర్ పి 266.5 రూపాయలు ప్రభుత్వం నిర్ణీత రేటు కంటే ఎక్కువ నమ్ముతున్న డీలర్లపై కేసులు నమోదు చేయాలి.
యూరియా కొరతను ఆసరాగా చేసుకుని రైతులను నిలువునా దోచుకుంటున్న వ్యవహారంపై వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వ నిర్ణీత ధరలకే డీలర్లు అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.
సబ్సిడీ ద్వారా రైతులకు అందాల్సిన ఎరువులు పక్కదారి పట్టకుండ దళారుల చేతులలోకి పోకుండ చూడాలి.
ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టకపోవడం వల్ల దళారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రైతులని నిలువునా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామ. మండల కేంద్రాలలో కొనసాగుతుంది.
ఒక్కో యూరియా బస్తా మీద 80 నుండి 100 రూపాయలు వరకు వసూలు చేస్తున్నారు.
కానీ రైతులకు బిల్లులు ఇవ్వడం లేదు ఫర్టిలైజర్ షాపులపై అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలని ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు యూరియా తదితర ఎరువుల కొరత సృష్టించి పేద మధ్య తరగతి రైతులకు అధిక ధరలకు ఎరువులను అమ్ముతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
మారుమూల ప్రాంతాల్లో ఊరుకోక ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేసుకొని పేద మధ్య తరగతి రైతుల నడ్డి విరుస్తున్నారు.
ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు తనిఖీ చేస్తూ వారి పైన చర్యలు తీసుకోవాలి.
లేని యెడల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version