గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలి.

Geeta workers Geeta workers

గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:

తాడి చెట్టుపై నుండి జారీ పడి మృతి చెందిన గీత కార్మికులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్,డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ లు కోరారు.మండలంలోని కంటయపాలెం గ్రామానికి చెందిన పల్లె యాకయ్య గత 25 రోజుల క్రితం తాటి చెట్టు పైనుండి పడి వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పల్లె యాకయ్య గౌడ్ కుటుంబాన్ని గౌడ సంఘల ప్రతినిధులు,గోపా నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు మండలంలో తాటి చెట్టు నుంచి పడి చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం గీతా కార్మికుల కొరకు సేఫ్టీ మోకులు వెంటనే ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఐదు లక్షల ఎక్సిగ్రేషియా కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సహకార పరపర సంఘం అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గౌడ్,కౌండిన్య సహకార పర్పస్ సంఘం కార్యదర్శి కుంభ మహేష్ కుమార్ గౌడ్, ట్రెజరర్ పరిదీలా వెంకటేశ్వర్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు చీకటి అశోక్ గౌడ్, ముఖ్య సలహాదారులు గట్టు కమలాకర్ గౌడ్,కంఠ మహేశ్వర గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్, గ్రామ గౌడ సంఘ పెద్దలు పల్లె సర్వయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!