లక్ష మెజారిటీ తెచ్చే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలి-అశోక్ గౌడ్ బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు

60ఏండ్లలో చేయాలేని అభివృద్ధి పదియేండ్లలో చేసి చూపాడు-గ్రామ అధ్యక్షులు పల్లెబోయిన రాజు

పరకాల నేటిధాత్రి

శనివారం రోజున హనుమకొండ జిల్లా పరకాల మండలం లోని లక్ష్మీపురం గ్రామంలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ ఇంచార్జ్ నేతాని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ టిఆర్ఎస్ అధ్యక్షులు ఆముదాలపెల్లి అశోక్ గౌడ్ మాట్లాడుతూ పరకాలలో గత 60 సంవత్సరాల నుండి చేయలేని అభివృద్ధిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరేడ్డి పది సంవత్సరాల్లో చేసి చూపించాడని అన్నారు. పరకాల అభివృద్ధి ప్రదాత చల్లా పై పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు వెనుకంజ వేస్తున్నారని అన్నారు.అనంతరం బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పల్లెబోయిన రాజు మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక కుటుంబ సభ్యుడిగా కష్టపడి లక్ష భారీ మెజార్టీ తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిలువేరు మొగిలి,సమన్వయ కమిటీ సభ్యులు గురిజేపల్లి ప్రకాష్ రావు,మునగాల సురేందర్ రావు,కోరే రమేష్, మంగళపల్లి రాజయ్య,మాజీ ఏఎంసి డైరెక్టర్ దానం నిరంజన్,పల్లెబోయిన సురేష్,మాజీ ఎంపిటిసిలు పల్ల బోయిన రాజయ్య,బండారి నారాయణ,యూత్ నాయకులు బుర్రి వెంకటేష్,పల్లెబోయిన రాజేష్, పలు కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *