# ఘనంగా దొడ్డి కోమరయ్య 68 వ వర్ధంతి.
నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని ఆయన పోరాట స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కోమరయ్య 68 వ వర్ధంతి సందర్భంగా గురువారం నర్సంపేట అంబేద్కర్ సెంటర్ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంజాల రమేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా గ్రామాల్లో దొరల భూస్వాముల పటేల్ పట్వారి పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కడివండి గ్రామంలో దొర గడి ముట్టడించే కార్యక్రమంలో తుపాకీ గుండుకు నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో 4 వేల గ్రామాల్లో ఎర్రజెండాలు పాతి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిన భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన నిలబడిందన్నారు.ఆనాడు సాగిన సాయుధ పోరాటాన్ని నేడు బిజెపి ప్రభుత్వం హిందూ ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి మతం రంగు పూయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల కార్యదర్శి గడ్డం యాకయ్య, జిల్లా నాయకులు ఇల్లందుల సాంబయ్య గడ్డం నాగరాజు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతయాకుబు, మహేందర్, హంస మంజుల, అమూల్య, పాలక పవన్, సమ్మక్క, దివ్య తదితరులు పాల్గొన్నారు.