ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతని ఇస్తుందని తెలియజేస్తూ .నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిది ఒక వరంలో మారాయని కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుంది అని తెలియజేస్తూ లక్ష్మి పూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చందు ఆధ్వర్యంలో 45 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఇట్టి చెక్కులు రావడానికి కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చెక్కులు రావడానికిసహకరించిన పెద్దలందరికీ లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు మునిగే ప్రభాకర్ నందగిరి ఆంజనేయులు మహేష్ తక్కల్ల ఆంజనేయులు గణేష్ తదితరులు పాల్గొన్నారు