కుక్క ముడి సంపత్ కు దళిత రత్న అవార్డు
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండలం బస్వ రాజుపల్లి గ్రామానికి చెందిన కుక్క ముడి పోచమ్మ పోశయ్య కుమారుడు కుక్క ముడి సంపత్ వైద్య రీత్యా కొత్తగూడెం లో నివసిస్తున్నారు ఈయన గత 35 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్న భద్రాది కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలానికి కుక్కమూడి సంపత్ ను రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుకు ఎంపిక చేసింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ 134వ జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటుక రాజు రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా స్థానికులు కు సుపరిచితులుగా ఉంటూ పలు రకాల సేవ కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం వహిస్తూ పేదలకు తన వంతు సహాయం అందిస్తున్నారు డయాబెటిస్ రోగులకు ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు ఔషధాలు ఏర్పాటు చేస్తున్నారు సంపత్ కు ఈ అవార్డు దక్కడం పట్ల బస్వ రాజు పల్లి కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు హర్షం వ్యక్తం ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభకు దక్కిన పురస్కారం గా అభివర్ణించారు భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవార్డులు దక్కాలని కోరుకున్నారు