శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మరణించిన బాధిత కుటుంబసభ్యులను మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనచారి శుక్రవారం పరామర్శించారు. కాట్రపల్లి గ్రామానికి చెందిన అనారో గ్యంతో బాధపడుతున్న గిద్దె మారి రాజును పరామ ర్శించారు. సంఘాల థామస్ ను పరామర్శించారు. బొమ్మ కంటి శాంతి కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పిట్టల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. సాధన పల్లి గ్రామంలో ముత్యం రాజును పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. రాజు పల్లి గ్రామంలో మాదారపు మలహలరావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. వీరందరికీ పార్టీ పరంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షులు గుర్రం రవీందర్, పిఎసిఎస్ డైరెక్టర్ బగ్గి రమేష్, కాట్రపల్లి మాజీ ఉపసర్పంచ్ అజ్మీర జోయ్, ఒంటేరు జనార్ధన్, గౌస్, గజ్జెల రాజు, తదితరులు చారి వెంట ఉన్నారు.
