చలో జోడెన్ ఘాట్ ను విజయవంతం చేయాలి
“తుడుందెబ్బ” పిలుపు.
కొత్తగూడ, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రము లోని ఆదివాసీలు తమ అస్తిత్వం ను,కోల్పోయి బ్రతుకు జీవుడా అంటూ అభివృద్ధి కి దూరంగా,ప్రభుత్వ, సంక్షేమ పధకాలకు నోచుకోకుండా,ఆదివాసీ నిరుద్యోగ యువత కు ఉద్యోగ కల్పన,ఉపాధి,లేక పోవడం తో,తీవ్ర మనో వేదనకు గురౌ తున్నారని,రాష్ట్రము లోని ఆదివాసీల భూములు వలస వాదుల,అదీనం అక్రమంగా దోపిడీ కి గురైన విధానము ను గిరి గ్లాని కమీషన్ రిపోర్ట్ తేట తెల్లం చేసిన విషయం,ప్రభుత్వా లకు తెలిసినా ఆదివాసీల దోపిడీ చేసిన వర్గాలకే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు, వంతపాడుతున్నాయని,ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేకంగా స్వయం పాలన అధికారం అమలులో ఉందనే నిజo తెలిసినా పాలకులు తమ రాజకీయ అధికారం కోసం ఆదివాసీలను అణిచి వేసే ధోరణి తో ఆదివాసీల పై,కుట్ర పూరిత విధానాలు అనుసరించి చొర బాటుదారుల తో ఆదివాసీ ప్రాంతం ను చిన్నా భిన్నం చేస్తూ ఆదివాసీ ల మనుగడ కు తీవ్ర ఆటంకం కల్గిస్తున్న భూర్జవ రాజకీయ పార్టీలు,వలసవాద గిర్జనేతరుల,భారీ నుండి ఆదివాసీలను కాపాడు కునేందుకు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ,రాష్ట్ర మహాసభ లను ,చలో జోడెన్ ఘాట్ ఏప్రిల్ 12,13, 14 తేదీలలో రాష్ట్ర మహా సభలు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,కెరమేరి మండలం, కొమురం భీమ్ యుద్ధ భూమి అయిన జోడెన్ ఘాట్ లో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది, ఈ రాష్ట్ర మహాసభల కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత MLC ప్రొపెసర్ ఆచార్య కోదండరాం, ఓయూ ప్రిన్సిపాల్ ప్రొపెసర్ కాశిం, విశ్రాంత ప్రొపెసర్ హరగోపాల్ లు హాజరై ప్రసంగిస్తారాని,ఈ మహా సభల విజవంతం కోసం తుడుందెబ్బ రాష్ట్ర,జిల్లా మండల ముఖ్య నాయకత్వం హాజరై విజయవంతం చేయాలనీ తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ఆగబోయిన రవి, ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ,అవరణం లో జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగ రావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో పిలుపునిచ్చారు,సమావేశం లో అల్లెం జంపయ్య,సిడం రమేష్,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,సతీష్,తదితరులు పాల్గొన్నారు…