తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు. తొలుత పలమనేరు ఫుట్ వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణం నందు మొత్తం 42 దుకాణాలు ఉన్నాయని అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల వల్ల తమ తీవ్రంగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఫుట్ పాతులపై విక్రయాలు జరుగుతుండడంతో తామ తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికే ఆన్లైన్ బిజినెస్ ద్వారా తమ వ్యాపారాలు 50 శాతానికి పడిపోయాయని ఇతర ప్రాంతాల వారితో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి పట్టణానికి దూరంగా వారు వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ రుణాలను అందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జగా, జాకీర్ రాఘవేంద్ర, కాలేషా తదితరులున్నారు.
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి…
వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చొరవ చూపాలని వీఆర్ఏల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల పై నిబంధనలకు విరుద్ధంగా మోపిన నైట్ డ్యూటీలు, ఇసుక,రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు వెంటనే నిలిపివేయాలని కోరారు. తెలంగాణలో ఇస్తున్నట్లు వీఆర్ఏలు అందరికీ పేస్ కేల్ జీతాలు చెల్లించాలని, డీఏను జీవితంలో కలపాలన్నారు. గతంలో వైసిపి పాలనలో రికవరీ చేసిన డి ఏ నగదును తిరిగి చెల్లించాలని ఇంటర్మీడియట్ విద్యా అర్హతల ఆధారంగా ప్రమోషన్లు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీఆర్ఏల సంఘ నాయకులుతో పాటు, కార్మిక సంఘ నాయకులు ఓబుల్ రాజు పాల్గొన్నారు.
మట్టి దొంగల చేతిలో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ ఆస్తులు
గుడ్లప్పగిచ్చి చూస్తున్న అధికారులు
నాకు రాజకీయ పలుకుబడి ఉంది
ఆనాడు పెట్టుబడి పెట్టా.. ఇప్పుడు సంపాదించుకోవడం తప్పా?
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో మట్టి తరలింపునకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక వెయ్యి క్యూబిక్ మీటర్లు తరలింపునకు కోమండ్లపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తికి నాలుగు లారీల ద్వారా పరిమిషన్ ఇచ్చియున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సంబంధిత కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో వాహనాల ద్వారా మట్టిని తరలించడమే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక ట్రాన్స్ఫార్మర్, మూడు విద్యుత్ పోలను విరగగొట్టి మట్టిని తరలించుచున్నారు.
Goervnment
ఈవిషయమై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు పర్మిషన్ ఇచ్చామని తెలిపారు. పరిమిషన్ రైతులకు ఇచ్చినట్లయితే సంబంధిత చెరువులో పదుల సంఖ్యలో ర్యాలీలు గ్రామపంచాయతీ ముందు నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తుంటే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి కళ్ళున్న గుడ్డివాడి లాగా ప్రవర్తించడం మండలంలోని ప్రజలను విష్మయానికి గురిచేస్తుంది. విద్యుత్ పోల్లు మరియు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం విషయమై సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ కమలేష్ ను వివరణ కోరగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని పోలీస్ శాఖ వారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.
Goervnment
ఇరిగేషన్ శాఖ ఏఈ రఘురాంను వివరణ కోరగా సమాచారం అందించిన పిదప మేము వర్క్ ఇన్స్పెక్టర్ మల్లయ్యను మోఖాపై పంపి రెండు ఎక్సావేటర్ లను సంబంధిత టిప్పరులను నిలిపివేయడం జరిపామని సంబందిత ఫోటోలు పంపడం జరిగినది. ఒక అధికారి ఎంతవరకైతే మార్కింగ్ ఇచ్చారో అంతవరకు మాత్రమే మట్టి తరలింపునకు ఆస్కారం ఉంటుంది. అలాంటిది సంబంధంలేని వెహికల్ ద్వారా ఇష్టానుసారంగా పరిమితికి మించి మట్టిని తరలిస్తున్న సంబంధిత ఏఈ రఘురాం మోఖాపై వెళ్లి పరిశీలించకుండా నిమ్మకు నీరేత్తినట్లు ఉండడం చూస్తుంటే వారిచ్చిన అమ్యామ్యాలకు తలోగ్గి నిమ్మకు నీరెత్తి ఉన్నట్లు గ్రామ, మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
Goervnment
ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని మార్కింగ్ ఇచ్చిన స్థలంపై కాకుండా ఇంకా ఎన్నాచోట్ల నుండి మట్టిని తోలగించారో పూర్తి విచారణ జరిపడంతో పాటు ఎన్ని వాహనాల ద్వారా మట్టి తరలింపు జరిగిందో ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలించారో లెక్కగట్టి ఒక్క క్యూబిక్ మీటర్ ఎక్కువ తరలించిన సంబంధిత కాంట్రాక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకొని పరిమిషన్ లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయవలసిందిగా మండల ప్రజలు అధికారులను పత్రికా ముఖముగా కోరుకుంటున్నారు. ఈవిషయమై పలుమార్లు ఫోన్ ద్వారా వివరణ ఇవ్వాలని కోరగా మంగళవారం సంబంధిత ఏఈ రఘురాం మోకాపై వచ్చినప్పుడు మోకాపై నుండి వాహనాలను వెళ్ళగొట్టామని తెలియపరిచారు. ఏఈ మోఖాపై ఉన్నప్పుడు పదుల సంఖ్యలో వాహనాలు ఉన్న ఎందుకు సీజ్ చేయకపోవడం లేదో చూస్తుంటే కళ్ళున్న గుడ్డివాళ్ళ లాగా అధికారులు నటిస్తున్నారని మండలంలోని ప్రజలు బహుబాటంగానే చర్చించుకుంటున్నారు
బార్ అధ్యక్షులు వలుసా సుదీర్ ను కలిసిన వరంగల్ పోపా :-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
ఇటీవల వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సుధీర్ వలుస ను వరంగల్ బార్ అంబేద్కర్ హాల్ లో పోపా కార్యవర్గం మంగళవారం శాలువా, పూల మాల తో ఘనంగా సన్మానంచించారు. ఈ సందర్బంగా పోపా రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ, 20సంవత్సరాల తర్వాత వరంగల్ బార్ అధ్యక్షులు గా పద్మశాలి ఉండటం పద్మశాలి కులానికి గౌరవం దక్కిందని, భవిష్యత్తులో మన సామజిక వర్గానికి వన్నె తేవాలని కోరారు.న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వరంగల్ పోపా అధ్యక్షులు గుండు కామేశ్వర్ మాట్లాడుతూ,యువ న్యాయవాది సుధీర్ బార్ అధ్యక్షులుగా విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రతినిధులు గోషికొండ సుధాకర్, ధర్మపురి రాజగోవింద్, పాము శ్రీనివాస్, మాటేటి అశోకకుమార్, న్యాయవాదులు నల్ల మహాత్మ, అనుమాండ్ల రాజకుమార్, మెరుగు సుభాష్, చెన్నూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు
తూర్తి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. జయంతి ఎందుకు జరుపుకుంటారు అని వివరించారు.
కథలపూర్ మండలంలోని తూర్తి గ్రామంలో. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అంబేద్కర్ గురించి అన్నో చెప్పుకొచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14.1891జన్మిచారు. భారత రాజ్యాంగన్ని రూపొందిచడంలో మరియు సామజిక సమానంత్వం కోసం పోరాడారు అయన కీలక పత్రను గౌరవిస్తూ దేశవ్యాప్తంగాఅంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటారు.
నేటి ధాత్రి కథలాపూర్
అంబేద్కర్ ఎక్కడ జన్మిచారు. అసలు పేరు బీంరావ్ రంజి అంబేద్కర్. జననం.1891ఏప్రిల్ 14.మౌ సెంట్రల్ ప్రావిన్సు బ్రిటిష్ ఇండియా.మరణం.1956 డిసెంబర్ 6. ఢిల్లీ భారతదేశం అయన రాజకీయ పార్టీ. షెడ్యూల్ కులాల సంఘం *ఇతర రాజకీయ పదవులు.రిపబ్లిక్ పార్టీ ఇండిపెండెంట్లేబర్ పార్టీ.
భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పాత్ర ఏమిటి ?
భారత రాజ్యాంగ రూపశిల్పి. అంబేద్కర్ చేసిన అత్యంత ముఖ్యమైన సహకారం భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అతని పాత్ర పౌరులందరికీ ప్రాథమిక హక్కులు మరియు సమాన అవకాశాల కోసం వాదించారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి. ఆర్టికల్ 17. మరియు సామాజిక న్యాయాన్ని నిర్ధారించడానికి నిబంధనలను ప్రవేశపెట్టింది.
*అంబేద్కర్ చరిత్ర ఏమిటి ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత. సంఘ సంస్కర్త ఇతను అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడుఅతను స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి. చెప్పారు.భారతీయ సమాజాన్ని ఎవరైనా చీకటి నుండి వెలుగులోకి నడిపించారంటే అది ఆయనే. అని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ నినాదాలతో. పూల మాలలు వేసి స్వీట్ పంపిణి చేసిన అంబేద్కర్ యూవజన సంఘం సభ్యులు. మరియు తూర్తి గ్రామ సభ్యులు. యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆదివారం గీసుగొండ మండల కేంద్రంలో కీర్తిశేషులు తుప్పరి సూర్యనారాయణ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు తుప్పరి వికాస్ ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం గీసుగొండ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దౌడు అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు.రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశాకిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
రక్తదానం మహాదానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని.. ఏనుగొండ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగరంలోని ఏనుగొండ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఎస్విఎస్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మరియు ఉచిత మెడికల్ క్యాంపు శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త దాతలను ఆయన ప్రత్యేక అభినందించారు. ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ సభ్యులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకు యూత్ కాంగ్రెస్ నాయకులను ఆయన అభినందించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు కిరణ్, వెంకటేష్ గౌడ్, సాయిబాబా, ప్రవీణ్ కుమార్, సంజీవ్ రెడ్డి, అబ్దుల్ హక్, సంజీవ్ రెడ్డి, పురుషోత్తం, చర్ల శ్రీనివాసులు, అశ్వాక్, మురళీధర్ గౌడ్, శాంతి కుమార్, మహ్మద్ కలీం, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
పి ఆర్ టి యు ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సంకా బద్రి నారాయణ నియామకం
మహబూబాబాద్/ నేటి ధాత్రి
పి ఆర్ టి యు టి ఎస్ ఎన్నికల క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పి ఆర్ టి యు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు భూక్యా రామోజీ నాయక్ మరియు మండల ప్రధాన కార్యదర్శి కాపర బోయిన సుజాత మరియు జిల్లా రాష్ట్ర బాధ్యులు. మరియు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కి రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు.
కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ముంజల సుజాత కుటుంబానికి 20వేల రూపాయల ఖరీదు గల కుట్టు మిషన్ సహాయం —————— KANA ప్రతినిధులకు తెలంగాణ గౌడ సంఘం తరఫున అభినందనలు ధన్యవాదాలు ——————- వర్దన్నపేట (నేటిదాత్రి):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నల్లబెల్లి గ్రామానికి ముంజల సుజాత భర్త అనిల్ వయసు 30 సంవత్సరాలు భర్త అనిల్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీదనుండి కిందపడి హాస్పిటల్ తీసుకువెళ్లగా చనిపోవడం జరిగింది. సుజాత అతి చిన్న వయసులో భర్త ను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాశ్రయురాలుగా జీవనం గడుపుతున్నది. పేదరికంలో ఉన్నారని వీరికి సంబంధించిన వివరాలు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్ మరియు జనగామ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ గారి ద్వారా విషయం తెలుసుకున్న. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా టెస్ట్ సభ్యులు వెంటనే వారి కుటుంబానికి రూ.20 వేల ఖరీదు గల కుట్టు మిషన్ మరియు గార్మెంట్స్ ను సాయం చేశారు ఈరోజు గడ్డం రాజు గౌడ్, మరియు పట్టాపురం ఏకాంత గౌడ్ KANA స్థానిక వాలంటీర్లు నాతి గణేష్ వారి సహకారంతో అందజేశారు. ముందుకి వచ్చి సహాయం చేసినందుకు KANA కానా సంస్థని తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు మరియు నల్లవెల్లి గ్రామ గౌడ సంఘం తరపున కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నల్లబెల్లి గ్రామం మాజీ సర్పంచ్ ముత్యం సంపత్ గౌడ్ గౌడ సంఘం గిరగాని యాదగిరి గౌడ్ ముత్యం పాపయ్య అంబాల సంపత్ గౌడ్ అంబాల యాకన్నా బొమ్మెర రాజు గౌడ్ బొమ్మెర ఎల్లగౌడ్ ముత్యం అనిల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు
ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ఎండీ. విలాయాత్ అలీ(25) ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో 489.5 మార్క్స్ తో రాష్ట్రస్థాయిలో 86వ ర్యాంక్ జోనల్ స్థాయిలో BC-E కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించారు. విలాయాత్ అలీకి ఈ రోజున ఐనవోలు తహసీల్దార్ K. విక్రమ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించి మొమెంటో అందజేసినారు. మరియు పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినారు. విలాయాత్ అలీ మాట్లాడుతూ నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం డిప్యూటీ కలెక్టర్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దిగువ మధ్యతరగతి కుటుం బానికి చెందిన నేను నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో. గ్రూప్-1 లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంక్ సాధించినట్టు తెలిపాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి గ్రూపు -1 కి సన్నద్ధం అయ్యను అని తెలిపినారు ఇట్టి సన్మానం కార్యక్రమంలో తహసీల్దార్ K. విక్రమ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ K. అనిల్ కుమార్, మండలం గిర్థవర్ శ్రీమతి రేగొండ రాణి, అదనపు గిర్థవర్ మరుపట్ల మల్లయ్య, ASO, మండల సర్వే యర్, కార్యాలయం సిబ్బంది మరియు పున్నెల్ గ్రామస్తులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి.
సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరు టీములుగా ఏర్పడి జిల్లాలోని 12 మండలాలు గ్రామాలలో ప్రజాస్థానిక సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తారీఖున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేష్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు తెలిపారు
మత సామ్రస్యానికి ప్రతీకంగా ఉన్న మహాదేవపూర్ లో దారుణం.
మీనార్ ల ధ్వంసం ముస్లిం సమాజాన్ని గాయపరిచింది.
ఖబ్రస్తాన్ మీనార్ లపై దుండగల దుశ్చర్య, పోలీస్ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలి.ముస్లింలు.
మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే చర్యలు తప్పవు, ముస్లింలకు పోలీస్ భరోసా,
Ramadan
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
మతసామ్రస్యానికి మారుపేరు మహాదేవపూర్, దశాబ్ది కాలం నుండి కులాలు మతాలు అనే వ్యత్యాసం లేకుండా మానవత్వమే తమ కులం గా భావిస్తూ కలిసికట్టుగా జీవిస్తున్న మహా మండల కేంద్రానికి, ఏమైందో తెలవదు కానీ, ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఖబ్రిస్తాన్ గేట్ వద్ద ఉన్న రెండు మీనార్ లను ధ్వంసం చేయడంతో, తెల్లవారుజామున చుట్టుపక్కల ఉన్నవారు గమనించి మైనారిటీలకు సమాచారం ఇవ్వడం జరిగింది. ముస్లింలు పవిత్రంగా భావించే ఖబరస్తాన్ ప్రధాన గేటు వద్ద ఉన్న మినార్లు గత 15 రోజుల క్రింద ఏర్పాటు చేయడం జరిగింది. మీనార్ల ను ధ్వంసం చేసిన సమాచారం తెలవగానే పెద్ద మొత్తంలో మైనార్టీలు కబ్రిస్తాన్ వద్దకు చేరి చూడగా ప్రధాన గేటు వద్ద అమర్చిన రెండు మీనార్లను 50% వరకు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఉండడంతో ముస్లిం మైనార్టీలు మనస్థాపానికి గురికావడం జరిగింది. తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది.
పవిత్ర రంజాన్ మాసంలో, దారుణం.
Ramadan
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాదేవపూర్ మండలం అనేక సంవత్సరాలుగా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ మతాల మధ్య ద్వేషాలు చిచ్చు లాంటి సంఘటనలు మండలంలో ఎన్నడు చోటు చేసుకోలేదు, అన్న విషయం, ప్రజలతో పాటు పోలీస్ రికార్డులో కూడా మహాదేవపూర్ మండల ప్రజల మధ్య ఉన్న ఐక్యత సూత్రాలుగా చెప్పుకోవచ్చు.
అలాంటి మండలంలో పవిత్ర రంజాన్ మాసం లో సోదర భావంగా మెలిగే ప్రజల మధ్య అబ్రస్తాన్ మీనార్ల ధ్వంసం లాంటి దారుణ వ్యవహారం తెరపైకి రావడం ముస్లిం సమాజంలో కాస్త నిరాశను కల్పించింది.
స్థానిక ముస్లిం గ్రామ పెద్దలు గుర్తు తెలియని వ్యక్తుల విశ్చర్యపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ముస్లిం గ్రామ పెద్దలు మండల కేంద్రానికి సంబంధించిన ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలను వాస్తవాలను పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది.
మండలంలో ఇలాంటి దారుణాన్ని కూడగట్టడం ముస్లింలను ఆవేదనకు గురి చేసిందని గ్రామ పెద్దలు పోలీసులకు వివరించారు.
కుల మత తేడా లేకుండా మానవత్వమే తమ మతంగా దశాబ్దాలుగా ముందుకు వెళుతున్న మండల కేంద్రంలో ఇలాంటి దారుణాన్ని పురుడు పోసిన వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం మత పెద్దలు పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో పేర్కొన్నారు.
Ramadan
మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే చర్యలు తప్పవు, ముస్లింలకు పోలీస్ భరోసా.
కబ్రిస్తాన్ మీనార్ లా ధ్వంసం విషయంపై స్థానిక ముస్లిం గ్రామ పెద్దలు పోలీసులు ఆచరించడంతో, స్థానిక పోలీసులు అలాగే మహదేవపూర్ డిఎస్పి ముస్లింలకు భరోసా కల్పిస్తూ, మనోభావాలకు దెబ్బతీసే విధంగా దుశ్చర్యలకు పాల్పడితే ఎవరైనా సహించేది లేదని,ఖబ్రస్తాన్ మీనార్ల ను ధ్వంసం చేసిన వారిని సాధ్యమైనంత త్వరలో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముస్లిం మైనారిటీలు పోలీసులపై నమ్మకంతో ఉండాలని, మీ యొక్క మనోభావాలు కించపరచడం జరిగిన విషయం వాస్తవమే కానీ, ముస్లిం యువకులు గ్రామస్తులు సమన్వయం పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని, దుశ్చర్యలకు పాల్పడిన వారిని శిక్షించక తప్పదని మైనారిటీలకు పోలీస్ శాఖ భరోసా కల్పించడం జరిగింది.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని అభినందించిన ఎమ్మెల్యే
పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 23:
పలమనేరు బారసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్. భాస్కర్ ను పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమర్నాథ్ రెడ్డి ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఎల్.భాస్కర్ కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్,గౌరవ అధ్యక్షులు కె.లక్ష్మీపతి,కార్యదర్శి బర్కత్, ఉపాధ్యక్షులు షేక్ షరిఫ్, చంద్రశేఖర్, సహ కార్యదర్శి జి. ఆర్. రవి, సీనియర్ న్యాయవాదులు భగీరథ కుప్పరాజు, ఎస్. రెడ్డెప్పశెట్టి, రాజా రెడ్డి, కె.జగదీశ్, ఎస్.లక్ష్మణ్ రెడ్డి,ఇ.కృష్ణ, ఎన్. నారాయణ రెడ్డి,పి.ఆర్.లోకేష్, బి.గిరీష్,రాజు,రాజీవ్ గాంధీ, రాజశేఖర్,సుబ్బారామయ్య,సంధ్య, పుష్పాంజలి,చాందిని పలువురు న్యాయవాదులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..
· Demonetization with the aim of controlling black money
· GST implemented throughout the country
· Brought new education policy
· Welcome to foreign direct investment
· Main concentration on privatization
HYDERABAD , NETIDHATHRI : The economic policies of Narendra Modi Government mainly concentrated on privatization and liberalization of the economy. It totally based on neo-liberal framework. Modi liberalised the foreign direct investment in India, allowing more foreign investments in several industries including defence and railways. The first eight years of Modi’s Premiership India’s GDP grown at an average 5.5% compared to 7.03% under the previous government. This was attributed to 2016 demonetization which was an issuance of new bank notes in an effort to curtail black money and market as well as the efforts of the Goods and Service Tax the biggest tax reform in the country since Independence. Modi labour reforms received support from World Bank, opposition Socialist and Communist policies, scholars, workers rights groups within the country. The labour laws also drew strong opposition from unions: on 2 September 2015, eleven of the country’s largest unions went on strike, including one affiliated with the BJP. The strike was estimated to have cost the economy $3.7 billion. The new premiership also took new measures such as expanded health insurance, a national dialysis programme and more government run pharmacies offering low-cost medicines. While private health care providers welcomed these steps, public health experts expressed concerns that public health care funding remains inadequate and public health services were being outsourced to private the private sector. The COVID-19 pandemic led to major economic fallout in India, with a rise in poverty, unemployment, and a recession. In May 2020, Modi announced an overall economic stimulus package worth ¹ 20 lakh crore. The Government entered into significant agreements with General Electric and Alstom to supply India new with 1000 diesel locomotives as part of a broader effort to reform the Indian Railway system, which also encompassed privatization initiatives. In 2015, December Modi administration signed an agreement with Japan to jointly develop high-speed rail network connecting Mumbai and Ahmedabad. Under his leadership the Railway budget was merged with the Union Budget of India. Additionally, the date for presenting the budget was changed from 28 February to 1 February, and the financial year was adjusted from July to April. Moreover, the distinction between planned and non-planned expenditure was abolished. The Modi government also dismantled the Foreign Investment Promotion Board (FIPB), which had been viewed as a barrier to foreign direct investments. Other reforms The Government has increased the Budget for National Mission for Green India from Rs. 290 Crore to 361.69 Crore. The public expenditure on education including technical education as a percentage of GDP for the year 2013-2014 was 4.44% which was later reduced to 4.35% in the year 2014-2015 and was later increased to 4.56% in the year 2015–2016 by Modi Government. The government substantially increased the percentage of central revenue directly granted to states, while decreasing the amount granted through various central government programs. Overall, states’ share of revenue increased marginally. The criteria upon which individual states’ allocation was determined were changed, such that the revenue to 19 states increased, and that of 10 states decreased. Only one of the ten states was ruled by the BJP when the policy was enacted. On 25 June 2015, Modi launched a program intended to develop 100 smart cities. The “Smart Cities” program is expected to bring IT companies an extra benefit of ¹ 20 billion (US$230 million).[36] He also launched a “smart villages” initiative, under which villages would be given Internet access, clean water, sanitation, and low-carbon energy, with Members of Parliament overseeing the program’s implementation. Give up LPG subsidy was a campaign launched by Modi in March 2015. It was aimed at motivating LPG users who can afford to pay the market price for LPG to voluntarily surrender their LPG subsidy. Maharashtra, Uttar Pradesh, Karnataka, Delhi and Tamil Nadu are the top five states to give up the subsidy. Modi launched Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) in August 2014. The initiative aimed to create bank accounts and debit cards for 150 million families, and to allow them an overdraft of ¹ 5,000 and accident insurance. Modi government launched the Pradhan Mantri Mudra Yojana (PMMY) in April 2015. Under this scheme, loans up to ¹ 10 lakh are given for non-agricultural activities under the three categories: Shishu (loans up to ¹ 50,000); Kishore (loans from ¹ 50,00 to ¹ 500,000) and Tarun (loans from ¹ 500, 000 to ¹ 1 million). In June 2015, Modi launched the “Housing for All By 2022” project, which intends to eliminate slums in India by building about 20 million affordable homes for India’s urban poor. Modi also launched Pradhan Mantri Ujjwala Yojana (PMUY) on 1 May 2016 to distribute 50 million LPG connections to women of BPL families. The BJP Government formulated the bill after 100 cases of instant triple talaq in the country since the Supreme Court judgment in August 2017. The central government re-introduced the bill in the Lok Sabha on 21 June 2019. The bill was subsequently passed by the Lok Sabha on 25 July 2019 and then by Rajya Sabha on 30 July 2019 and received assent from President Kovind on 31 July 2019. After its enactment, the Act became retrospectively effective from 19 September 2018. However, even after five years since Supreme Court’s invalidation of triple talaq, some of the women petitioners who were abandoned by their husbands, continue to live the life of half-divorcees. In his first year as Prime Minister Modi reduced the amount of money spent by the government on healthcare. The Modi government launched a “New Health Policy” in January 2015. On 2 October 2014, Modi launched the Swachh Bharat Abhiyan (“Clean India”) campaign. The stated goals of the campaign included eliminating open defecation, eliminating manual scavenging, and improving waste management practices.[83][84] The campaign was announced on the anniversary of Mahatma Gandhi’s birthday, and was planned to achieve these aims in five years, or in time for the 150th anniversary of his birth. As part of the programme, the Indian government began the construction of millions toilets in rural areas, as well as efforts to encourage people to use them. The government also announced plans to build new sewage treatment plants. Modi’s government developed a draft policy to introduce a universal health care system, known as the National Health Assurance Mission. Under this plan, the government was to provide free drugs, diagnostic treatment, and insurance coverage for serious ailments, The government announced “Ayushman Bharat” (National Health Protection Mission) in the 2018 Union Budget of India. It is World’s largest health protection scheme, also being called Modi Care. Pradhan Mantri Kaushal Vikas Yojana (PMKVY), a skill development initiative scheme of the Government of India for recognition and standardisation of skills. The government began formulating a New Education Policy, or NEP, soon after its election. This was the third education policy introduced by the Indian government, following those of 1968 and 1986. In July 2020, the government unveiled the National Education Policy 2020, “envisioning an India-centric education system that contributes directly to transforming our nation sustainably into an equitable and vibrant knowledge society by providing high-quality education to all” and making “India a global knowledge superpower”. .
దేశాన్ని ఆర్థిక దుస్థితినుంచి గట్టెక్కిస్తానంటూ 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడమే కాదు, ఇటువంటి విపత్కర పరి స్థితుల్లో దేశానికి సుస్థిరపాలనతో పాటు, దేశ గౌరవాన్ని మరింత ఇనుమడిరపజేస్తానంటూ తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో వివిధ రాష్ట్రాల ప్రజలను సమ్మోహితులను చేసిన నరేంద్ర దామోదర్దాస్ మోదీ పార్టీని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు. అంతకుముందు పార్టీ అధికారంలోకి వచ్చినా కూటమికి నేతృత్వం వహిస్తూ సంకీర్ణపాలనను మాత్రమే అటల్బిహారీ వాజ్ పేయి హయాంలో అందించింది. కానీ తొలిసారి స్పష్టమైన మెజరిటతో 2014 మే 26న దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టడమే కాదు దేశానికి కొత్త దశ, దిశను చూపేందుకు ఉపక్రమిం చారు. ముందుగా ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల నిబంధనలను మరింత సరళతరం చేయడంపై. ఆవిధంగా దేశంలోకి విదేశీ పెట్టుబడులను రావడానికి ఆయన మార్గం సుగమం చేశారు. అదే ఏడాది ఆ యన రెండు దౌత్యపరమైన విజయాలు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. మొట్టమొదటిది సెప్టెంబర్ మధ్యకాలంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను దేశానికి ఆహ్వానించడం, ఈ పర్యటనను విజయవంతం చేయడం. రెండవది అప్పటివరకు మోదీకి వీసా అనుమతిని నిరాకరించిన అమెరికా, వీసా అనుమతినివ్వడం. వెంటనే ప్రధాన హోదాలో నరేంద్రమోదీ న్యూయార్క్లో పర్యటించి అప్పటి యు.ఎస్. అధ్యక్షులు బరాక్ ఒబామాతో చర్చలు జరిపారు. ఈ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక్కడ గుర్తించాల్సింది మరే ఇతర నాయకుడు సాధించని ఒక గొప్ప విజయాన్ని మోదీ సాధించి చూపిన విషయాన్ని గుర్తించాలి. ఏ దేశమైతే వీసా నిరాకరించిందో ఆ దేశమే చివరకు వీసాను ఇవ్వడమేకాదు, దేశ పర్యటనకు ఆహ్వానించడం నిజంగా మోదీ ఖాతాలో న మోదైన గొప్ప విజయం.
నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో జరిగిన సానుకూల పరిణామం హిందువులు జాగృతం కావడం. హిందూత్వను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అప్పటివరకు ఏకతాటిపైలేని హిందువులను సుసంఘితం చేసేందుకు యత్నాలు జరిగాయి. ఇవి చాలావరకు సత్ఫలితాలని చ్చాయనడానికి ఉదాహరణ కమ్యూనిస్టులు క్రమంగా తెరమరుగైపోవడం! కమ్యూనిస్టు భావజా లం క్రమంగా పతన పథంలో ప్రయాణించి ఒకప్పుడు విశేష ప్రాచుర్యం పొంది, ప్రజల అభిమానాన్ని చూరగొన్నప్పటికీ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం అంతరించిపోయే స్థితికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం హిందువుల్లో పెరుగుతున్న చైతన్యం. మైనారిటీల ముసుగులో జరుపుతున్న రాజకీయాలు తమను ఏవిధంగా అథ్ణపాతాళానికి తొక్కేస్తున్నాయో హిందువులకు బాగా అవగతం కావడం. అంతకుముందు ఇంతలా అవగాహన కల్పించిన పార్టీలు లేవు. చైతన్యం తీసుకు రాగలిగే భాజపా అంతగా బలపడలేదు! ఇదే సమయంలో గోహత్య నిషేధ ఉద్యమం మరింత ఊపందుకోవడం విశేషం.
ప్రధాని పదవి చేపట్టాక నరేంద్రమోదీ రెండు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. నిజం చె ప్పాలంటే ఇవి దేశ వ్యవస్థలో సమూల మార్పులకు దోహదం చేశాయనే చెప్పాలి. మొదటిది నోట్ల రద్దు. అంటే రూ.500, రూ.1000నోట్లను రద్దుచేయడం. నోట్లమార్పిడికి చాలా తక్కువ స మయం ఇవ్వడం ద్వారా దేశంలో నల్లధనాన్ని చాలావరకు దెబ్బతీయాలన్న వ్యూహం అనుసరిం చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా ఆయన వెనుకాడలేదు. ప్రజలు కూడా మోదీ ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని గ్రహించి కష్టాలు సహించి, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఈ నిర్ణయం వెనుక సుదీర్ఘమైన, లోతైన ఆలోచన, చర్చలు, మేధోమధనం వున్నాయ న్న సత్యం మరువరాదు. నిజం చెప్పాలంటే నల్లధనం పోగేసుకున్న వర్గాలకు అనుకూలురు మా త్రమే నిర్ణయాన్ని వ్యతిరేకించారు తప్ప ఇతరులెవ్వరూ అడ్డు చెప్పలేదు. ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల పెద్దమొత్తంలో పోగేసుకున్న నల్లధన మార్పిడి కష్టతరం కావడంతో, ‘నల్ల కుబేరులు’ నిం డా మునిగారు. ఇక నరేంద్రమోదీ తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ‘వస్తుసేవల పన్ను’ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) విధింపు. నిజానికి ఇది నాటి యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయమే కానీ, సంకీర్ణ భాగస్వాములనుంచి విపరీతమైన ఒత్తిడి రావడంతో నాటి మ న్మోహన్ ప్రభుత్వం దీన్ని అమలు చేయలేకపోయింది. కానీ నరేంద్రమోదీ దీన్ని తక్షణమే అమల్లో కి తెచ్చారు. దీనివల్ల దేశమంతా ఒకే జీఎస్టీ అమలు కావడమే కాదు, వివిధ రాష్ట్రాలు విధించే రకరాల పన్నుల భారం తగ్గింది. సగటు పౌరుడు ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా, వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కట్టాల్సి వచ్చేది. జీఎస్టీ అమల్లోకి తేవడంతో ఆ సమస్య కు పరిష్కారం లభించినట్లయింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలవల్ల 2015లో 8.2% వున్న జీడీపీ కొద్దిగా నిదానించినా, దీర్ఘకాలంలో సత్ఫలితాలిచ్చాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
2018లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో భాజపా అధికారా న్ని కోల్పోయింది. వీటిల్లో పార్టీకి గట్టిపట్టున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లు వుండటం గమనార్హం. వీటిల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో లోక్సభకు ఎన్నికలు జ రు గనున్న తరుణంలో పలువురు విశ్లేషకులు భాజపా పని అయిపోయిందనే అనుకున్నారు. మరి కొందరు మాత్రం మోదీ ఛరిష్మాకు ఎటువంటి ఢోకాలేదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా 2019 ఫివ్రబరి 14న తీవ్రవాదులు పుల్వామాలో జరిపి ఉగ్రదాడిలో 40మంది పారా మిలిటరీ సిబ్బంది మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు ప్ర తీకారంగా అదేనెల 26వ తేదీన బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై మన వాయుసేన జరిపి న దాడిలో ఉగ్ర ముష్కరులు వందల సంఖ్యలో మరణించారు. మోదీ ప్రభుత్వ సామర్థ్యాన్ని మరోసారి దేశ ప్రజలకు, ప్రపంచ దేశాలకు వెల్లడిరచిన సంఘటన ఇది. పర్యవసానంగా 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పార్టీలు ఇనుమడిరచిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో పాల్గనగా, విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ప్రచారం వెలవెలబోయింది. చివరకు ఈ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి రెండోసారి అధికారాన్ని చేప ట్టింది. అంతేకాదు బీజేపీ పూర్తి మెజారిటీ సాధించడం విశేషం. రెండోసారి పూర్తికా లం ప్రధానిగా కాంగ్రెస్సేతర రెండో నాయకుడిగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న మరో ప్రధాన నిర్ణ యం జమ్ము`కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణాన్ని రద్దుచేయడం. నిజానికి మైనారిటీ బుజ్జగింపులకు అలవాటుపడిన వర్గాలు, పార్టీలు దీన్ని సహజంగానే విమర్శించాయి. కొందరు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఇది కార్యనిర్వాహక శాఖ’ అధికారపరిధిలోనిదంటూ కోర్టు జోక్యం చేసుకోలేదు. ఫలితంగా పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందిన తర్వాత, దశాబ్దాలుగా జమ్ము`కశ్మీర్ అభివృద్ధిని అంధకారంలోకి నెట్టడమే కాదు, కొన్ని లక్షలమంది మైనారిటీలైన హిందువులైన కశ్మీరీ పండిట్లను రాష్ట్రంనుంచి వెళ్లగొట్టిన అంథకార చరిత్రకు అంతం పలకడంలో ఒక అడుగు ముందుకు పడినట్లయింది. ఈ అధికరణం రద్దయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వీచికలు ప్రారంభమయ్యాయి.
2020లో దేశంలో కోవిడ్ మహమ్మారి దేశంలోకి ప్రవేశించింది. దీని విస్తరణను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, దేశీయంగా వ్యాక్సిన్ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా వివిధ బయోటెక్ కంపెనీలను ప్రోత్సహించారు. ఫలితంగా కోవిడ్ షీల్డ్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో అనేక ఇతర పేదదేశాలకుకోవిడ్ వ్యాక్సిన్ను ఉచితంగా అందించడంతో మనదేశ ప్రతిష్ట అనుమడిరచింది. అనేక దేశాలు ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు నరేంద్రమోదీని ఎంతగానో ఇప్పటికీ అభిమానిస్తున్నాయంటే మన ప్రభుత్వం అనుసరిస్తున్న ‘బహుజన హితాయచ…బహుజన సుఖాయచ’ అనే సూత్రాన్ని తు.చ. తప్పకుండా అనుసరించడమే. ఇదే ఏడాది నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. నిజంగా ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరం. ఎటు వంటి ఇబ్బందులు లేకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తగిన లాభంతో విక్రయించుకునేందుకు వీలుకల్పించే ఈ చట్టాలను, వ్యవసాయ రంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఏలుతున్న పంజాబ్, హర్యానాలకు చెందిన బలీయమైన రాజకీయ పలుకుబడి కలిగిన దళారులు వ్యతిరేకించడమే కాదు, వీటిని రైతు వ్యతిరేక చట్టాలుగా విపరీతంగా ప్ర చారం చేశారు. కేవలం ఈ రెండు రాష్ట్రాలకు చెందిన దళారులు చేసిన ఆందోళన వల్ల, దేశవ్యాప్తంగా రైతులు నష్టపోవాల్సి వచ్చింది. వీరికి అనుకూల మీడియా కూడా అసలు నిజాలను దాచి పెట్టి, ఈ దళారులకే వత్తాసు పలకడం, అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా వీరికి అనుకూలంగా మాట్లాడటం సంచలనం సృష్టించింది. ట్రూడో వైఖరి వల్ల ఇరుదేశాల సంబంధాలు గతంలో ఎన్నడూలేని స్థాయికి దిగజారిపోవడం వర్తమాన చరిత్ర. చివరకు ఆందోళనకారులు ఢల్లీిలో ప్రవేశించి ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగరేయడం సంచలనం సృష్టించింది. ఆవిధంగా రైతు ఉద్యమాల ముసుగులో ఖలిస్తానీ వేర్పాటువాదులు ఈ అకృత్యానికి పాల్పడ్డారన్న సంగతి కూడా వెల్లడైంది. అప్పటినుంచి కేంద్రం అప్రమత్తమై, ఖలిస్తానీలపై ఉక్కుపాదం మోపే రీతి లో చర్యలు చేపట్టింది. ఫలితంగా రెండోసారి మళ్లీ రైతు ఆందోళన చేపట్టాలన్న ఈ దళారులు,ఖలిస్తానీల ఆటలు సాగలేదు. మొగ్గదశలోనే ప్రభుత్వం అణచివేసింది. దీంతో మళ్లీ ఢల్లీి ముట్టడి ప్రమాదం తప్పింది.
బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చికెన్ తినే ప్రియులంతా సతమతమవు తున్నారు. మన పక్క రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడం కోళ్లు చనిపోవడంతో మన రాష్ట్రంలో చికెన్ తినాలంటేనే ప్రజలు జంకుతున్నారు. సాధారణంగా చికెన్లు లభించే విభిన్న రకాల ఐటమ్స్ మరి ఇతర వాటిలో లభించకపోవడం తెలిసిందే కావున మాంసం ప్రియులకు చికెన్ తిని ప్రీతిపాత్రమైనది గత 10 రోజులుగా చికెన్ తినాలంటే జనం జంకుతున్నారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని కొనలేని పరిస్థితి లో ఉన్నారని చెప్పవచ్చు బ్లడ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో పౌల్ట్రీ యజమానులు. చికెన్ సెంటర్ యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రామాయంపేట నిజాంపేట నార్సింగ్ మండలాల్లోనీ చికెన్ మరియు కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. చికెన్ కొనడానికి కూడా ప్రజలు ఇష్టపడడం లేదు. దీనితో పాటు గ్రామీణ ప్రాంతాలలో చికెన్ షాపులు మూతపడుతున్నాయి. అదేవిధంగా కోడిగుడ్లు తినాలనుకున్న ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో చికెన్ కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 240 పలికిన చికెన్ నేడు 150 రూపాయలు కాగా 7 రూపాయలు అమ్మిన కోడిగుడ్లు 5
రూపాయలకు తగ్గుముఖం పట్టాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి కనిపించక పోయినప్పటికీ పక్క రాష్ట్రాలలో ఈ ప్రభావం ఉండటం వలన ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉన్నందువలన ఆ ప్రాంతం వారు చెప్పిన మాటలకు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ తినడానికి ఇష్టపడతారు. బంధువులు మిత్రులు వచ్చిన ఫ్రెండ్స్ కలిసిన పార్టీ చేసుకోవాలన్నా ఆదివారం నాడు చికెన్ ఉండాల్సిందే. బర్డ్
ఫ్లూ వ్యాధి కారణంగా చికెన్ తింటే ఏమి అవుతుందో అనే భయంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
భారీగా పెరిగిన మటన్ ధర రూ.కిలో 800..
chicken-and-egg-prices-have-fallen-sharply
చికెన్ సమస్య కారణంగా మటన్ ధర ఒక్కసారిగా కొండెక్కి కూర్చునట్లుగా ఉంది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినకపోవడం వలన మటన్ అమ్మే మాంసం దారులు కిలో ధర 700 నుండి 800 రూపాయలకు అమాంతం 100 రూపాయలు పెంచారు. 200 రూపాయలకు అమ్మే చేపలు అమాంతం 300కు పెరిగిపోయాయి. చికెన్ తినకపోవడం ను ఆసరాగా తీసుకొని మటన్ అమ్మే యజమానులు అధిక ధరలను పెంచి విక్రయాలు చేపడుతున్నారు. ఈ విషయంలో చాలామంది కొనలేని దుస్థితిలో తినలేని పరిస్థితిలో ఉన్నారు. అటు చికెన్ తినలేక అధిక ధర పెట్టి మటన్ కొనలేక మాంసం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచి చెడు అన్ని రకాల మేకలను కోస్తూ మాంసం విక్రయిస్తున్నారు. అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.
కోటగుళ్ల కు బంగారు అభరణాలు బహుకరించిన ఎన్ ఆర్ఐ దంపతులు
గణపురం:నేతి ధాత్రి
Gold ornaments for Kotagulla..
గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు రూ. ఒక లక్ష 21 వేల విలువైన రెండు బంగారు గొలుసులను గణపురం మండల కేంద్రానికి చెందిన అట్లూరి జగన్ మోహన్ రావు ఉదయలక్ష్మి దంపతుల కూతురు, అల్లుడు అమెరికాలోని కాలిపోర్నియా షానోజ్ లో నివాసం ఉంటున్న ఉయ్యూరు రామకృష్ణ శిల్పా చౌదరి దంపతులు సోమవారం స్వామివారికి అమ్మవారికి బహుకరించారు. మొదట స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం బంగారు అభరణాలను స్వామివారికి అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయానికి బంగారు అభరణాలు అందజేసిన ఎన్ఆర్ఐ దంపతులకు కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం తండాలో శుక్రవారం పశుగణాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ అధికారి మాజిద్ అహ్మద్ ఆధ్వర్యంలో ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుగణాభివృద్ధి సంస్థ తరపున ఉచితంగా మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అలాగే ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధుల పశువులకు 22 సాధన చికిత్స, 4 దూడలకి నట్టల మందులు, 20 దూడలకి ఇవ్వడం జరిగిందని, మొత్తము 46 పశువులకు గాను వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ శిబిరానికి మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్, సూపర్వైజర్ తిరుపతి, మరియు గోపాల మిత్రులు ఎం శ్రావణ్, బి రాములు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓఎస్ డి కిషన్ , డి.ఎస్.పి సంపత్ రావు సీఐ నరేష్ కుమార్ గణపురం ఎస్ఐ అశోక్
గణపురం:నేటి ధాత్రి
lord shiva
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజామున గణపతి పూజ, అఖండ దీపారాధన తోరణ బంధనం కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, నాగరాజు, శంకర్ లు నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి, గణపేశ్వరునికి రుద్రాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి ఓఎస్ డి బోనాల కిషన్ దంపతులు , డి.ఎస్.పి సంపత్ రావు దంపతులు భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపురం ఎస్ఐ రేఖ అశోక్ దంపతులు అభిషేకంలో పాల్గొన్నారు. శివరాత్రి జాగరణ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల స్వయంభుగా వెలసిన శ్రీ తిరుమల స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా కొనసాగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు స్వామివారికి చక్రస్నానం చేయించి దేవాలయం లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, కాకి రాజయ్య, ఎల్లగౌడ్ లు ఉన్నారు.
నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో పాటయే ఆయుధం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సుద్దాల హనుమంతు సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు కవిగా కళాకారుడిగా, వాగ్గేయకారుడిగా అంతకుమించి జీవితమంతా కష్టజీవుల కోసం అంకితం అంకితం చేశారన్నారు. తెలంగాణ జాతి యావత్తును తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు అని ఆనాడు సాయుధ పోరాటంలో ఆయన రాసిన పల్లెటూరి పిల్లగాడ పసుల గాసే మొనగాడ.. పాట ఎందరినో ప్రభావితం చేసిందన్నారు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుందన్నారు. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుందని. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల హనుమంతు సాహిత్యం అని ఆయన చెప్పారు. వారి వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు . ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా సుద్దాల హనుమంతు జీవితం సాహిత్యం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నమీబియా దేశపు పూర్వపు మాజీ మంత్రి బెర్నార్డ్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, బెక్కెం జనార్థన్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డాక్టర్ జె.రాంమోహన్, జగపతి రావు, భూపతిరావు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.