కుట్రల కాంగ్రెస్‌!?

https://epaper.netidhatri.com/

`అధికారం కోసం ఎంచుకునేవన్నీ అడ్డదారులే!

`అరాజకీయ దుష్ట పన్నాగాలే?

`అనాదిగా అనుసరిస్తున్న దొంగ దారులే!

`ఎన్నికల సమయంలో నమ్ముకునేవి అల్లర్లే!

`గతంలో వైఎస్‌ పై ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలే!

`కర్ణాటక డికే అనుసరించే ఫార్ములా ఇదే!

`కర్ణాటక లో తెరలేపి, తెలంగాణ లో ప్రయత్నించి…

`కర్ణాటక లో కాంట్రాక్టర్లను రంగంలోకి దించి..

`నలభై శాతం ప్రచారం చేయించి.

`తెలంగాణ లో కాళేశ్వరం ప్రాజెక్టు పై బురద జల్లి

`తెలంగాణ రైతు దృష్టి మళ్లించే రంగు పులిమి

`కాళేశ్వరం మీద అసత్య ప్రచారం చేయించి,

`అబద్దాల ప్రచారాలనే అస్త్రాలు చేసుకొని..

`తెలంగాణ లో కాంగ్రెస్‌ ను నమ్మే పరిస్థితి కనిపించడం లేదని,

`ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కాంగ్రెస్‌ పార్టీ కర్నాటక గెలుపుతో ప్రజల మద్దతు కూడగట్టుకున్నాన్న భ్రమలో వుంది. పైగా కర్నాటకలో చేసిన కుట్ర రాజకీయాలు ఎక్కడైనా చెల్లుతాయన్న పగటి కలలు కంటోంది. కర్నాకటలో కాంగ్రెస్‌ చెప్పిన కట్టుకధలు తేటతెల్లమౌతున్నాయి. కర్నాకట రైతులు ఏకంగా తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్‌ మోసాలు ఎండగుడుతున్నారు. కర్నాటక రైతులను నమ్మించి మోసం చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. పెనం మీద వున్న రైతులను పొయ్యిలో పడేశారని కాంగ్రెస్‌ను శాపనార్దాలు పెడుతున్నారు. రైతులను నట్టెట ముంచారు. గెలిపించిన కర్నాటక ప్రజల బాగోగులు, పాలన గాలికొదిలేసి తెలంగాణ ఎన్నికల పేరుతో తాము గొప్ప పనిచేశామంటూ ఇక్కడ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కర్నాకటలో గొప్ప పధకాలు అమలు చేస్తున్నామని నమ్మించాలని చూస్తున్నారు. ఒక్క కేసిఆర్‌ ను ఓడిరచేందుకు జాతీయ స్ధాయి నుంచి నేతలను దిగుమతి చేసుకొని, అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి తెలంగాణ మీద కుట్రలు చేసేందుకు బయలుదేరారు. ఇన్ని కుట్రలా? అసలు కాంగ్రెస్‌ అంటేనే మోసాలకు కేరాఫ్‌ అడ్రస్‌. కాంగ్రెస్‌ అంటేనే స్కామ్‌లకు పెట్టింది పేరు. కాంగ్రెస్‌ అంటే అవినీతికి ఆనవాలు. కాంగ్రెస్‌ అంటే దుర్మార్గాలకు ఆలవాలం. డెబ్బై ఏళ్ల దేశ స్వాతంత్య్ర పాలనలో పాలన చేసింది సింహా భాగం కాంగ్రెస్‌ పార్టీయే. ఆనాటి నుంచి అబద్దాలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, అడ్డదారులు, పెడదోరణలు సర్వ అవలక్షణాలు కలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ.
పదేళ్లుగా దేశంలో అధికారం కోల్పోవడంతో తట్టుకోలేకపోతోంది.
తెలంగాణ కూడా పాలన చేతిలోనుంచి జారిపోయిందని మధనపడుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ పదేపదే సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటోంది. ఒక్కసారి ప్లీజ్‌ అని మొసలి కన్నీరు కారుస్తోంది. అలాంటి వారిని తెలంగాణ సమాజం హర్షిస్తుందా? ఆదరిస్తుందా? అసలు తెలంగాణ ఊరికే ఇచ్చిందా? 2004 ఎన్నికల సమయంలో కూడా ఇలాగే పదేళ్లు అధికారానికి దూరమై తెలంగాణ ఇస్తామని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఇచ్చిన హమీని పదేళ్లు మర్చిపోయి, ఆఖరకు అనివార్య పరిస్ధితుల్లో తెలంగాణ ఇచ్చింది. పదేళ్లు చేసిన కాలయాపన పాపానికి, యువత బలిదానాల ఉసురు తగిలి కాంగ్రెస్‌ ఓడిపోయింది. ఒక్క తెలంగాణలోనే కాదు దేశంలోనే కోలుకోలేనంత ఘోరంగా ఓడిపోయింది. అయినా కాంగ్రెస్‌లో మార్పు రావడంలేదు. అదే అబద్దాలు..అవే మోసాలు..అవే కుట్రలు..ఇంకా ఎంత కాలం? ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేసే కాంగ్రెస్‌ ను ప్రజలు గమనిస్తూనే వుంటారు. అసలు తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు అధికారం కట్టబెట్టాలో అన్న ఒక్క ప్రశ్నకు చెప్పడానికి సమాదానం లేదు. ఎంతసేపు కుట్ర…కర్నాటకలో అధికారంలో వున్న పార్టీని అబాసు పాలు చేయడంలో అక్కడ నిర్మాణ రంగ కాంట్రాక్టర్లను వాడుకున్నది. కమీషన్‌ నలభై శాతం అంటూ పెద్దఎత్తున ప్రచారం చేయించింది. ప్రజలను నమ్మించింది. లేనిపోనివి సృష్టించడంలో కాంగ్రెస్‌ మించిన డోఖా పార్టీ మరొకటి లేదని నిరూపించింది. దానికి తోడు ప్రజలకు కొన్ని వరాలు కురిపించింది. అలాగే రైతులను కూడా నమ్మించింది. ఆఖరుకు వారిని కూడా మోసం చేసేసింది. ఇచ్చిన హమీలను గాలికి వదిలేసింది. తమ చేతగాని తనంతో చేతులెత్తేసింది. పైకి మాత్రం అంతా బాగుందన్నట్లు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను గట్టెక్కించేందుకు కర్నాకటక డబ్బును వరదలా పారిస్తోంది.
కర్నాటకలో చేసిన జిమ్మిక్కులే తెలంగాణలో చేసి గెలవాలని చూస్తోంది.
కాని తెలంగాణ ప్రజలు ఎంతో విజ్ఞలు. కాంగ్రెస్‌ను ఎదిరించే తెలంగాణ తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌తో పదేళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ పాలన సాగిస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పాలన అందిస్తున్నాడు. అలాంటి కేసిఆర్‌ నాయకత్వాన్ని దెబ్బతీయాలంటే లేనిపోనివి సృష్టించాలి. సమాజాన్ని ఆగం చేయాలి. కొన్ని వర్గాలను చీల్చాలి. కులాల కుంపట్లు రగిలించాలి. అవసరమౌతే మత మౌడ్యాలు కూడా రెచ్చగొట్లేదాకా కూడా కాంగ్రెస్‌ వెనకాడని చరిత్ర వుంది. ఈ విషయాన్ని ఎవరో కాదు సాక్ష్యాత్తు ఆపార్టీకి చెందిన నేతలే ఉమ్మడి రాష్ట్రంలో చెప్పిన సందర్భాలున్నాయి. తనను అధికారంలో నుంచి దించేసేందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, హైదరాబాద్‌లోని పాత బస్తీలో మతకలహాలు సృష్టించారని ఒకప్పుడు మర్రిచెన్నారెడ్డి ఆరోపించారు. అంటే ఆ పార్టీలో విభేధాలున్నా, ఇతర పార్టీలు అధికారంలో వున్నా జరిగే పరిణామాలు ఇలా వుంటాయని కూడా వాళ్లే చూపించారు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న రాజశేఖరెడ్డి పాలనా కాలంలోనే లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌లో ఏక కాలంలో బాంబు దాడులు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ అంటే, తెలంగాణ అంటే కల్పిత భయానక వాతావరణం సృష్టించిందే కాంగ్రెస్‌. కాని తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనంత ప్రశాంతత తెలంగాణలో వచ్చింది. దేశంలోనే అత్యంత సేఫెస్టు ప్లేస్‌ హైదరాబాద్‌ అని మారు మ్రోగిపోతోంది. గత డెబ్బై సంవత్సరాల తెలంగాణ చరిత్రలో పదేళ్ల పాటు ఎలాంటి అలజడి లేకుండా, హాయిగా సాగిపోతున్న కాలమంటే ఇదే…కేవలం కేసిఆర్‌ పాలనలోనే శాంతి వెల్లివిరుస్తోంది. పాత బస్తీ,కొత్త బస్తీ అన్న తేడాలేదు. హైదారబాద్‌ మహానగరం అంతా అర్ధరాత్రి కూడా మెలుకువుగానే వుంటుంది. మెరుస్తూనే వుంటోంది. రాత్రిళ్లు కూడా పగటి పూట జనసంచారానే తలపించేంత ప్రశాంతంగా సాగుతోంది. అంతగొప్పగా పాలన సాగుతుంటే తెలంగాణ కేవలం అధికారం కోసం కాంగ్రెస్‌ మళ్లీ కుట్రలకు తెరతీస్తోంది. ప్రజల మనసు గెల్చుకోలేనప్పుడే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోంది.
తాజాగా కళేశ్వరం మీద దుష్ప్రచారం సాగిస్తోంది.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాలంటే పాలకులకు ధైర్యం కావాలి. అయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది ఆశామాషీ కంపనీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎల్‌అండ్‌టి. నిర్మాణంలో ఏదైనా పొరపాటు జరిగినా సరిదిద్దాల్సిన బాద్యత కూడా ఆ కంపనీదే. ప్రాజెక్టు జీవితం కాలం నిర్వహణ బాధ్యత దానిదే. కనీసం ఆ మాత్రం అవగాహన లేకుండా, ప్రాజెక్టు అగ్రిమెంట్లు చూడకుండా, ఏదో జరిగిపోతోందని ప్రజల్లో లేని పోని అపోహలు సృష్టించి అధికారంలోకి రావాలనుకుంటోంది. కాని అది చెల్లదు. ఎందుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు జీవిత కాలం దాని పర్యవేక్షణ మొత్తం ఆ కంపనీదే బాద్యత. అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించానలని కాంగ్రెస్‌ తహతహలాడుతోంది. ఈ విషయంలో మరోసారి కాంగ్రెస్‌ బొక్కబోర్లాపడడం తధ్యం. ఎందుకంటే కాంగ్రెస్‌ చెప్పేవన్నీ అబద్దాలే అని ప్రజలకు తెలుసు. అధికారంలో వున్న ఏ రాష్ట్రాలలో చేయని అభివృద్ది చేస్తామంటూ కాంగ్రెస్‌ కల్లబొల్లి మాటలు చెబితే జనం నమ్మడానికి సిద్దంగా లేరు. ఎందుకంటే ముందు కర్నాటక రైతులకు నిరంతరంగా తొమ్మిది గంటల కరంటు ఇవ్వలేక చేతులెత్తేశారు. రెండు గంటలకంటే ఎక్కువ కరంటు ఇవ్వలేమని తేల్చేశారు. తెలంగాణలో 24 గంటల అన్ని రంగాలకు నిరంతరం అందుతోంది. రైతాంగానికి మొత్తం ఉచితంగా అందుతోంది. అలాంటి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనను కాంగ్రెస్‌ విమర్శించడాన్ని ప్రజలే సహించరు. అసలు తెలంగాణ ఆదాయం జీతాలకే సరిపోవడం లేదంటారు? జీతాలే సరిగ్గారావడం లేదంటారు? రైతు బంధు అంతమంది రైతులకు ఎందుకంటారు? ఇప్పుడేమో! రైతు బంధు పేరు మార్చి దాని మొత్తాన్ని పెంచుతామంటున్నారు. మొత్తం బిఆర్‌ఎస్‌ పథకాలకే కొంత మొత్తంలో సొమ్మును పెంచి, కొత్త పేర్లతో రాజకీయం మొదలుపెట్టారు. అంతే తప్ప కాంగ్రెస్‌ కొత్తగా చెప్పింది లేదు. ఒక వేళ గెలిస్తే ఇచ్చేదేమీ లేదు. పథకాలకు గుండు సున్నా చుట్టడమే కంగ్రెస్‌కు తెలుసు. కొనసాగింపు కాంగ్రెస్‌ చరిత్రలోనేలేదు. మాట మీద నిలబడే తత్వం ఎప్పుడూ లేదు. ఇప్పుడూ రాదు. కర్నాకటలో కూడా మరోసారి నిరూపించారు. ఇంకా ఎలా నమ్మమంటారు. నమ్మితేనే మోసం చేస్తారు…మోసం చేస్తారని తెలిసి నమ్మడం మళ్లీ జనానిదే తప్పంటారు. అందువల్ల నమ్మకమన్న పదమే ఆపార్టీ డిక్షనరీలోనే లేదు.

అన్నదమ్ముల ఆ(తీ)ట!?

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ కు కన్ను గీటుతున్న తమ్ముడు కోమటి రెడ్డి.

`శత విధాల ప్రయత్నిస్తున్న అన్న వెంకటరెడ్డి.

`అన్నదమ్ముల గ’లీజు’ లాలూచి రాజకీయం!

`ఆరితేరిన అ’రాజీ’కీయం!!

`నల్లగొండ రాజకీయాలలో కోమటి రెడ్డి సోదరుల దుష్టపన్నాగం.

`తమ స్వార్థం కోసం ఎంతమందినైనా తొక్కుకుంటూ వెళ్తారు.

`అనుచరుల నెత్తిన నడుస్తూ వారికి పాతాలానికి తొక్కేస్తారు.

`మునుగోడు ప్రజలను నిండా ముంచారు.

`అనుచరులను ఆగం చేశారు.

`హస్తానికి హాండిచ్చిననాడు అనుచరుల ఒత్తిడన్నారు.

`కాంగ్రెస్‌ కు రోజులు లేవన్నారు.

`నమ్మి గెలిపిస్తే మునుగోడు ను నిండా ముంచారు.

`ఇప్పుడూ అదే పాట పాడుతున్నారు.

`కమలం వాడిరదంటున్నారు…

`బిజేపి నుంచి గెలవలేమనుకుంటున్నారు.

`ఏ ఎండకా గొడుగు…కాంగ్రెస్‌ గూటికి పరుగోపరుగు.

`ఈసారి అన్నదమ్ములనే నమ్మమంటున్న జనం.

`కాంగ్రెస్‌ ను కోమటి రెడ్డి సోదరులు నిండా ముంచడం ఖాయం.

`రేవంత్‌ రాజకీయంలో ఇద్దరూ ఓడిపోవడం తధ్యం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ ఎందుకు మారినట్లు? ఇలా పార్టీలు మారి ఏం సాధించాలనుకుంటున్నట్లు? తనపాటు తాను నమ్మిన వాళ్లను ఎందుకు ఆగం చేస్తున్నట్లు? మునుగోడు ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసినట్లు? వున్న పదవి పోగొట్టుకొని ఎందుకు చతికిలపడినట్లు? అమ్మలా అదరించిన పార్టీని కాదనుకొని పోయి, తిరిగి ఏ ముఖం పెట్టుకొని వస్తానంటున్నట్లు? కాంగ్రెస్‌ శ్రేణులు ఎంత వద్దన్నా వినకుండా, వారి ఒత్తిడి మేరకే అంటూ పట్టుబట్టి మరీ పార్టీని వదిలి కాషాయ జెండా ఎందుకు వేసుకున్నట్లు? ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి ఎందుకు చేరాలనుకుంటున్నట్లు? తెలంగాణలోనే కాదు, దేశంలోనే కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని జోస్యం చెప్పిన రాజగోపాల్‌ రెడ్డి లెక్క ఎక్కడ తప్పింది? ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌కు తెలంగాణలో మంచిరోజులొచ్చాయని ఎవరు చెప్పింది? ఎవరు ఏంచెప్పినా వినే రాజకీయం చేస్తూ, నమ్మిన వారిని నిండా ఎందుకు ముంచుతున్నట్లు? ఆపన్న హస్తంలా రాజకీయ బిక్షపెట్టిన పార్టీకోసం పనిచేయాల్సిందిపోయి, తన దారి తాను చూసుకోవాలనుకున్న రాజగోపాల్‌కు మళ్లీ పార్టీ బిక్ష పెట్టడం కూడా క్షమించరాని తప్పే అవుతుంది. అవకాశవాదులను కూడదీసుకుంటే, కండువాలు మర్చరన్న గ్యారెంటీ లేదు. పార్టీ కష్టాలలో వున్నప్పుడు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినంత గట్టిగా పట్టుకొని వుండాల్సిన రాజగోపాల్‌రెడ్డి, హాండిచ్చి కమలం గూటిలో దూరిపోయాడు. అప్పుడు గొప్పగా కనిపించిన కమలవికాసం ఎక్కడ దెబ్బతిన్నది? మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఇచ్చిన కాంట్రాక్టు ఎందుకు చేజారింది? నాడు వెబ్‌సైట్‌లో కనిపించిన కాంట్రాక్టు ఇప్పుడు ఎందుకు మాయమైంది? అంటే ఆనాడు అన్ని రాజకీయ పక్షాలు చెప్పిన మాట నిజమే! అన్నది రాజగోపాల్‌రెడ్డి ఒప్పుకున్నట్లేనా? కేవలం తన ఆర్ధిక పరిపుష్టి కోసం కాంగ్రెస్‌ను కాదనుకొని వెళ్లి, బిజేపి చూపిన ఆశల ఆశపడి, కాంట్రాక్టు కథ కాస్త ఉత్తతి కావడంతో మళ్లీ చేయి చెంతకు చేరాలనుకున్నట్లా? అయితే ఇక్కడ ఉదయించే కొన్ని ప్రశ్నలు రాజకీయంగా చూసుకున్న తెలంగాణలో కమలం వాడిరదన్నది ఎలా తెలుసుకున్నారు? ఎవరు నిర్ధారించారు? స్వయం నిర్ణయమా? లేక అన్నా దమ్ములు మళ్లీ మొదలుపెట్టిన కొత్త నాటకమా? ఒక దశలో అన్న వెంకటరెడ్డి కూడా కమలం గూటికి అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! కర్నాకట ఫలితాలు మరో రకంగా వుంటే రాజగోపాల్‌ రెడ్డి హస్తం వైపు చూసేవారా? వెంకటరెడ్డి ఇంత కాలం కాంగ్రెస్‌లో వుండేవారా? కాంగ్రెస్‌లో వున్నంత కాలం నిత్యం అసమ్మతి వాదిలా ఇక కాంగ్రెస్‌ పనైపోయింది? అంటూ అనుచరులతో రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలు ఇంకా వైరల్‌ అవుతూనే వున్నాయి. అన్న వెంకటరెడ్డి కాంగ్రెస్‌ వస్తే నేనే సిఎం. అంటాడు. బిజేపిలోకి వెళ్తే నేనే సిఎం అని రాజగోపాల్‌ అన్నాడు. తాను బిజేపిలోకి వెళ్లగానే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని కరోనా సమయంలో రాజగోపాల్‌రెడ్డి అనుచరులతో చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అద్దంకి దయాకర్‌ సభలో ఏదో అన్నాడని ఆఖరుకు ఆయన చేత క్షమాపణ కూడా చెప్పించుకున్నారు. కాంగ్రెస్‌పార్టీకి తీరని ద్రోహం చేస్తూనే వచ్చారు. తనతో తన తమ్ముడి రాజకీయానికి సంబంధం ఏమిటంటూనే, ఆస్ట్రేలియానుంచి తమ్ముడికి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఎంతో నమ్మకంగా సేవ చేసిన అనేక మంది అనుచరుల రాజకీయ జీవితాలను చిదిమేసిన వెంకటరెడ్డి కేవలం తన రాజకీయ భవిష్యత్తు కోసం జానయ్య లాంటి వారికి మద్దతు పలకడానికి కూడావెనుకాడడం లేదు. అంటే వారి రాజకీయ దివాళా కోరుతనం ఎంత నీచమైందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి నల్లగొండ రాజకీయాలకు, సూర్యాపేట జిల్లా రాజకీయాలకు అసలే సంబందం లేదు. ఇలా తన ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేసి రాజకీయాలు చేయడం మాత్రం వెంకటరెడ్డికి వెన్నతోపెట్టిన విద్య. ప్రస్తుతం ఆయన భువనగిరి పార్లమెంటు స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్లగొండలో రాజకీయాలు చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాలో వేలుపెడుతున్నారు. 2018లో తానే నల్లగొండలో గెలవలేదు. పార్లమెంటు ఎన్నికల విషయంలో జనగామ ప్రాంతం కొంత సపోర్టుగా నిలవడంతోనే వెంకటరెడ్డి గెలవగలిగారు. లేకుంటే ఆ ఎన్నికల్లో కూడా ఓటమిపాలయ్యేవారు. గెలిచి జనగామ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. నల్లగొండ జిల్లాలోనే మునిగితేలుతున్నారు.
అసలు రాను రాను రాజకీయాల్లో నీతి అన్న పదం వెతుక్కొవాల్సి వస్తుందమో?
అన్న అనుమానం వస్తోంది. నల్లగొండ జిల్లా కోమటటిరెడ్డి సోదరుల రాజకీయం చూస్తే మరీ అసహ్యం వేస్తోంది. ప్రజల కోసం అంటూ వాళ్లు చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎక్కడా పొంతన కుదడం లేదు. ఎంత సేపు వారి రాజీకయ స్వార్ధం తప్ప, ఎక్కడా ప్రజలకు మేలు కనిపించదు. మాటకు ముందు సామాజిక సేవ సేవా కార్యక్రమాలు చేపడుతుంటామంటారే గాని, వాటి వెనుక రాజకీయ భవితవ్యం దాగి వుందన్న సత్యాన్ని ప్రజలు గుర్తించలేరన్న అపోహలో అన్నాదమ్ములున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అన్న గెలిచాడు. తమ్ముడు ఓడిపోయాడు. 2018 ఎన్నికల్లో అన్న ఓడిపోయాడు. తమ్ముడు గెలిచారు. ఇద్దరూ కలిసి చక్రం తిప్పే రాజకీయాలను చూడాలనుకుంటే నెరవేరడం లేదు. అందుకని తమ అతి తెలివిని పెట్టుబడిగాపెట్టి తెలంగాణ రాజకీయాలను శాసించాలన్న పధకం రచించకున్నట్లున్నారు. వారి రాజకీయమే కాంగ్రెస్‌ పెట్టిన బిక్ష. ఒక దశలో ఇద్దరూదాన్ని విస్మరించారు. 2018 ఎన్నికల తర్వాత ఇక కాంగ్రెస్‌కు దేశంలోనే భవిష్యత్తు లేదని ఊహించుకున్నారు. అయినా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వెంకటరెడ్డి పోటీ చేసి గెలిచారు. అయినా కృతజ్ఞత లేని రాజకీయం రుచి చూపించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని రాజగోపాల్‌రెడ్డిని 2009 ఎన్నికల్లో ఎంపిని చేసింది కాంగ్రెస్‌ పార్టీ. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించింది కాంగ్రెస్‌ పార్టీ. అలా అడుగడుగునా రాజగోపాల్‌రెడ్డికి అండగా నిలిచింది కాంగ్రెస్‌ పార్టీ. కాని తన సామర్ధ్యం మూలంగానే కాంగ్రెస్‌ తనకు అవకాశాలు కల్పించిందని భ్రమలో రాజగోపాల్‌రెడ్డి తేలియాడుతూ వచ్చారు.
నల్లగొండ కాంగ్రెస్‌ రాజకీయాల్లో చీడపురుగులు ఆ ఇద్దరు సోదరులు.
ఈ మాటలు అనేది ఎవరో కాదు సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు. ఆ ఇద్దరే కోమటిరెడ్ది సోదరులు. ఈ ఇద్దరు ఎవరినీ ఓర్వరు. ఆ జిల్లాలో ముఖ్యంగా కాంగ్రెస్‌లో తాము తప్ప మరెవరూ రాజకీయాలు చేయెద్దు. ఎదుగొద్దు. ఇదే వారి అభిమతం. జానారెడ్డి లాంటి పెద్దలతో కూడా ఈ ఇద్దరికి పొసగదు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లాంటి వారితో సఖ్యత కుదరదు. మాకు మేమే బ్రాండ్‌ అనుకుంటూ, ఏదో బూమరాంగ్‌ చేద్దామనుకుంటారు? ప్రతిసారి బొక్కాబోర్లాపడుతారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు తొలిపిసిసి అధ్యక్షుడిని కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలలు గన్నాడు. పొన్నాల లక్ష్మయ్య తన్నుకుపోయాడు. పొన్నాల మంత్రిగా వున్న సమయంలో కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడుగా వున్నప్పుడు నల్లగొండ రాజకీయాలను ఉమ్మడి వరంగల్‌లో రుద్దాలనుకున్నారు. కాని కుదరలేదు. తెలంగాణ వచ్చిన జరిగిన ఎన్నికల్లో అన్న వెంకటరెడ్డి నల్లగొండ నుంచి గెలిచాడు. తమ్ముడు మునుగోడు నుంచి ఓడిపోయాడు. అన్న ఎలాగైనా సిఎల్పీ నాయకుడు కావాలనుకున్నాడు. అక్కడ బంగపడ్డాడు. సిఎల్పీ నాయకుడుగా వున్న జానారెడ్డికి అడుగడుడునా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తూ వస్తుండేవారు. అనుకున్న లక్ష్యం నెరవేరలేకపోవడం వంటి ప్రస్టేషన్‌తో అసెంబ్లీ, మండలి ఉభయ సభల సమావేశంలో అప్పటి స్పీకర్‌ మధుసూధనా చారిపైకి మైక్‌ విసిరేశారు. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌పైకి పేపర్లు విసిరేశారు. ఆ ఇద్దరి కళ్లకు గాయాలయ్యాయి. అసెంబ్లీనుంచి వెంకటరెడ్డి సస్పెండ్‌ అయ్యాడు. పొన్నాల తర్వాత పిసిసి. అధ్యక్షుడు కావాలని మళ్లీ ఆశలుపెట్టుకున్నాడు. అప్పుడు కూడా వెంకటరెడ్డి ఆశలు నెరవేరలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడయ్యారు. చివరికి 2018 ముందుస్తు ఎన్నికల్లో ఏకంగా నల్లగొండ నుంచి వెంకటరెడ్డి ఓటమిపాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడితే మిగిలేది రాజకీయ సన్యాసమే. జనం కళ్లముందు కనిపిస్తున్న అన్నాదమ్ముల రాజకీయ భవిష్యత్తు అదే…

దసరా పంపకాలు మా వల్ల కాదు!

https://epaper.netidhatri.com/

`కలవరంలో కాంగ్రెస్‌ నేతలు.

`పండగ ముందు టిక్కెట్ల ప్రకటన వద్దు

`కాంగ్రెస్‌ పార్టీకి నేతల విజ్ఞప్తి.

`మునుగోడు ఉప ఎన్నిక తరహా భరించలేదు.

`దీపావళి పండగ కూడా ముందే వుంది.

`రెండు పండుగలను ఎదుర్కోవడం కష్టం.

`పోలింగ్‌ కు ముందు తిప్పలు పడలేం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌పార్టీ నాయకుల కష్టాలు పగవాడికి కూడా రావొద్దు. పదేళ్లుగా అధికారానికి దూరమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం వారిలో వుంది. కాని సరిగ్గా దసరా, దీపావళి పండుగల సమయంలో ఎన్నికల వస్తాయని ఊహించలేదు. ఓ వైపు టిక్కెట్లే కొనుకుంటున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడంటూ ఆ పార్టీకి చెందిన నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. టికెట్లు రాని వాళ్ల ఆరోపణలు ఒక రకంగా వుంటే, టికెట్లు వస్తాయన్న ఆశలున్న వారి బాధలు మరోలా వున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మొదటి లిస్టు విడుదలైంది. ఆ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాని టిక్కెట్లు వచ్చిన ఆనందంలో దసరా పండుగ ముందుందని గుర్తించలేకపోయారు. ఆ విషయాన్ని ఇంకా టికెట్లు రాని వాళ్లు గుర్తించారు. అంతే రెండో లిస్టు ఆలస్యమైనా సరే కాని, పండగ ముందు మాత్రం విడుదల చేయొద్దని మొత్తుకుంటున్నారట. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ప్రజలకు దసరా డబుల్‌, త్రిబుల్‌ ధమాకాలు తెచ్చింది. దసరా పండుగ రోజున నియోజకవర్గం మొత్తం బిఆర్‌ఎస్‌, బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతి ఇంటికి కిలో మటన్‌, ఒక పుల్‌ బాటిల్‌ పంపించారన్నది బహింరంగ రహస్యమే. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయానికి కూడా దసరా పండుగ వచ్చింది. బిఆర్‌ఎస్‌ అభ్యర్ధుల ప్రకటన ఎలాగూ జరిగిపోయింది. ఆ నాయకులు ప్రజల్లో వుంటున్నారు. ఇప్పటికే సంతర్పణలు మొదలు పెట్టారు. పండుగ సందర్భంగా అందించేవాటిపై కూడా దృష్టిపెట్టారని తెలుస్తోంది. కాని కాంగ్రెస్‌ నాయకులు ఖర్చును చూసి బెంబేలెత్తిపోతున్నారట. ఎన్నికలపోటీపై ఆసక్తి చూపించారు గాని, ఖర్చు గురించి ముందు అంచనా వేసుకోలేదు. పైగా పండుగలు వస్తున్నాయని అసలే ఊహించలేదు. అదే ఇప్పుడు కాంగ్రెస్‌ దెబ్బతీసేలా వుంది. ఒక వేళ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన చేస్తే వారి పని సగం గోవిందా? ఇప్పటికే టిక్కెట్లు వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. నియోజకవర్గం మొత్తం కనీసం కార్యకర్తలకు, నాయకులకు పండగ ఖర్చులు సర్ధాలంటేనే బోలెడు ఖర్చు. ఒక వేళ అధికార బిఆర్‌ఎస్‌ ప్రతి ఇంటికి ఇస్తుందని తెలిస్తే, ఇక కాంగ్రెస్‌ కూడా ఇవ్వాల్సివస్తుంది. పదేళ్లుగా అదికారంలో లేరు. ఎన్నికలకోసం పైసా పైసా కూడబెట్టుకున్నారు. ఆ సొమ్మంతా ఒక్క దసరా పండుగకే ఎగిరిపోతే, తర్వాత వచ్చే దీపావళికి ఏం పంచుతారు. తీరా పోలింగ్‌ కుముందు రోజు ఎలా పంపకాలు చేస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. తెలంగాణలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఎంతో కాస్ట్‌లీ ఎన్నిక అనుకున్నారు. మునుగోడు అంతకు మించిన ఎన్నికగా రికార్డు సృష్టించింది. హుజూరాబాద్‌లోనూ, మునుగోడులోనూ పోటీ పడి మరీ పంపకాలు చేశారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలకు వుండే ప్రాదాన్యత అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్ధితుల్లో పండగకు కిలో మటన్‌, ఓ బాటిల్‌ పంచడం తప్పని సరిగా కనిపిస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగమంతా మునుగోడు, హుజూరాబాద్‌లో తిష్టవేసిన సమయాల్లోనే పంపకాలకు పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇప్పుడు పంపకాలు మరింత సులువు. అందుకే కాంగ్రెస్‌ పార్టీటికెట్టు ఆశిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. బిఆర్‌ఎస్‌ నాయకులకు కూడా కొంత భయం వున్నప్పటికీ అదికారంలో వుండడం వల్ల వెసులు బాటు వుండొచ్చు. అయితే బిజేపి నాయకులకు మాత్రం పండుగలు రావడం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే అవుతోంది. సహజంగా బిజేపి నాయకులు పంపకాలకు కొంత వ్యతిరకం. కాని ఇప్పుడున్న ఎన్నికల పరిస్ధితుల్లో ఏ పార్టీకైనా తప్పని పరిస్ధితి. మునుగోడు ఉప ఎన్నికలో బిజేపి తరుపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పంపకాలు చేశాడు. అంటే ఒక వేళ పండగ ముందు బిజేపి అభ్యర్దుల జాబితా ఒక వేళ వస్తే మాత్రం ఆ మాత్రం ఆట కూడా ఆడలేరేమో! చూద్దాం…పండగకు పంపకాలు చేస్తారా? ఎన్నికల నాడు దాకా ఆగుతారా? కలవరపాటు మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది. పంపకాల ముచ్చట వింటేనే వాళ్లలో గుబులు వినిపిస్తోంది.

సైకిల్‌ తో కాంగ్రెస్‌ కిల్‌!?

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ ను ఆదరిస్తే చంద్రబాబు గెలిచినట్లే!?

`చంద్రబాబు ను మళ్లీ నెత్తిమీద పెట్టుకున్నట్లే!

`కమ్మల తీర్మానంలో అంతరార్థమదే!

`తెలంగాణ సెటిలర్లు అంటే కమ్మలేనా?

`సీనియర్‌ నేతల అంతర్మధనం.

`రేవంత్‌ ను నమ్మి ఇప్పటికే నిండా మునిగాం.

` అధికారంలోకి వస్తే ఆ మాత్రం గాంధీభవన్‌ కు వెళ్లలేం.

`మొదటి లిస్ట్‌ లో తెలంగాణ ఉద్యమం చేసిన వారికి టిక్కెట్‌ రాలేదు?

`రెండో లిస్ట్‌ లో వస్తుందో లేదో తెలియదు!

`రేవంత్‌ ఒంటెద్దు పోకడ తో ఇబ్బందులు!

`కాంగ్రెస్‌ నిండా నిండిన తెలుగుదేశం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో సైకిల్‌ దిగిన నాయకులు చాలా మంది కారెక్కారు. మరి కొంత మంది హస్తం గూటికి చేరుకున్నారు. కారెక్కిన వారు తన రాజకీయ భవిష్యత్తు ఆగం కాకుండా వుండేందుకు కారులో చోటు సంపాదించుకున్నారు. హస్త వాసి బాగా లేని వాళ్లంతా కాంగ్రెస్‌ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన వారు మాత్రం ఆపార్టీని మింగేయడానికి మాత్రమే చేరారన్న సంగతి ఆపార్టీ పెద్దలు తెలుసుకోలేకపోతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కావాలని రేవంత్‌రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. కాని చంద్రబాబు అంగీకరించలేదు. వర్కింగ్‌ ప్రెసిడెంటుతో సరిపెట్టాడు. ఎల్‌ రమణనను అద్యక్షుడిని చేశారు. రేవంత్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఎప్పటికైనా చేటు తెస్తాడన్న సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే తెలంగాణలో తెలుగుదేశం బతకించుకోవాలి. అందుకు అప్పుడున్న నేతలతో ఆ పని కాదు. రేవంత్‌ రెడ్డి చేతిలో పెడితే తిరిగి రాదు. అప్పుడు రేవంత్‌కు రాజకీయ భవిష్యత్‌ ఆశ చూపి, సైకిల్‌ దింపి కాంగ్రెస్‌లోకి పంపించాడు. దాన్ని విజయవంతంగా చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగారు. తన పార్టీలో అధ్యక్షపదవి ఇవ్వని చంద్రబాబు, కాంగ్రెస్‌లోకి మాత్రం రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించి పంపించారు. ఎక్కడా రేవంత్‌కు అనుమానం రాకుండా అక్కడ కూడా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇప్పించారు. ఇక అక్కడి నుంచి చంద్రబాబు ఆడిస్తున్నాడు. రేవంత్‌ ఆడుతున్నాడు.
కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పని రేవంత్‌ మొదలుపెట్టాడు.
మరో వైపు తెలుగుదేశం శ్రేణులను నింపడం షురూ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అసలైన కాంగ్రెస్‌ నాయకులకన్నా, రేవంత్‌ రెడ్డితో వెళ్లిన నాయకులే ఎక్కువయ్యారు. రేవంత్‌ పిసిసి. అధ్యక్షుడిగా వుండడంతో ఇతర పార్టీలనుంచి వెళ్లిన వాళ్లు కూడా రేవంత్‌కు సపోర్టు చేస్తున్నారు. ఇక ఆట ఇప్పుడు మొదలౌతుందని తెలుస్తోంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం చంద్రబాబుకు సుతారం ఇష్టం లేదు. రాష్ట్రం విడిపోకుండా చివరి క్షణం వరకు చేయాల్సిందంతా చేశాడు. ఓ వైపు తెలంగాణ నాయకులను ఒత్తిడి చేయమని చెబుతూనే, మరోవైపు సీమాంధ్ర నేతలను అడ్డుకోమ్మని ఉసిగొల్పి ద్వంద్వ రాజకీయం నెరిపిన నాయకుడు చంద్రబాబు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటించిన మరు క్షణమే చంద్రబాబు రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి బస్సులు పంపించి, సీమాంధ్ర ప్రజలను తెలంగాణకు తరలించారు. ఎమ్మెల్యేల చేత అదే రాత్రి రాజీనామాలు చేయించారు. ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యేలనే కాదు, అప్పటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం స్వయంగా చంద్రబాబు ఫోన్లు చేసి మరీ రాజీనామాలు చేయించారు. చంద్రబాబు మాటలు నమ్మి, ముందూ వెనక ఆలోచించకుండా అప్పటి ప్రజారాజ్యాం అధినేత చిరంజీవి కూడా రాజీనామా చేసి నవ్వుల పాలయ్యారు. చిరంజీనిని తెలంగాణకు వ్యతిరేకి అని ముద్ర పడేలా చేశాడు. చిరంజీవి రాజకీయం తుంచేశాడు. ఈ విషయం అప్పటి తెలంగాణ తెలుగుదేశం నాయకులకు కూడా తెలుసు. అయినా ఏ ఒక్కరు స్పందించలేదు.
రేవంత్‌ రెడ్డి లాంటి వారు రాజీనామా చేయలేదు.
పైగా చంద్రబాబు తెలంగాణకు అనుకూలమంటూ వితండ వాదం చేస్తూ వచ్చారు. ఆ సమయంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేసింది. అలా తెలంగాణ మీద నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు రాష్ట్ర విభజన అసలే ఇష్టం లేదు. పైగా సమన్యాయం ముసుగేసుకొని డిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేసిన దుష్ట చరిత్ర చంద్రబాబుకు వుంది. అలాంటి చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉనికికి దెబ్బతీయాలని ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటు విఫల ప్రయత్నం అని చూపించాలనుకున్నాడు. తెలంగాణ నాయకులకు పాలన చేత కాని రుజువు చేయాలనుకున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డితో రూ.50లక్షలు పంపించి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దాంతో చంద్రబాబు తెలంగాణను వదిలి వెళ్లిపోవాల్సివచ్చింది. కాని ఆయన మనసంతా తెలంగాణ మీదే వుంది. తెలంగాన రాష్ట్రంలో తన ఆధిపత్యం పోవడం చంద్రబాబుకు అసలే ఇష్టం లేదు. గత తొమ్మిదేళ్లుగా ఆయన తెలంగాణ ప్రభుత్వంమీద విషం కక్కుతూనేవున్నారు. రేవంత్‌రెడ్డి రూపంలో తెలంగాణను మళ్లీ వశం చేసుకోవాలన్న ఆలోచన చేస్తూనే వున్నాడు. ఇక గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో నామరూపాలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇక భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్‌లో గెలిచే అవకాశం లేదు. పైగా వేదింపులు మరీ ఎక్కువయ్యాయి. దాంతో చంద్రబాబు మనసు మళ్లీ తెలంగాణ మీదకు మళ్లింది. రేవంత్‌ రూపంలో కాంగ్రెస్‌ను సమాధి చేస్తే మిగిలిన వాళ్లతో తెలుగుదేశాన్ని చిగురింప చేసి లోకేష్‌కు అప్పగించాలన్న స్కెచ్‌ వేశాడు. దాన్ని అమలు చేస్తున్నాడు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో తెలంగాణలోకి రావాలనుకున్న చంద్రబాబు ఈసారి తన అరెస్టును తెలంగాణ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నాడు.
ఎట్టిపరిస్ధితుల్లో భవిష్యత్తులో ఆంధ్రలో చంద్రబాబు గెలిచే అవకాశం లేదు. కనీసం సెటిలర్లు పెద్దఎత్తున వున్న తెలంగాణలోనేనైనా రాజకీయం వెతుక్కోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అది ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాడు. అసలు హైదరాబాద్‌లో సెటిలర్లుఅంటే కేవలం కమ్మవాళ్లేనా? అన్న సోయి కూడా లేకుండా సెటిలర్లంతా తన వైపే అన్న మాయలో వున్నాడు. అసలు చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో పోరాటం చేసే దిక్కులేదు. కానీ తన అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ధర్నాలు చేయాలని చంద్రబాబు సూచించారు. దాంతో సీమాంధ్ర నాయకులు హైదరాబాద్‌లో నిరసనలు వ్యక్తం చేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసలు పాలు చేయాలని చూశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ వాళ్ల ఆటలు సాగనివ్వలేదు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ కూడా వచ్చేసింది. ఈ సమయంలో కాంగ్రెస్‌ టిక్కెట్లన్నీ రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా పాత తెలుగుదేశంపార్టీ నాయకుల చేతిలో పెట్టే పని చేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీలో వుంటూ తెలంగాణ ఉద్యమం చేసిన చాలా మందికి మొదటి లిస్టులో టికెట్లు రాలేదు. తర్వాత లిస్టులోనైనా వస్తాయన్న నమ్మకం పెద్దగా లేదు. మొత్తం మీద చంద్రబాబును ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ రాజకీయాల్లోకి తెచ్చేఎత్తుగడ రేవంత్‌ బాగానే వేస్తున్నారు. అసలైన కాంగ్రెస్‌ నేతలను పార్టీకి దూరం చేస్తున్నారు. వాళ్లను చెట్టుకొకరిని పుట్టకొకరు వెళ్లేలా పథకం రచించాడు.
కాంగ్రెస్‌ను ఆదరిస్తే చంద్రబాబును గెలిపించినట్లే అన్నది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలకు కూడా అర్ధమైంది.
నిన్నటిదాకా కాంగ్రెస్‌లో సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుల మాటే చెల్లుబాటయ్యేది. అందులో భాగంగానే వైఎస్‌ఆర్టీపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది. రేవంత్‌రెడ్డి ఎలాగైనా షర్మిలరాకను అడ్డుకోవాలని ఆదినుంచి రేవంత్‌ పట్టుదలతో వున్నాడు. షర్మిల వస్తే తన పాత్ర అపాత్రదానం చేసినట్లే అవుతుందని గ్రహించాడు. తన నాయకత్వం గందరగోళంలో పడుతుందని ఆలోచించాడు. గురువు చంద్రబాబును తెచ్చి పెట్టాలనుకున్న నిర్ణయానికి ఆదిలోనే అడ్డుకుంటు ఎదురయ్యే పరిస్ధితి గుర్తించాడు. షర్మిల రాకకు అడ్డుపుల్ల వేశాడు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే కేవిపి. పెత్తనం పెరుగుతుంది. అది కాస్త రేవంత్‌కు చెక్‌ పెట్టేదాక వెళ్తుంది. ఒక వేళ కష్టపడి పార్టీని గట్టెక్కించినా మళ్లీ తన రాజకీయం పాము మింగిన పుంజీతం లాగా తోకకు చేరుతుందని తెలుసుకున్నాడు. షర్మిలను రాకు పొగపెట్టేశాడు. ఇక కాంగ్రెస్‌ను పూర్తిగా తెలుగుదేశం మయం చేశాడు. ఆకుపచ్చ వనానికి పసుపు రంగు పులిమేశాడు. ఎప్పుడో అప్పుడు అందరి చేత జై చంద్రబాబు అన్న మాట అనించినా అనిపిస్తాడు. తస్మాత్‌ జాగ్రత్త..!

కష్టాల కర్నాటక… కరంటు కటకట!

https://epaper.netidhatri.com/

`తెలంగాణ లో కరంటు వెలుగులు…

`కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు.

`కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌..

`కరంటు లేమికి సాక్ష్యం కర్నాటక.

`రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక వాస్తవ పరిస్థితులు.

`ఆరు నెలల్లో అంతా తారుమారు.

`కాంగ్రెస్‌ ను గెలిపించి నిండా మునిగిన రైతు.

`రైతులు రోడ్డెక్కి ధర్నాలు..నిరసనలు.

` రైతులకు ఐదు గంటలకన్నా కరంటివ్వలేమంటున్న సర్కారు.

`ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ తీరు.

`ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే!

`ఇష్టాను సారం బిల్లుల మోతలే.

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే!

`కాంగ్రెస్‌ చెబుతున్నవన్నీ అబద్దాలే!

`జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే!

`తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే!

`అధికారం కోసం ఆరాటం.

`దుర్మార్గపు కాంగ్రెస్‌ రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే అబద్దాల పుట్ట. కర్నాటకలో అధికారంలోకి వచ్చిందని ఇక పులినిచూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వ్యవహారం చూస్తే విచిత్రమనిపిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక్క శాతం కూడా. ఈ పదేళ్లలో ప్రభుత్వం మీద ప్రజలు ఒక్క రోజు కూడా నిరసన తెలియజేసిన సందర్భం లేదు. అంతగొప్పగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన సాగుతోంది. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి స్ధానమే లేదు. కాని నిత్యం అబద్దాలు వల్లెవేస్తూ, నిజాలను కప్పిపుచ్చుకుంటూ, కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేసే కొందరు స్వార్ధపరులు కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన బపడినట్లు కాదు. కాంగ్రెస్‌కు బలం చేకూరిచనట్లు కాదు. కాంగ్రెస్‌ చెబుతున్న హమీలన్నీ ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్నవే. కాంగ్రెస్‌ కొత్తగా చెప్పిందేమిటి? ఇస్తామంటున్నదేమిటి? దేశంలో డెబ్బై ఏళ్ల స్వతంత్య్రంలో ఏనాడు రైతుల గురించి ఆలోచించింది లేదు. ఇంతపెద్ద దేశంలో కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల మీద దృష్టిపెట్టలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కాంగ్రెస్‌ కట్టింది లేదు. అరవైఏళ్ల తెలంగాణను గోసపెట్టిన పార్టీయే కాంగ్రెస్‌. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కొత్తగా కర్నాటక అంటూ భజన చేస్తున్నారు. ఏముంది కర్నాటకలో కరంటు లేదు. రైతులకు కరంటు ఇవ్వడం లేదు. కేవలం ఐదు గంటలు మాత్రమే ఇవ్వగలమంటూ అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రకటన చూస్తున్నాం. రైతులు రోడ్డెక్కి నిరసలను తెలియజేస్తున్న సందర్భం చూస్తూనే వున్నాం. పంటలు ఎండిపోయే పరిస్దితి ఎదురౌతుందని రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. గొప్పగా చెప్పుకునే కర్నాటకలో ఇండ్లకు కూడా సరిగ్గా కరంటు సరఫరా చేయడంలేదు. హోటల్స్‌ బిజినెస్‌ వ్యాపారులు కరంటు కోతలపై నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఇక దోపిడీకి అంతే లేదు. ఏకంగా అక్కడి నాయకుల పేరుతోనే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలు చీదరించుకుంటున్నారన్న సోయి కూడా లేకుండా కర్నాటక గెలిచాం..గ్యారెంటీలు ఇచ్చాం… అని చెప్పుకోవడం కాదు…బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటినే కాపీ కొడుతూ కూని రాగాలు తీస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్‌ పార్టీ సభలకు ఎంత మంది వస్తున్నారో చూస్తున్నాం. రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీలు వస్తే తప్ప రాజకీయం నడవని నేతలు రాష్ట్రాన్ని నడిపిస్తారా? ఇలాంటి పరాన్న జీవుల్లాంటి నాయకులను చూసి ప్రజలు ఓట్టేస్తారా? అంటున్న రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చెప్పిన కర్నాకట వాస్తవ పరిస్ధితులు, తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ అంటేనే కరంటు కోతలు.
తెలంగాణ అరవై ఏళ్లపాటు చూసిందే..ఇప్పుడు కర్నాకటలో చూస్తున్నదే. కర్నాకటలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమేమిటో ప్రజలకు తెలుసు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతుల మసిబూసి మారేడు కాయ చేస్తామంటే ఎవరూ నమ్మరు. పైగా ఓటుకు నోటు కేసులో వున్న దొంగను నమ్మి పార్టీ అప్పగించిన కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా? అసలు కర్నాటకలో ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆఖరుకు చెత్త సేకరణకు ముందుకొచ్చే ఎజెన్సీలనుంచి కూడా వసూలు చేస్తున్నారంటే కాంగ్రెస్‌ పనితనమేమిటో? ఆ పరిపాలన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. గత పాలకులు బిజేపి పూర్తిగా అవినీతి మయమైపోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. అదేదో గొప్పగా , తెలంగాణలో కూడా మేమే అంటూ కలలు కంటున్నారు. వాళ్లకు మిలిలేవి కలలే.. ఆ కలల్లోనే వాళ్లు ఊరేగాల్సిందే. తప్ప..తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఎప్పటీకి కాంగ్రెస్‌కు వుండదు. ఇప్పటికీ కనీసం టిక్కెట్ల ఖరారుకే దిక్కులేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకుల చేతుల్లో పాలన పెడితే ప్రజల జీవితాలు ఆగమే…అరవైఏళ్లపాటు తెలంగాణ ప్రజలు కొట్లాడిరదే కాంగ్రెస్‌ మీద. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంద్రలోకలిపిందే కాంగ్రెస్‌. ఇప్పుడేదో కొత్తగా తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడాలి. ప్రజల మీద ప్రేమతో కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ఉద్యమంతో అనివార్యమై ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ మీద తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో పద్నాలుగేళ్లపాటు నిరంతరం ఉద్యమం చేశారు. ఎంతో మంది యువత బలయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్షతో దిగివచ్చారు. అప్పడు తెలంగాణ ప్రకటన చేశారు. అంతే కాని అడగగానే చాక్లెట్‌ చేతిలో పెట్టినట్లు ఇచ్చినట్లు ఎంతో సుతారంగా చెబుతున్నారు. అలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని తత్వం కాంగ్రెస్‌ నేతలది. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని ఇక తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇచ్చారు. ఇవ్వకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని ఇచ్చారు. అంతే గాని తెలంగాణ మీద ప్రేమతో కాదు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ ప్రజల్లో గుండెల్లో వున్నది కేసిఆర్‌. తెలంగాణ కలలు నెరవేర్చే నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చాడు. ప్రజల కష్టాలు తీర్చాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యాడు. ఆడపిల్లలకు మేమమాయ్యాడు. ఆసరాతో కుటుంబాలను ఆదుకుంటున్నాడు. కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లల పెళ్లి చేస్తున్నాడు. తల్లి బిడ్డల క్షేమం చూస్తున్నాడు. అమ్మ కాబోతున్న తల్లులను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం దాకా, తల్లి బిడ్డ క్షేమంగా ఆసుపత్రిని నుంచి ఇంటికి చేర్చుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదీ మన తెలంగాణ గొప్పదనం. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఔదార్యం. ఇంత గొప్ప ప్రభుత్వం వుండగా, ఏనాడు ప్రజల యోగక్షేమాలు పట్టని కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించడం అన్నది కల్ల.
తెలంగాణ అంటేనే ఓ అధ్భుతం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన అంటేనే ఓ స్వర్ణయుగం. ఎందుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కరంటు కోతలతో తెలంగాణ విలవిలలాడిరది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ వెలుగులతో నిండిరది. ఆరు నెలల్లో అసలు కరంటు సమస్య అన్నది లేకుండాపోయింది. ఇండ్లకు ఇరవై నాలుగు గంట కరంటు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అరవైఏళ్లలో ఏ ఒక్కనాడు ఇరవై నాలుగు గంటల కరంటు తెలంగాణ ప్రజలు చూసింది లేదు. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే రెప్పపాటు కూడా పోకుండా కరంటు చూస్తోంది. ఇదీ కేసిఆర్‌ నాయకత్వానికి, పాలనకు నిదర్శనం. మరి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇరవైనాలుగు గంటల నిర్విరామ కరంటు ఎందుకు సరఫరా కావడంలేదు. సాక్ష్యాత్తు దేశ రాజదానిలో కూడా కరంటుకోతలు చూస్తున్నాం. కాని తెలంగాణలో ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడు కోత చూసింది లేదు. ప్రజలు ఇబ్బంది పడిరది లేదు. రైతులకు కష్టం కలగలేదు. అర్ధరాత్రులు రైతులు కరంటు కోసం బావుల వద్దకు వెళ్లింది లేదు. అక్కడ నిద్రలు చేసింది లేదు. తెలంగాణలో వున్నది బిఆర్‌ఎస్‌ సంక్షేమ ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం. పేదల ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న గొప్ప పరిపాలనకు నిలయం. అలాంటి తెలంగాణలో మరో పార్టీ అధికారంలో వచ్చే అవకాశమే లేదు. కర్నాకట పేరు చెప్పుకుంటే పడే ఆ కాస్త ఓట్లు కూడా పోతాయి. ముందు కాంగ్రెస్‌ అది తెలుసుకుంటే మేలు..కాంగ్రెస్‌ను ఆదరిస్తే మళ్లీ తెలంగాణను చీకట్లోకి తీసుకెళ్తారు. తెలంగాణను ఆగం చేస్తారు..ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం. మోసం చేసేవాళ్లు చాలా చెప్తారు. నమ్మించి ఆగం చేస్తారు. బిఆర్‌ఎస్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకునేపార్టీ. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రికేసిఆర్‌. మూడోసారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ విజయం తధ్యం.

నేనే సిఎం..జాతకం చెప్పుకున్న జానారెడ్డి.

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ రాజకీయాలలో జానా మళ్ళీ సంచలనం.

`ఔననలేక, కాదనలేక రేవంత్‌ రెడ్డిలో కలవరం.

`జానా పంపిన ముందస్తు సందేశం.

`ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ లో కలకలం.

`కాంగ్రెస్‌ లో మొదలైన గందరగోళం!

`ఇలాంటి పరిస్థితి రావొద్దనే ఆయన ను పక్కనపెట్టింది.

`ఆలు లేదు, చూలు లేదు సామెత ఎప్పటికైనా కాంగ్రెస్‌ తోనే నిజం .

`అప్పుడే మొదలైన పదవుల పంపకం.

`తెలంగాణ భవిష్యత్తు గాలి కొదిలేయడం ఖాయం.

`అభ్యర్థుల ఎంపికే పూర్తి కాలేదు.

`ఎన్నికల ప్రచారమే కాంగ్రెస్‌ మొదలుపెట్టలేదు.

`తెలంగాణ రాక ముందు నుంచి జానారెడ్డిది అదే మాట.

`రేవంత్‌ రెడ్డి గొంతులో అప్పుడే పచ్చి వెలక్కాయ!

`కాంగ్రెస్‌ వస్తే వాళ్లలో వాళ్లకు కొట్లాటలు తప్పవు?

`తెలంగాణను ఆగం చేయకుండా ఊరుకోరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
జానారెడ్డి తానే కాబోయే ముఖ్యమంత్రిని అన్నారంటే ఫినిష్‌. తన జాతకం తాను చెప్పుకున్నారంటే కాంగ్రెస్‌ పని ఖతం. ఇది సెంటిమెంటుగా మారింది. ఆయన అన్నారంటే చాలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెవడం కష్టం. మళ్లీ జానారెడ్డి ఆశలు సజీవం కావడం సహజం. ఇలా 2009 నుంచి సాగుతూనే వుంది. కాని పాపం ఆయన జాతకం మారిందిలేదు. భవిష్యత్తు ఆశా జనకమైంది లేదు. తన కోరిక తీరింది లేదు. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనన్ని శాఖలకు మంత్రిగా పనిచేసిన ఘనత జానారెడ్డి దక్కించుకున్నారు. అందరికన్నా సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. అందుకే నాకంటే అర్హత ఎవరికుంది? నాకున్న అనుభవం ఎవరికి వుంది? అంటూ ఆయన చెబుతుంటారు. ఇప్పుడూ అదే చెబుతున్నారు. ఈసారి మరీ విచిత్రంగా పదవులు తనకు కలిసి రావడం కాదు..తానే పదవులకు కలిసి వస్తానంటూ కొత్త భాష్యాలు కూడా చెబతున్నాడు. అంటే పదవులు తనకు ఎన్నడూ వన్నె తేలేదు కాని , తానే పదవులుకు వెన్నె తెచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నారన్న మాట. ఈసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తున్నాడు. అయినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే మాత్రం నేనే సిఎం. అంటూ మళ్లీ జోస్యం చెప్పుకున్నారు. ఇదే ఆయన కొంప ముంచుకోవడమే కాదు… ఏకంగా పార్టీ కొంప ముంచడమే. ఆయన గత ఎన్నికలో, ఉప ఎన్నికలో మాత్రం ఓటమి పాలయ్యారు. ముందస్తు ఎన్నికల సమయంలో ఇక తాను ముఖ్యమంత్రి అయినట్లే అని ఎంతో మురిశారు. కాని ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ కూడా అంతకంతగా తీసికట్టినట్లే 2014లో వచ్చిన సీట్లకన్నా తక్కువ వచ్చాయి. దాంతో ఇక జనారెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు వదులుకున్నట్లే అని అంరదూ అనుకున్నారు. కాని ఒక్కసారిగా జానారెడ్డి మళ్లీ మోట కొండూరులో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వాతావరణం మారేందుకు దోహదపడుతున్నాయి. రాజకీయాలు చేసేవారు ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావాలి, ప్రదానమంత్రి కావాలని కలలు కనడం సహజం. అలా ఒక్కొమెట్టు ఎక్కుతూ ఎదిగిన వాళ్లుకు ఆ ఆశ మరింత ఎక్కువ. అలాగే జానారెడ్డి అనే నేను అని అనే సార్లు చెప్పారు. కాని కేవలం అది ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రిగా పలు ధఫాలుగా కూడా అన్నారు. కాని ఆయనకు ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయింది. తెలంగాణ ఉద్యమం లేకపోతే జనారెడ్డికి ఆ ఆశ కలలో కూడా వుండకపోయేది. కాని తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని ఆయన నేనే ముఖ్యమంత్రిని అని కలవరింత మొదలుపెట్టినట్లున్నాడు.
జానారెడ్డి ఇలా సందర్భం వున్నా, లేకునా ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు తాను ముఖ్యమంత్రిని అని పదేపదే చెప్పుకోవడం అలవాటు చేసున్నాడు.
నిజంగా ఆయన ఆది నుంచి కాంగ్రెస్‌ వాదా? అంటే కాదు. ఆది నుంచి కాంగ్రెస్‌లోనే వున్నాడా? అంటే అదీ లేదు. తెలుగుదేశంలో కూడా వున్నాడు. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో పనిచేశారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గం నుంచి తొలగించడంతో అక్కడ ఇమడలేక, కాంగ్రెస్‌లోకి వచ్చారు. అప్పటి నుంచి, ఇక అక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లలేక అక్కడే వున్నాడు. అంతే తప్ప ఆయన ఆది నుంచి కాంగ్రెస్‌లోనే లేడు. కాని నాకంటే సీనియర్‌ ఎవరు? వున్నారంటూ చెప్పుకుంటుంటారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు వున్న అర్హత ఏమిటన్నది మాత్రం ప్రజలకు తెలియాల్సిన అసవరం వుంది. అయితే కాంగ్రెస్‌లోఏదైనా సాధ్యమే. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే అదీ సాధ్యమే…కాని ఇప్పుడున్నది ఆ కాంగ్రెస్‌ కాదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు చోటు లేదు. అంటే జానారెడ్డే కాదు, ఏ కాంగ్రెస్‌ నాయకుడికి తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. పైగా జానారెడ్డికి అసలే లేదు. ఎందుకంటే ఆయన ఒక్కనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ అని అసెంబ్లీలో అన్నది లేదు. రోడ్దు మీదకు వచ్చి నినదించింది లేదు. తెలంగాణ కోసం కొట్లాడిరది లేదు. ఉమ్మడి పాలకులను నిలదీసింది లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఆయన చేసింది లేదు. ఒరగబెట్టింది లేదు. కనీసం ఆ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను కూడా తీర్చలేకపోయాడు. ఎంత సేపు పదవులు తప్ప, ఉమ్మడి పాలకులకు భజన తప్ప చేసిందేమీ లేదు. తెలంగాణ కోసం గొంగలిపరుగునైనా ముద్దాడుతా! అని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక దశలో జానారెడ్డి ఇంటకి వెళ్లి ఆయనను ఉద్యమంలోకి ఆహ్వానించారు. అయినా ఆయన తెలంగాణ ఉద్యమానికి తోడుగా నిలిచింది లేదు. అధిష్టానాన్ని అడిగింది లేదు.
2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత జానారెడ్డికి ఆశ మొదలైంది.
తెలంగాణ వస్తే తానే ముఖ్యమంత్రి అన్న ఆలోచన మొదలైంది. అయినా తెలంగాణ ఇస్తారా? అన్న అనుమానమే ఆయనలో ఆది నుంచి వుంది. 2009లో తెలంగాణ ప్రకటించిన తర్వాత సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు , మంత్రులంతా రాజీనామాలుచేశారు. వచ్చిన తెలంగాణను వెనక్కి వెళ్లేలా చేశారు. దాంతో తెలంగాణ సమాజం ఒక్కసారి భగ్గుమన్నది. కాని జానారెడ్డిలో ఎలాంటి చలనం లేదు. ఆ సమయంలో తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంద్ర ఎమ్మెల్యేలు ఎలా రాజీనామాలు చేశారో..అలాగే వెనక్కి తీసుకున్న మరుక్షణం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. దాంతో తెలంగాణ మంత్రులు , ఎమ్యెల్యేలు చాలా తెలివిగా స్పీకర్‌ ఫార్మెట్‌లో కాకుండా తెలంగాణ కోసం రాజీనామా? చేస్తున్నామంటూ అప్పటి స్పీకర్‌కు ఓ లెటర్‌ ఇచ్చారు. కాని దాన్ని స్పీకర్‌ ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆమోదంచరని తెలుసు. అయితే మంత్రులుగా వున్న జానారెడ్డి లాంటి వాళ్లు మంత్రి పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు. ఒక వేళ మంత్రి పదవులకు రాజనామా చేస్తే ఇదే అదునుగా అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఎక్కడ తమ రాజీనామాలు ఆమోదిస్తారో అన్న భయంతో ఎమ్మెల్యే పదవులకు మాత్రం రాజీనామా చేశారు. అలాంటి జానారెడ్డి 2014 ఎన్నికల్లో ఇక నేనే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసుకున్నారు. ఆనాటి నుంచి ఆ ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. 2018 ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు. కాని నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని ఓడిరచారు. అయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికలో ఇక ఇదే నా ఆఖరు ఎన్నికలపోటీ అంటూ ప్రజల సానుభూతి సంపాదించుకోవాలని చూశాడు. కాని జనం మెచ్చలేదు. ఆయనకు మద్దతు పలకలేదు. ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. కాని కాంగ్రెస్‌కు ఊపు కనిపిస్తుందన్న ప్రచారం ఊపందుకోవడంతో మళ్లీ తానే సిఎం అంటూ మరోసారి ప్రకటించారు. కాంగ్రెస్‌ను అయోమయంలోకి నెట్టేశారు.
కాంగ్రెస్‌లోఅంతే.. కాకపోతే ఒక్కసారి పోనీలే అనుకుంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడేది మళ్లీ అదే జనం.
కాంగ్రెస్‌ అంటేనే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనే నానుడి వుండనే వుంది. పొరపాటును కాంగ్రెస్‌ను ఆదిరిస్తే పదవుల్లో ఒదిగిపోతారు. పరిపాలన లో వాళ్లు ఆదమర్చితోతారు. ఎన్నికల కోసం పడినంత ఆరాటం గెలిచిన కాంగ్రెస్‌నాయకుల్లో కనిపించడు. అభివృద్ధి చేయాలన్న ఆలోచన అసలే కనిపించదు. అలా తెలంగాణను కాంగ్రెస్‌ బాగు చేస్తే తెలంగాణ ఉద్యమమే వుండేది కాదు. కాంగ్రెస్‌ నేతల చేత గాని తనం, స్వార్ధం మూలంగానే తెలంగాణ ఉమ్మడి పాలకులచేతుల్లో బంధీ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సీమంధ్ర నేతల కనుసన్నల్లో రాజకీయం చేయడం అలవాటైంది.. అధికారం సీమాంధ్ర నేతలకు, పదవులు పందేరంలో పాలెర్లుగా తెలంగాణకాంగ్రెస్‌ నేతలు వెన్నెముక లేకుండా వుండేవారు. అందుకే తెలంగాణను ఆనాడు ఉమ్మడిపాలకులు దోచుకున్నారు. తెలంగాణను ఆగం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ నేతల్లో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన కన్నా,పదవులు పొందాలన్న ఆరాటమే ఎక్కువ కనిపిస్తోంది. అది జానారెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది.

పెద్ద పాలేరుగా పని చేస్తా!

https://epaper.netidhatri.com/

జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే…

`జనగామ నియోజకవర్గ సమస్యలు నెల రోజుల్లో తీరుస్తా!

`ముఖ్యమంత్రి కేసిఆరే వచ్చి భరోసా ఇచ్చారు.

`జనగామను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా!

`సమస్యలు లేని జనగామ ఆవిష్కరిస్తా!

`కాంగ్రెస్‌ కు ఓటు అడిగే నైతికతే లేదు.

`జనగామ ఒకప్పుడు కరువు ప్రాంతం.

`ఇప్పుడు జనగామ జిల్లా అంతా సస్యశ్యామలం.

`ఫ్లోరైడ్‌ సమస్య తీరిపోయింది.

`చెరువులన్నీ ఎప్పుడూ నిండుగా వుంటాయి.

`చేర్యాల రెవెన్యూ డివిజన్‌ చేయిస్తా!

`చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా!

`కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అతుకుల బొంత.

`అరవై ఏళ్లు పాలించి చేసిందేమీ లేదు.

`పదేళ్లలో కేసిఆర్‌ పాలన, తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శమౌతోంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

జనగామ ఒకదశలో మోడువారిన ఎడారి. జనగామ అత్యంత కరువు ప్రాంతం. సాగునీటి అవకాశాలు చాలా తక్కువ. తాగు నీటి సమస్య అధికం. పైగా ఫ్లోరైడ్‌ బాధతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి జీవగడ్డ. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గొప్ప చరిత్ర జనగామ కు వుంది. అంతటి వీరోచితమైన ఉద్యమ నేపథ్యమే కాదు, సర్థార్‌ సర్వాయి పాపన్న ఏలిన నేల. అలాంటి జనగామ ప్రాంతం నిరంతరం పోరు కాలమే చూసింది. కష్ట కాలమే అనుభవించింది. అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్ష పూరిత పాలనలో అడుగడుగునా అవస్థలకు లోనైంది. సమస్యలకు నిలయంగా మారింది. సాగు నీరు లేదు. తాగు నీరు కరువు. అలాంటి జనగామ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. గడచిన పదేళ్లలో ఎంతో గొప్పగా ప్రగతిని సాధించింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు జనగామ అంటే ప్రత్యేకమైన అభిమానం. పైగా జనగామ, చేర్యాల ప్రజా సమస్యలు, ప్రాంత అవస్థలు ఆయన కు తెలుసు. అందుకే మిషన్‌ కాకతీయ తొలి ఫలితాలు జనగామ నియోజకవర్గానికి అందించారు. మొదటి దశలోనే జనగామ జిల్లా, నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులను ఏక కాలంలో మరమ్మత్తులు చేయించారు. చెరువులు నింపడం జనగామ తోనే మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు జనగామ ప్రాంతమంటే అంత మమకారం. అలాంటి జనగామ నుంచి ఈసారి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో వున్నాను. నన్ను జనగామ ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే గా ఎన్నికైన క్షణం నుంచి పెద్ద పాలేరుగా పని చేస్తా! జనగామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…అంటున్న పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు..విశేషాలు ఆయన మాటల్లోనే…
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.

ప్రగతి అనేది ఒక దగ్గర ఆగేది కాదు. నిరంతరం నీటి ప్రవాహం లాంటిది. ఇప్పటికే అనేక సమస్యలకు పరిష్కారం జరిగింది. జనగామ జిల్లా కేంద్రమైంది. మెడికల్‌ కాలేజీ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి జరిగింది. ఇంకా కొన్ని ప్రాధాన్యతా క్రమంలో వెనుకబడి వున్నాయి. వాటిని గుర్తించడం జరిగింది. పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిశీలన జరుగుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మొదలుపెట్టడం జరుగుతుంది. అలాంటి ఎన్ని సమస్యలు వున్నా జనగామ నియోజకవర్గ సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తా! ఈ విషయం ముఖ్యమంత్రి కేసిఆర్‌ తోనే చెప్పించా… ప్రజలకు భరోసా కల్పించాను.
జనగామ ఇప్పటికే అనేక రంగాలలో అభివృద్ధి జరిగింది.
జనగామ కొన్ని దశాబ్దాలుగా గొప్ప విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది. హైదరాబాద్‌ కు కూత వేటు దూరంలో వున్నట్లే లెక్క. గతంలో జనగామ నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పట్టేది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్డు రవాణా రంగంలో ఎంతో పురోగతి తెచ్చారు. అసలు ఒకప్పటి రహదారులకు ఇప్పుడు మనం చూస్తున్న రోడ్లకు ఎంతో తేడా వుంది. అదే ఉమ్మడి రాష్ట్రంలో వుంటే మన జనగామ గతంలో ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుండేది. చుక్క నీరు లేక అల్లాడిపోయేది. కరంటు కోతలతో విలవిలలాడిపోయేది. ఉపాధి కరువై వలసలు వెళ్లేది. మరి ఇప్పుడు జనగామ ప్రాంతంలో ఉపాధి కోసం ఉత్తరాధి నుంచి యువత వస్తున్నారు.

కరువు ప్రాంతం అన్నపూర్ణగా మారి సాగు పనుల కోసం ఇతర రాష్ట్రాలనుండి వచ్చి ఉపాధి పొందుతున్నారు.
సాగు సాగక వేలాది మంది జనగామ చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌ పనుల కోసం వెళ్లి వస్తుండే వారు. ఇప్పుడు అలాంటి వాళ్లంతా ఊళ్ళలో హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. బంగారు పంటలు పండిస్తున్నారు. అయినా ఇంకా తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఆ బాధ్యత నాది. జనగామ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా! సమస్యలు లేని జనగామ ఆవిష్కరిస్తా! అందుకు అందరి సహకారం అవసరం. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా , ప్రజలందరితో తలలో నాలుకలా వుండేందుకు ప్రయత్నం చేస్తా. ప్రజల్లో మమేకమౌతా. ప్రతి ఇంటికి బంధువునౌతా. అన్ని కుటుంబాలలో సభ్యుడినౌతా. వారి మంచీ, చెడుకు తోడుగా వుంటా. ప్రజలు ఏ సమస్య తో వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో వుంటా. ప్రజలకు సేవ చేస్తా. జనగామ కు కీర్తిని తీసుకొస్తా. జనగామలోనే కాదు, తెలంగాణ లో ఎక్కడా కాంగ్రెస్‌ కు ఓటు అడిగే నైతికతే లేదు. అసలు కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ అరవై సంవత్సరాల పాటు అష్టకష్టాలు అనుభవించింది. తీరని గోసను ఎల్లవోసింది. తెలంగాణ వచ్చాకనే తెలంగాణ కు కళ వచ్చింది. జనగామ కు కూడా వెలుగొచ్చింది.
చేర్యాల ప్రజల న్యాయ పరమైన డిమాండ్‌ రెవెన్యూ డివిజన్‌.

చేర్యాల ప్రజలు వివిధ పనుల కోసం అటు గజ్వేల్‌, ఇటు హుస్నాబాద్‌, జిల్లా కేంద్రం సిద్దిపేట కు వెళ్లాల్సివస్తోంది. ప్రజలకు ఎంతో ఇబ్బంది ఎదురౌతోది. ప్రజలు పడుతున్న ఇబ్బంది నాకు అర్థమైంది. అందుకే ఎన్నికల వేధిక మీదనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. జనగామ, చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా! కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అతుకుల బొంత.
అరవై ఏళ్లు పాలించి చేసిందేమీ లేదు. కనీసం మంచినీళ్లిచ్చింది లేదు.
పదేళ్లలో కేసిఆర్‌ పాలన, తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శమౌతోంది. జనగామ నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి సమస్యలున్నా దయచేసి ప్రజలు నా దృష్టికి తీసుకురాల్సిందిగా కోరుతున్నాను. జనగామ ప్రజాశీర్వాద సభ గొప్పగా జరిగింది. ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో హజరయ్యారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఎంతో సంతోషించారు. సభ సక్సెస్‌ వెనుక నాకు తోడ్పాటునందించిన బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నన్ను కడుపులో పెట్టుకొని దీవించి గెలిపించే ప్రజలను, బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకుంటాను. జై తెలంగాణ. జై జనగామ.

పూర్తిగా తెలుగు దేశంగా మారిన టి. కాంగ్రెస్‌.

https://epaper.netidhatri.com/

`చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.

`గత రెండేళ్ళుగా రేవంత్‌ స్కెచ్‌ గురించి చెబుతున్న నేటిధాత్రి.

`రేవంత్‌ రెడ్డి అడుగులు ఎలా వుంటాయన్నది చెప్పింది.

`అక్షరాల ఇప్పుడు అదే జరుగుతోంది.

`కాంగ్రెస్‌ నిండా మునిగి…పసుపు రంగు తేలుతోంది.

`కాంగ్రెస్‌ సీనియర్లంతా బైటకు…

`తెలుగు దేశం సీనియర్లంతా కాంగ్రెస్‌ కు

`తెలుగు దేశం బ్యాచ్‌ కు పంపకాలు.

`రేవంత్‌ రెడ్డి అనుచరులందరికీ టిక్కెట్లు.

` కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం.

`అసలు కాంగ్రెస్‌ నేతలకు శఠగోపం.

`కాంగ్రెస్‌ ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నం.

`సమైక్యాంధ్ర కోసం పని చేసిన చంద్రబాబు ను తరుముతున్న అక్కడి రాజకీయం.

` తలదాచుకున్న చోట రాజకీయం కోసం చంద్రబాబు ఆరాటం.

`రేవంత్‌ నేతృత్వంలో తెలంగాణ చీకటి మయం.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రేవంత్‌రెడ్డి పక్కా బ్లేమ్‌ గేమ్‌ ఆడుతున్నాడు. తాను మాత్రం సేఫ్‌ రాజకీయాన్ని ఎంచుకున్నాడు. కాంగ్రెస్‌ను బ్లైండ్‌గా మార్చేశాడు. మొత్తం పార్టీని నిండా ముంచేందుకు కంకణం కట్టుకున్నాడు. కాంగ్రెస్‌ పార్టీని ఆఖరు దశకు, అవసాన దశకు తెచ్చేశాడు. రేవంత్‌రెడ్డి ఇలాగే చేస్తాడని సీనియర్లకు ముందే తెలుసు. ముందు నుంచి మొత్తుకుంటూనేవున్నారు. అయినా అదిష్టానం వినిపించుకోలేదు. ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ బలపడిరదే గాని, రేవంత్‌ మూలంగా కాదన్నది పార్టీ అధిష్టానం గుర్తించలేకపోతోంది. కేవలం రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడిగా వుండడం మూలంగా ఆయన ద్వారా చేరికలు జరుగుతున్నాయే కాని ఆయన వల్ల కాదు. పైగా ఆయనకూడా పనగట్టుకొని పాత తరం తెలుగుదేశం నేతలందరినీ కాంగ్రెస్‌లోకి తీసుకురావడం వెనుకు వున్న ఆంతర్యం సీనియర్లందరకీ తెలుసు. ఇప్పుడు వాళ్లపెత్తనమే సాగుతుందన్నది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని నేటిధాత్రి ఎప్పటి నుంచో చెబుతూనే వుంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఆయన అడుగుల గురించి చెప్పింది. ఆ తర్వాత ఆయన ప్రతి అడుగును నిరూపిస్తూ వచ్చింది. ఆయన ఆలోచనలు ఎలా వున్నాయన్నది నాటి నుంచే నేటిధాత్రి చెబుతూనే వస్తుంది? ఖచ్చితంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను మింగేస్తాడు అన్నది ఇప్పుడు అక్షరాలు నియమయ్యే దశకు దాదాపు వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అన్నది లేకుండాపోవడం ఖాయం. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మొదటి లిస్టు చూస్తేనే అర్ధమౌతుంది. ఇక తాజగా నిజామాబాద్‌కు చెందిన మండవ వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందని తమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు, బిఆర్‌ఎస్‌ నుంచి ఈటెలతో వెళ్లిన ఏనురు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతోనే అసలు రంగు పూర్తిగా బైటపడిరది. కాంగ్రెస్‌ ఆకుపచ్చ రంగు కాస్త పసుపు రంగులోకి మారిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేదో సినిమాలో పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ అంటూ చెప్పినట్లే, పూర్తిగా తెలుగుదేశంగా మారిపోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు కనిపిస్తోంది. భవష్యత్తులో కాంగ్రెస్‌ తెలంగాణలో కనుమరుగౌతుంది. కాదు..రేవంత్‌ స్చెచ్‌తో అంతరించిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అన్నది కూడా సుస్పష్టమే. తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో కంగ్రెస్‌ను ప్రజలు పది అడుగుల లోతున పాతేశారు. ఇక లేవకుండా చేసేశారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను సమాధి చేసే బాధ్యత రేవంత్‌రెడ్డి తీసుకున్నారు. చంద్రబాబుకు తెలంగాణ రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. రెండు కళ్ల సిద్దాంతం, రెండు కొబ్బరి చిప్పల సిద్దాంతం పైకి చెప్పి, సమైక్యాంధ్ర నినాదం వినిపించింది చంద్రబాబు. తెలంగాణ రావడంతోనే తన రాజకీయ జీవితం చీకటిమయమైందన్న భావనలో చంద్రబాబు వున్నారు. ఇక ఆంధ్రాలో తన రాజకీయం చెల్లేలా లేదు. చంద్రబాబు పార్టీకి మనగడ లేదు. అందుకే చంద్రబాబుకు తెలంగాణ రాజకీయం మీద గత ఎన్నికల్లోనే కన్నుపడిరది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని కుట్ర చేశాడు. భంగపడ్డాడు. తెలంగాణ నుంచి తరిమేయబడ్డాడు. ఆ పగతో రగిలిపోతున్నాడు. చంద్రబాబు ఆదేశించాఉ. రేవంత్‌ ఆచరిస్తున్నాడు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్‌రెడ్డి ఏదైనాచేస్తాడు. అందుకే ఆ కార్యక్రమం మొదలుపెట్టారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలను ఒక్కొక్కరిగా సాగనంపుతూ వస్తున్నాడు. పాత తెలుగుదేశం నాయకులందిరనీ కాంగ్రెస్‌లో చేర్చుతూ వస్తున్నాడు. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీలో తెలుగుదేశం శ్రేణులతో నింపుతున్నాడు. తన మాటే చెల్లుబాటు అయ్యేలా చూసుకుంటున్నాడు. అదను చూసి, అవకాశం చూసి, తన చేతుల్లో పూర్తిగా హస్తం బంధీ చేసుకోవాలనుకుంటున్నాడు.. ఆ తర్వాత చంద్రబాబు చేతుల్లో పెట్టాలని చూస్తున్నాడు. ఇది కూడా కాంగ్రెస్‌ సీనియర్లకు ఎప్పుడో అర్ధమైంది. కాని డిల్లీ పెద్దలకు అర్ధం కావడం లేదు. రేవంత్‌ చేసే ఆర్ధిక పరిహారాలు తప్ప, రేవంత్‌ చేస్తున్న కుట్ర వ్యవహారాలు జాతీయ నాయకులకు పట్టడం లేదు. వాళ్లు పట్టించుకోవడం లేదు. పైగా సీనియర్లంతా కట్టగట్టుకొని వెళ్లి చెప్పినా డిల్లీ పెద్దలు వినిపించుకునేలా లేదు. అలా వారిని కూడా మాయి చేసి, నాపై ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవద్దన్న సంగతి ముందే చెప్పి కదిలంచలేని ధ్వజస్థంభమైపోయాడు. సీనియర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. వారిని రాజకీయంగా కనుమరుగు చేస్తున్నాడు. అనుకున్నందంతా సాఫీగా సాగితే, గెలిచిన నాయకులంతా ఇప్పటి వరకు ఎలా వలస వెళ్లారో? రేపు అదే విధంగా అందరూ తెలుగుదేశం పేరుతో కొత్త దందా మొదలుపెడతారు. గుండుగుత్తగా వెళ్లి, కాంగ్రెస్‌ను అసెంబ్లీలో లేకుండా చేస్తాడు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎల్పీని బిఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్లే, కాంగ్రెస్‌ను తెలుగుదేశంలో విలీనం చేయడమే రేవంత్‌రెడ్డి ముందున్న ప్రధానకర్తవ్యం. మళ్లీ చంద్రబాబు నాయకత్వాన్ని తెలంగాణ మీద రుద్దడం. ఇదే జరగాలని రేవంత్‌ కంకణం కట్టుకున్నాడు. అమలు చేస్తున్నాడు. ఆచరణలో అందరిని కలుపుకుంటూ పోతున్నాడు. కాంగ్రెస్‌లో పాత వాసన లేకుండా చూసుకుంటున్నాడు.
పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకుడు కూడా పార్టీ బైటకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చింది.

గడచిన నలభై సంవత్సరాలుగా ఆయన పార్టీకోసం పనిచేస్తూ వస్తున్నారు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా, రేవంత్‌లాగా అంతటి దిగజారిన వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. రాజకీయాల్లో అలాంటి వ్యాఖ్యలు సమర్ధినీయంకాదు. ఆహ్వానించకూడదు. ఎవరైనా ఖండిరచాల్సిందే. అయితే తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడైన పొన్నాలను కూడా సాగనంపడం అంటేనే రేవంత్‌ రెడ్డి ఎంత పకడ్భంధీగా పథకం రచించిండో అర్ధం చేసుకోవచ్చు. ఇక అదే జనగామ జిల్లాకు జంగా రాఘవరెడ్డి అధ్యక్షుడుగా వుండేవారు. ఆయనను పక్కకు తప్పించి, కొత్తగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని తెచ్చిపెట్టారు. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చుపెట్టారు. ఒకనాడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో వెలుగువెలిగిన జంఘారాఘవవరెడ్డి లాంటి వారి రాజకీయం తుంచేసేశాడు. ఇలా చాల మంది నాయకులు రాజకీయ భవితవ్యాన్ని రేవంత్‌రెడ్డి ప్రశ్నార్ధకం చేస్తూ వస్తున్నాడు. ఉప్పల్‌ నియోజకవర్గంలో రాగిడిలక్ష్మారెడ్డి గడచిన ముప్పైఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నాడు. ఆయనకే టికెట్‌ అని ముందు మాట ఇచ్చారు.లిస్టులో పేరు లేకుండా మరొకరికి ఇచ్చారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి మీద రేటెంత రెడ్డి అంటూ విమర్శలు వస్తూనే వున్నాయి. ఎంతో మంది సీనియర్‌ నాయకులకు మొదటి లిస్టులో పేరు లేకుండాపోయింది. ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా వున్నాయి. అందుకు సాక్ష్యంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. ఇంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి పనిచేసిన వాళ్లను వెర్రివెంగళప్పలను చేసేస్తున్నాడు. ఇక తాజాగా పొన్నాల లక్ష్యయ్యపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడంటే పార్టీ అదికారంలోకి వస్తే ఆయన వ్యవహరశైలి ఎలా వుంటుందో అన్న భయం మొదలైంది. మొదటి లిస్టులోనే నమ్మిన వారిని మోసం చేసినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతే కాదు సాక్ష్యాత్తు తన సొంత నియోజకవర్గం లోనే తన అనుచరుడుగా వున్న నాయకులు రేవంత్‌ను ఎలా గెలుస్తావో చూస్తా? అంటూ సవాలు విసురుతున్నాడు. ఏది ఏమైనా రేవంత్‌ రాజకీయంలో నిజాయితీ కనిపించడం లేదన్నది చాల మంది అభిప్రాయం. తనకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వున్నా, చంద్రబాబు కోసం ఎలాంటి త్యాగమైన చేస్తాడని, మళ్లీ తెలంగాణను చంద్రబాబు చేతుల్లో పెట్టడానికి కూడా రేవంత్‌ వెనుకాడడన్న అపవాదు వుంది. ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.

బీఆర్ఎస్ మేనిఫెస్టో కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్

విపక్షాల మైండ్ బ్లాక్…

తెలంగాణలో మూడోసారి కూడా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో మాదిరి ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి ఇతర పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మరో కొత్త హామీ ఇచ్చారు. రైతు బీమా తరహాలో.. తెల్ల రేషన్‌ కార్డుదారులకు… బీమా అమలు చేస్తామని.. సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఎల్‌ఐసీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి… పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్‌ భరోసా కల్పించారు.

బీఆర్ఎస్‌ పార్టీనే మళ్లీ అధికారంలో వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్‌ బీమా చేయిస్తామని.. 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కేసీఆర్‌ బీమా…ప్రతి ఇంటికి ధీమా అని అభివర్ణించారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తామని.. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. మరోవైపు దశల వారీగా ఆసరా పింఛన్ల మొత్తం పెంపు ఉంటుందని చెప్పారు. మొదటి ఏడాది రూ.3 వేలు పెంచి.. ఏటా రూ.5వందల చొప్పున రూ.5వేల వరకు పెంచుతామని వెల్లడించారు.

ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయరంగంలోతెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని చెప్పారు. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చామని వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉండేవన్న కేసీఆర్.. కరెంట్‌, నీటి సౌకర్యాలు ఉండేవి కావని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేశామని.. కల్యాణలక్ష్మి పథకం ఎవరూ అడగకపోయినా అమలు చేశామని.. ఎన్నికల ప్రణాళికలో లేనివాటినీ అమలుచేసిన ఘనత బీఆర్ఎస్‌ పార్టీదేనని స్పష్టం చేశారు.

ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి!

https://epaper.netidhatri.com/

ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి!

తెలంగాణ కు నీరే ఆధారం..ఆ నీరు లేక దశాబ్దాల పాటు విలవిల లాడిన జనం గొంతు తెడపడమే, కాదు ఎండిన నేలమ్మ దాహం తీర్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. అంటున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే

`మిషన్‌ కాకతీయ ఒక విప్లవం.

`ఊరి చెరువులు గ్రామీణ ఆర్థిక వనరులు.

`కుల వృత్తులకు కల్పతరువులు

`సకల సంపదలకు నిలయాలు.

`చెరువులకు పూర్వ వైభవం తెలంగాణకు కల్పవృక్షం.

`చెరువును అక్షయపాత్ర చేసిన దేవుడు కేసిఆర్‌.

`తెలంగాణ ను అన్నపూర్ణ గా మార్చిండు

`ఎడారిని ఒయాసిస్సులా మార్చి బంగారం పండేలా చేసిండు.

`సాగును సుసంపన్నం చేసి దేశానికే అన్నం పెడుతున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ ఊరు పాలవెల్లిలా మారిపోయింది. కాదు మార్చబడిరది. అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేయడమే, అనితరసాద్యమైన విజయాలు సాధించడం ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసిర్‌కే సాధ్యం. అసలు తెలంగాణ విషయంలో సాగు నీటి రంగం ఇంతలా పురోభివృద్ధి జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అసలు తెలంగాణకు నీళ్లు ఇవ్వడం అన్నది సాధ్యం కాదని తేల్చేశారు. నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రజల్ని నమ్మించారు. నయ వంచన చేశారు. కాకపోతే ఎత్తి పోతలతో కూడా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేయొచ్చని గత పాలకులు కూడా ఊహించలేదు. కాని ఎడారి మారిన తెలంగాణను ఒయాసిస్సుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రిది. కేసిఆర్‌ కలల నుంచి, ఆలోచనలనుంచి, ఆశయాల నుంచి, సంకల్పం నుంచి ఎవరూ ఊహించని తెలంగాణ పల్లె ఆవిష్కరింపబడిరది. పల్లె పునరుజ్జీవం పొందింది. పల్లె మళ్లీ కొత్త సొగబులు అద్దుకున్నది. చెదిరిన కలతో , చేదు జ్ఞాపకాలు, పీడ కలలు తప్ప, పండగ మర్చిపోయిన తెలంగాణ నిత్య వసంతరం పచ్చ తోరణంలాగా వెలిగిపోతోంది. కన్నీటిని దిగమింగుకుంటూ, దినదినగండంగా సాగిన తెలంగాణ పల్లె నిత్యపండుగ శోభను సంతరించుకొని కళకళలాడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో కొత్త అందాలు సంతరించుకున్నది. ఎండిన మోడులాంటి తెలంగాణ, పండుటాకులా వాడిపోయిన తెలంగాణ కేసిఆర్‌ పాలనలో పచ్చని మాగాణమైంది. ఊరంతా పచ్చ పైటను సింగారించుకున్నది. చెట్టు, చేమకూడా లేకుండా, నీడకు కూడా ఏడ్చిన తెలంగాణ ఇప్పుడు పచ్చని వనం అల్లుకున్నది. పచ్చని అడవి పల్లెకు నీడనిస్తోంది. చెరువుల పండుగతో తెలంగాణ పల్లె మురిసిపోతోందంటున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు చెప్పిన విషయాలు..ఆయన మాటల్లో..
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఎటుచూసినా ఎండిపోయిన చెరువలు.
పూడిపోయిన బావులు. ఆనవాలు లేకుండా పోయిన భూగర్భ జలాలు. పూడికలు పూడిపోయి, ఊటలకు దిక్కులేక, చెత్తాచెదారం నిండి మోటబావులు. ఎంత తోడిరచినా చుక్క నీరు కాన రాని రోజులు. చేదబావుల్లో సైతం చుక్కజాడలేక ఆడబిడ్డల కన్నీటి చుక్కలు రాలిన కష్టాలు. కనీసం చెరువు అన్నది కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పల్లెలు. తుమ్ములు మొలిచి తూముల జాడ కరువైన పరిస్ధితులు. ఆక్రమణలకు కూడా గురైన చెరువుశిఖాలు. ఒకప్పుడు నిండు కుండల్లా, గంగాళాల్లా ఎప్పుడూ నీళ్లతో కళకళలాడే పల్లెలు, చెరువులు ఒట్టిపోయాయి. పరాయి పాలకుల నిర్లక్ష్యంతో చెంబెడు మంచినీళ్లు దొరకని కడగండ్లు. తెలంగాణ రాకముందు రోజు వరకు వున్న దుస్దితి. కాని తెలంగాణ వచ్చిన ఏడాదిలోనే తెలంగాణ పల్లెలకు మళ్లీ ప్రాణమెచ్చింది. తెలంగాణ చిగురించడం మొదలుపెట్టింది. పచ్చని పైట కప్పుకునేందుకు తెలంగాణ నేలమ్మ సింగారించుకున్నది. తెలంగాణ వచ్చిన ఏడాదిలోనే తెలంగాణలోని చెరువులకు జలకళ వచ్చింది. అపరభగీరధుడు కేసిఆర్‌ తలుచుకున్నాడు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టించారు. భువినుంచి గంగాదేవి దిగివచ్చి పరుగుపరుగున చెరువుల నిండినట్లే, గోదారి మళ్లించి తెలంగాణ చెరువులు గంగాలం చేశారు. చుక్కనీరు లేక దశాబ్ధాల పాటు మోడులా మారిన చెరువుల్లో మళ్లీ నీటిసుడులు చూస్తున్నాం. చిన్న చిన్న అలలు చూసి మురుస్తున్నాం. ఆ పిల్ల తెంపరలు తెలంగాణ పల్లెలకు అందాలు అద్దాయి. నీటి సవ్వడులు ఎండా కాలంలో సయ్యాటలాడాయి. వాన చుక్క కానరాని వేసవిలో తెలంగాణ చెరువులు మత్తుళ్లు దుంకాయి. ఇది కలా! నిజామా!!అని రైతు ఆశ్యర్యడ్డాడు. మురిసిపోయాడు. ఆ నీటిలో జలకాలాడాడు. కళ్లకు అద్దుకున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, మంత్రి హరీష్‌రావును రైతు దీవించాడు. ఈ తరం యువత చెరువులు చూడలేదన్న బాధను మరిపించారు. భవిష్యత్తు తరాలలో పల్లెల్లో నీటి కటకట రాకుండా చేశారు. మూడేళ్లపాటు చెరువుల పండగ నిర్వహించారు. తెలంగాణలోని 46 వేల చెరువుల్లో పూడికలు తీశారు. చెరువులన్నీంటిలో గోదారి జిలాలో నింపి, పూజలు చేశారు. నేలమ్మ దీవెనలు, గంగమ్మ వరాలు తెలంగాణ పల్లెలకు అందించారు. కొన్ని దశాబ్దాలుగా చుక్క నీరు చూడని రైతన్న సంబరపడ్డాడు. యువతలో కొత్త ఆశలు చిగురించాయి. సంబరాలు చేసుకున్నారు. తొండలు కూడా గుడ్లుపెట్టని ప్రాంతాలంటూ హేళన చేసిన వారు పచ్చని తెలంగాణ పల్లెలు చూసి ఈర్శ్యపడుతున్నారు. తెలంగాణ పల్లెలకు గోదారి పరవళ్లు రావడంతో, ఏనాడో గతి తప్పిన వాగులు మళ్లీ పరుగులందుకున్నాయి. వంకలన్నీ పాత దారులను వెతుక్కొని కొత్త పరుగులందుకున్నాయి. ఒర్రెలు కూడా నీటిని నింపుకుంటూ, జల ఊటలకు దారులు చూపాయి. తెలంగాణ చెరువులన్నీ పండుగ చేసుకున్నాయి. తెలంగాణలో చెరువుల పండగొచ్చింది. సాగు సల్లగుండాలే..రైతు సంతోషంగా వుండాలి. ఆనందంగా వుండాలి. సుభిక్షంగా వుండాలి. పెదవులుపై చిరునవ్వులు తొనికిసలాడాలి. కాలం కావాలని మొగులు వైపు, కరువు రావొద్దని కాలం వైపు, పంటలెండిపోవద్దని దిగులు పడాల్సిన అవసరంలేదు. సాగు నీటి కటకట లేదు. పల్లె పచ్చగుండాలి. పాడి పంటలతో కళకళలాడాలి. చేనంతా పచ్చని పైట కప్పుకోవాలి. రైతులకు బంగారు సిరులు పండాలి. వృత్తులు పునరుజ్జీవం కావాలి. మావన వనరుల అభివృద్ధికి మళ్లీ జీవం పోయాలి. ప్రభుత్వాలు భరోసా కావాలి. రైతును ఆదుకునే పాలకులు కావాలి. రైతును అడుగడుగనా అండగా నిలిచే కేసిఆర్‌ పాలనే ఎల్లకాలం వుండాలి. రైతు పెట్టుబడి కష్టం రాకుండా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం. తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు దేశమంతా అమలు కావాలి. రైతు ఒకరి సాయం కోసం అర్దించే పరిస్ధితి రావొద్దు. అప్పుల పాలు కావొద్దు. ఈ సాగు మా వల్ల కాదని వ్యవసాయం వదిలేయొద్దు. రైతు ఏడ్చే రోజు అసలే రావొద్దు. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లక్ష్యం.
ఇది తెలంగాణలో నెరవేరిన స్వప్నం. అంటే నిజమైన కల.
ఆ కల దేశమంతా కలగా మిగిలిపోకూడదు. తెలంగాణలో రైతు ఎంత సుభిక్షంగా వున్నాడో దేశమంతా అలాగే రైతు ఆనందంగా వుండాలి. గతంలో అంతో ఇంతో రైతు సంక్షేమం మీద కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించేవి. కాని కేంద్రంలో బిజేపి వచ్చిన తర్వాత రైతు గోసలు మరింత పెరిగాయి. ఈ ఏడెనెమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. తెలంగాణలో కాలం అబ్బురపడేలా, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా మూడేళ్లలో కాలేశ్వరం…ఆరేళ్లలో మల్లన్న సాగర్‌ తోపాటు, అనేక రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాము. తెలంగాణలో నీటి గోస లేకుండా చేసుకున్నాము. తెలంగాణ సాధించుకున్న నాడు ఒట్టిపోయిన చెరువులు, ఎండిపోయి చుక్కలేని చెరువులు, తుమ్మ చెట్లు నిండిపోయిన చెరువులు. ఆక్రమణలకు గురై ఆనవాళ్లులేని చెరువులు. మొత్తంగా తెలంగాణ పల్లెలకు నీరు దిక్కులేని రోజులు చూసిన కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ ఏ కాలంలోనూ ఎండిపోని బావులు చూస్తున్నది. బోర్లన్నీ ఇరవై నాలుగు గంటలు నీరందిస్తున్నాయి. ఇదంతా తెలంగాణ చేసుకున్న పుణ్యం. మంత్రి హరీష్‌రావు లాంటి నాయకుడి కష్టం. తెలంగాణ ప్రజలు, రైతులు అనుభవిస్తున్న ఆనందం. నీరే మనిషికి ఆధారం. ఆ నీరు సమృద్దిగా వుంటేనే మనిషి మనుగడుకు సాగును వ్యవసాయం. కల చెదిరిన పల్లెలకు, ఊళ్లనొదిలి కడుపు చేత పట్టుకొని వలసలు వెళ్లి, బతకపోయిన రైతులంగా తెలంగాణలోనే మన బతుకు బంగారమని మళ్లీ వచ్చిన సంబురం. ఇదే కదా సర్గసీమకు నిదర్శనం. సాదించుకున్న తెలంగాణ అందుకున్న సాగువిప్లవం…విజయం…సంతోషం…సాగు సంపదకు తెలంగాణ నిలయం.

రంగంలోకి కేసిఆర్‌.

https://epaper.netidhatri.com/

`హుస్నాబాద్‌ తో ఎన్నికల ప్రచారం షురూ…

`కొత్త పథకాలపై సర్వత్రా ఆసక్తి.

`కేసిఆర్‌ సభలంటే మామూలుగా వుండదు.

`ఉద్యమ కాలం నుంచి కొన్ని వందల సభలు.

`గత ఏడాది కొంగరకలాన్‌ తర్వాత మొదటి సభ హుస్నాబాద్‌ లోనే.

`సభ నిర్వహణ అంతా హరీష్‌ రావుదే.

`అభివృద్ధి, సంక్షేమమే అసలైన ఎజెండా!

`చేసిన పనులే ప్రచారాస్ర్రాలు.

` అన్నపూర్ణ తెలంగాణే కళ్లముందు కనిపిస్తోంది.

`రైతు సంక్షేమంలో నెంబర్‌ వన్‌.

`మహిళా సాధికారతలో ఆదర్శం.

`అన్ని రంగాలలో అభివృద్ధి.

`ప్రతి వ్యవస్థ లోనూ ప్రగతి.

`తెలంగాణ అంటేనే వెలుగుల జగతి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికల శంఖారావం పూరించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ నెల 15 నుంచి రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కొన్ని సెంటిమెంట్లు పాటిస్తుంటారు. గత ఎన్నికలలో మొదటి సభ హుస్నాబాద్‌ను ఎంచుకున్నారు. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం. నామినేషన్ల వేసే సమయంలో సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాతే నామినేషన్‌ వేస్తారు. అలా కొన్ని కొన్ని బలంగా నమ్మే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇక ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టనున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. గత నెల రోజులుగా వాళ్లు ప్రజల్లో తిరుగుతూనే వున్నారు. ఊరూరు వెళ్లి ప్రచారం చేసుకుంటూనే వున్నారు. వారికి తోడుగా అటు కేటిఆర్‌, ఇటు హరీష్‌రావులు కూడా గత కొంత కాలంగా అనేక సభల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల తరుపున ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా ఎన్నికల ప్రచారం ముగిసినట్లే అని చెప్పొచు. ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్ధుల ఎంపికలోనే తలమునకలై వున్నారు. ప్రతిపక్షలు సీట్లు పంచుకునే లోపు బిఆర్‌ఎస్‌ అభ్యర్ధులు స్వీట్లు పంచుకునే సమయం వస్తుందన్న జోష్‌లో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలున్నారు. ఇక ఎన్నికల ప్రచారం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రారంభంతో పార్టీలో మరింత జోష్‌ నిండుతుంది. కాంగ్రెస్‌ పార్టీ, బిజేపిలు చెబుతున్నమాటలు, వారి వెనుకున్న కుట్రలను ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రజలకు అర్ధమయ్యే యాసలో చెబితే ఇక ఆ పార్టీల సంగతి అంతే సంగతులు అని చెప్పకతప్పదు. అంతే కాకుండా కొత్తగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాంటి పధకాలు ప్రకటిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. కాని ప్రజలు ఇప్పటికే వున్న అనేక పధకాలతో ఎంతో సంతృప్తిగా వున్నారు. దివ్యాంగులకు చెందని పెన్షన్లు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆసరా పెన్షన్లు కూడా మరింత పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. అయినా ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో సంతృప్తికరంగా వున్నట్లే వాతావరణం కనిపిస్తోంది. ఈ తొమ్మిదేళ్లకాలంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పిడికెడుమంది నాయకులు చేసిన హడావుడి, తప్ప ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసింది లేదు. ఇబ్బందులు ఎదుర్కొనట్లు దాఖలాలు లేవు. రోడ్లెక్కి ఉద్యమాలు చేయలేదు. ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్బాలు కూడా లేవు. కారణం తెలంగాణ తొమ్మిదేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం. అందుకే ప్రతిపక్ష నాయకుల్లో కనిపిస్తున్న అసహనం ప్రజల్లో ఎక్కడా లేదు. తెలంగాణ రైతులంతా కేసిఆర్‌ పాలనను పొగుడుతున్న వాళ్లే కాని, తెగిడిన రైతు ఒక్కరు కూడా లేదు. ఇదీ ఒక నాయకుడి పాలనా ప్రతిభకు నిదర్శనం. ఈ తొమ్మిదేళ్లలో మాకు ఇది అందలేదు. అన్న రైతు లేడు. రైతు ఊహించకముందే తెలంగాణ చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. సాగుకు అవసరమైన కరంటు అంతా ఉచితంగా . ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు. రైతులు ఆ ఆనందం నుంచి తేరుకునేలోపే చెరువులున్నీ నింపేశారు. రైతులు తమ పొలాలు తడుపుకుంటుంటేనే కాళేశ్వరం పూర్తి చేశారు. ఎప్పుడో ఎండిపోయిన మోడువారిన చెరువు కళకళలాడిరది. ఒట్టిపోయిన బావులన్నీ నీళ్లతో నిండాయి. బోర్లు ఎల్లబోశాయి. ఇదంతా కలా నిజమా? అనుకునేలోపు రైతు బంధు ఇచ్చాడు. పెట్టుబడి సాయం సాగుబాటుకు ముందే అందించారు. ఇలా రెండు పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున అందించారు. ఇంకేముంది రైతుకు ఇంతకన్నా ఆనందం ఏముంటుందనుకునే సరికి, పండిన పంట కూడా తామే కొంటామని కళ్లాల దగ్గరే కాంటలుపెట్టారు. మార్కెట్‌కు తరలించే కష్టం తొలగించాడు. కూర్చున్న చోటకే రైతుకు ఆదాయం అందించారు. ఇదీ కేసిఆర్‌ దార్శనికతకు నిదర్శనం. ఇలాంటి నాయకుడు దేశం మొత్తంలో ఒక్క కేసిఆర్‌ తప్ప మరకొరు లేరు.
ఇక తెలంగాణలోని కుటుంబాలన్నీంటికి పెద్దన్నయ్యాడు. పెద్దకొడుకుగా కీర్తింపబడుతున్నారు.
ఒకప్పుడు వయసు మళ్లిన వారికి పెన్షన్‌ అంటే ఎంత పెద్ద తతంగమో తెలియంది కాదు. ఆ తర్వాత కొంత కాలానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 ఇచ్చి అదే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆసరా పెన్షన్లు వెయ్యి, రెండువేలు, మూడు వేలు ఇలా పెంచుకుంటూ పోయారు. వయసు మళ్లీన వారి జీవితాలను గౌరవం తెచ్చారు. వారి ఆకలి తీర్చుతున్నారు. కుటుంబాలలో వారికి మరింత గౌరవం దక్కెలా చేశారు. ఒకప్పుడు వయసు మళ్లిన తల్లిదండ్రులను కొడుకులు చూసుకోవడానికి పంపకాలు చేసుకునేవారు. తండ్రి ఓ కొడుకు ఒక దగ్గర, తల్లి ఓ కొడుకు దగ్గర వుండాల్సివచ్చేది. ఎప్పుడైతే వారికి పెన్షన్‌ వస్తుందో అప్పటినుంచి వాళ్లను పిల్లలు కూడా సంతోషంగా చూసుకుంటున్నారు. అలాంటి వాళ్లంతా కేసిఆర్‌ను పెద్దకొడుకుగా భావించుకుంటున్నారు. మనసుల్లో దేవుడిగా కొలుసుకుంటున్నారు. అంతే కాకుండా కుల వృత్తులకు చెందిన వారికి కూడా నెల నెల పెన్షన్‌ ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్‌ అందిస్తున్నారు. బీడి కార్మికులకు కూడా పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇక ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి అంటే పేదంటికి ఎంత భారమో తెలియంది కాదు. కేసిఆర్‌ ఒకనాడు చూసి చలించిన సందర్భాన్ని గుర్తు చేసుకొని తెలంగాణ వచ్చిన వెంటనే కళ్యాణ లక్ష్మి పధకం తెచ్చారు. పేదింటి ఆడపిల్లకు మేనమామై పెండ్లిచేస్తున్నాడు.
తెలంగాణలో కుల వృత్తులు అంతరించి పోయి, గ్రామీణ జీవనం అస్తవ్యస్తమైంది. అటు సాగు లేక, ఇటు కుల వృత్తులు చేసుకోలేక, ప్రజలు అల్లాడిన పరిస్ధితి ఎదురైంది.
తెలంగాణ రాగానే కుల వృత్తులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. పాడి కావాలనుకున్న రైతులకు గేదెలను అందించారు. కురుమ, యాదవ కులాల సోదరులకు పెద్దఎత్తున గొర్రెల యూనిట్లు పంపిణీచేశారు. గీత కార్మికుల కోసం పెద్దఎత్తున చెరువు గట్లపై చెట్ల పెంపకంచేపట్టారు. కళ్లు దుకాణాలకు అనుమతులిచ్చారు. నీరా అమ్మకాలను పెంచారు. గీత కార్మికులకు పెన్షన్‌ అందజేస్తున్నారు. ఇక ముదిరాజ్‌సోదరులు ఒకప్పుడు చెరువు, అడవుల మీద ఆధారపడి జీవించేవారు. కాని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చెరువుల ద్వంసం జరిగింది. అడువులు లేకుండాపోయాయి. తెలంగాణవచ్చిన తర్వాత పెద్దఎత్తున చెట్ల పెంపకం చేపట్టారు. చెరువులను మరమ్మత్తులుచేశారు. తెలంగాణలోని 46వేల చెరువుల్లో ప్రభుత్వం చేపలను పెంచుతోంది. ముదిరాజ్‌ సోదరులకు ఉపాది మార్గం చూపించింది. ఒకప్పుడు తెలంగాణ ప్రజలకు చేపలు ఆంధ్ర ప్రదేశ్‌నుంచి వచ్చేవి. ఇప్పుడు చెరువు చేపలు కావాలంటే ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి పంపబడుతోంది. ఇలా కుల వృత్తులను కూడా నిలబెట్టిన ఘనత కేసిఆర్‌కే దక్కింది.
మన దేశ సమాజంలో అట్టడుగు వర్గాలుగా పరిగణింపబడుతున్న ఎస్సీ, ఎస్సీలు ఆర్ధికపరమైన ఇబ్బందులతో జీవితాలు గడుపుతున్నారు.
వారిలో కూడా మిగతా సమాజంతో సమానంగా ఆర్ధిక వృద్ది, పురోగతి కల్పించాలని ఆలోచించి దేశంలో ఎక్కడా లేని విదంగా దళిత బందు, గిరిజన బంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అందిస్తూ, వారి జీవన ప్రమాణాలు పెంచి, వారిని ఆర్ధికంగా నిలబెట్టిన ఏకైక నాయకుడు, పాలకుడు కేసిఆర్‌. అందుకే కేసిఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష. అని ప్రజలు అనుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారంలో ఇదే విషయం చెప్పి ప్రజలు దీవెనలు అందిస్తున్నారు. మళ్లీ సారే రావాలి. కారే గెలవాలని ఆశీర్వదిస్తున్నారు.

ఎంపీ వద్దిరాజు ఇల్లందులో ప్రెస్ మీట్

 

మనమందరం కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం: గులాబీ శ్రేణులు,ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీ రవిచంద్ర

మంత్రి సత్యవతి, లోకసభ సభ్యురాలు కవిత,ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి ఇల్లందులో ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ రవిచంద్ర


ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నవంబర్ 1వ తేదీన ఇల్లందు “ప్రజా ఆశీర్వాద సభ”కు హాజరై ప్రసంగించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గులాబీ శ్రేణులు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సభ జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న ఎంపీ రవిచంద్ర శుక్రవారం ఇల్లందులో పర్యటించారు.ఎంపీ రవిచంద్ర మొదట ఈ సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, మహబూబాబాద్ జెడ్పీ ఛైర్మన్ అంగోతు బిందులతో కలిసి సమీక్ష జరిపారు.ఆ తర్వాత
ఆత్మీయ విందులో పాల్గొని,వారితో కలిసి విలేకరులతో మాట్లాడారు.అహింసా మార్గంలో మహోద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించడమే కాక,దాన్ని అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్న మహానేత కేసీఆర్ హాజరయ్యే సభకు పెద్ద సంఖ్యలో స్వచ్చంధంగా తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా గులాబీ శ్రేణులు,ప్రజలను ఎంపీ వద్దిరాజు కోరారు.ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిప్రియ భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎంపీ రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు.విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మునిసిపల్ ఛైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు(డీవీ), పార్టీ ప్రముఖులు మూల మధుకర్ రెడ్డి, మూడ్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కర్నాటక లో కరంటు కష్టాలు!

https://epaper.netidhatri.com/

` మరో సారి బైట పడుతున్న కాంగ్రెస్‌ మోసాలు.

` తెలంగాణలో కాంగ్రెస్‌ చెబుతున్న కట్టు కథలు.

` కర్నాటక లో గుట్టు రట్టవౌతున్న అబద్దాల హామీలు.

`వ్యవసాయానికి ఇస్తున్న కరంటు రెండు గంటలు.

`కాంగ్రెస్‌ అంటేనే మోసాలకు, దారుణాలకు, అబద్దాలకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి కాంగ్రెస్‌ ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ

నమ్మరంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు చెప్పిన వివరాలు… ఆయన మాటల్లోనే..

`రోడ్డెక్కి రైతుల ధర్నాలు.. వంటా వార్పులు

`పరిశ్రమలకు కూడా కోతలే.

`ఇండ్లకు కూడా గంటల గంటలు పవర్‌ కట్లే.

`కాంగ్రెస్‌ వస్తే తెలంగాణ లో జరిగేది కూడా అదే!

`కాంగ్రెస్‌ ను కోరుకుంటే పాత రోజులే.

`నిత్యం కరంటు కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ పార్టీ చెప్పే మాటలు తేనె పూసిన కత్తికన్నా ప్రమాదకరం. ఆ మాటల వెనుక మర్మం, మాయా లోకం కన్నా దుర్మార్గం. తెలంగాణ ప్రజలను అరవై ఏళ్లు గోస పుచ్చుకొని, ఎన్నికలు రాగానే అరచేతిలో వైకుంఠం చూపించి, ఓట్లేయించుకొని తెలంగాణ కు తీరని అన్యాయం చేసిన చరిత్ర నే కాంగ్రెస్‌ పార్టీ ది. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతుంటే ఆ నాటకం తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. సరిగ్గా పదేళ్ల క్రితం దాకా తెలంగాణను చూస్తే దుఖం ఆగకపోయేది. ఏ పల్లెను చూసినా ఆగమే…ఏ ఇంటిని చూసినా కష్టమే…కనిపించేదంతా బీడు భూములే…ఇల్లూ వాకిలి వదిలి, చిన్న పిల్లలను సైతం ముసలి వాళ్లకు అప్పగించి బతుకపోయిన కష్ట కాలం తెలంగాణది. ఇప్పటికీ ఆ నాటి పరిస్థితులు గుర్తుకొస్తే కళ్లలో నీటి సుడులు తిరుగుతాయి. గొంత జీరబోతుంది. అంతటి దుఖం ఎల్లబోసింది నా తెలంగాణ. తెలంగాణ ప్రజల కళ్ల నుంచి రాలుతున్న కన్నీళ్లను చూడలేక, తన కంటి చెమ్మను తట్టుకోలేక తెలంగాణ సాధనకు కదిలిన కేసిఆర్‌, తెలంగాణ సాధించి, బంగారు తెలంగాణ ఆవిష్కరించారు. ఈ కష్టం వెనుక ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడి సహాకారమైనా దాగి వుందా? కనీసం కనిపించిందా? తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోతిరి. మంత్రి పదవులు వదులుకొమ్మంటే వదులుకోకపోతిరి. కనీసం తెలంగాణ ప్రజల కష్టం గ్రహించకపోతిరి. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల మీదనే పోటీ చేస్తిరి. తెలంగాణ వాదం లేదని చెప్పే వాళ్ల చంకలో చేరితిరి. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తిరి. ఏనాడైనా తెలంగాణ రాదని గొంతు చించుకున్న ఆంద్రా నేతలను కనీసం నిలదీశారా? తెలంగాణ అంతా దుఖం ఎల్లబోస్తుంటే, అప్పటి ఆంద్రా నేతలతో చెట్టా పట్టాలేసుకొని తిరిగితిరి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు? అసలు కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఓట్లడిగే నైతికత వుందా? అంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ చేసే మోసాలు, దారుణాలు చూసి భరించలేక, ప్రజల కష్టాలు చూసి చలించి, అలుపెరగని పద్నాలుగేళ్లు ఉద్యమం సాగింది, కాంగ్రెస్‌ మెడలు వంచి, తెలంగాణ తెచ్చి, ఎండిన పొలాలు తడిపి, ఇంటింటికీ మంచి నీళ్లిచ్చి ప్రజల కన్నీళ్లు తుడిచిన మనసున్న మానవత్వానికి ప్రతి రూపమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌.
తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టిన యోధుడు కేసిఆర్‌. అలాంటి గొప్ప నాయకుడి పాలనలో తెలంగాణ ఎంతో సుభిక్షంగా వుంది. వేరు పడిన సంసారమే కోలుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. అలాంటిది తెచ్చుకున్న తెలంగాణ సుసంపన్నం కావాలంటే ఎంత కష్ట పడాలి. నిర్మాణం కన్నా పునర్నిర్మాణం ఎంతో క్లిష్టమైనది. అయినా తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కరంటు కష్టాలు తీర్చిన పాలకుడు కేసిఆర్‌. అసలు ప్రపంచంలోనే ఇలా వెలుగులు తెచ్చిన నాయకుడు మరొకరు లేరు. ఏడాదిలో చెదిరిపోయిన చెరువులకు పూర్వవైభవాన్ని తెచ్చిన నాయకుడు బహుశా మన దేశంలో ఒక్క కేసిఆర్‌ తప్ప మరొకరు లేరు. ఎండా కాలంలో చెరువులు మత్తళ్లు పోయడం అనేది తెలంగాణ చరిత్రలోనే కేసిఆర్‌ హయాంలో తప్ప ఎప్పుడూ చూసి వుండకపోవచ్చు. మూడేళ్ళలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించేంత పట్టుదల, అంకిత భావం వున్న నాయకుడు చరిత్ర మొత్తం తిరగేసినా ఒక్క కేసిఆర్‌ తప్ప మరొకరు కనిపించరు. అంత గొప్ప నాయకుడి నీడన తెలంగాణ సమాజం సుసంపన్నమైంది. సుభిక్షమైన కాలం చూస్తోంది. కాలు మీద కాలేసుకొని రైతు సాగు చేసుకునే రోజులు వచ్చాయి. కన్నీటికి, కష్టానికి బలై,బతకులీడ్చిన తెలంగాణ రైతన్న ఇప్పుడు పుట్లకొద్ది పంటలు చూస్తున్నాడు. ఒకనాడు మెతుకు కోసం ఏడ్చిన తెలంగాణ రైతు పంట రాశులు చూసి మురుసుకుంటూ ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలతో సంబురపడుతున్నారు. కరంటు కోతలు, బిల్లుల మోతలు వాతలు చూసిన తెలంగాణ రైతు నిరంతర ఉచిత కరంటు చూస్తున్నాడు. ఎండిన పొలం తప్ప ఎప్పుడూ చుక్క నీరు లేని చోట, ఎప్పుడూ నిండి వుంటున్న పొలం చూస్తున్నాడు. పచ్చని చెలుకలో చెట్టు నీడన హాయిగా నిద్రిస్తున్నాడు. పాడి పంటను కన్నుల నిండా చూసుకుంటున్నాడు. ఇదీ రైతు ఆనందంతో నవ్వులు పండుతున్న తెలంగాణ. సంతోషాలు నిండిన తెలంగాణ.
కర్నాటక లో కరంటు కష్టాలను ఓసారి చూస్తే కాంగ్రెస్‌ పార్టీ పాలన ఎలా వుంటుందో తెలుస్తుంది.
కర్నాటకలో ఎన్నో ఎన్నెన్నో చెప్పారు. ఏమైంది. కనీసం కరంటు కూడా ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్‌ నాయకులు మాత్రం కోతల మీద కోతలు కోస్తున్నారు. కర్నాటక లో కరంటు కోతలున్నాయని తెలిస్తే కాంగ్రెస్‌ వాళ్లకు ప్రజలే వాతలు పెడతారు. ఇప్పటికీ వాళ్ళలో మార్పు రాదు. ఎప్పుడూ మార్పు రాదు. ఎందుకంటే అది కాంగ్రెస్‌ పార్టీ.అవకాశవాద పార్టీ. అదికారం కోసం ఏదైనా చెబుతుంది. ఎంతైనా మోసం చేస్తుంది. 1994 అధికారం కోల్పోయి, పదేళ్లు ప్రతిపక్షం చూసింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ ఇస్తామని బిఆర్‌ఎస్‌ తో పొత్తు పెట్టుకొని గెలిచి పదేళ్లు గోస పెట్టింది. తెలంగాణ యువత పిట్టల్లా రాలిపోతున్న కాంగ్రెస్‌ కనికరించలేదు. కాంగ్రెస్‌ నేతల మనసు కరగలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉమ్మడి పాలకులు కావాలని తెలంగాణకు కరంటు కష్టాలు సృష్టించినా మాట్లాడలేదు. ఒక్క చిత్తూరు జిల్లా మంచి నీటి కోసం రూ. 8 వేల కోట్లు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేటాయించుకుంటే చప్పట్లు కొట్టింది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కాదా? అదేక్కడి అన్యాయం తెలంగాణ మంచి నీటి అవసరాలు తీర్చాలని స్వయంగా నేనే డిమాండ్‌ చేస్తే రూపాయి కూడా ఇవ్వం..ఏం చేసుకుంటారో చేసుకోండని కిరణ్‌ కుమార్‌ రెడ్డి అంటే కనీసం స్పందించారా? ఆంధ్రా ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లు బల్లలు చర్చి తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసింది నిజం కాదా? సొంత ప్రాంతానికి అన్యాయం చేసే ఇలాంటి నాయకులు ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటారని కూడా లేదు. అయినా తెలంగాణను చీకట్లోకి నెట్టేసి, సకల కష్టాలకు కారణమే కాంగ్రెస్‌ పార్టీ. ముందు కర్నాటక లో కరంటు కటకట బాగు చేసుకోండి. తెలంగాణ లో రెప్ప పాటు కరంటు పోదు. పైగా నాణ్యమైన కరంటు ఇరవై నాలుగు గంటలు సరఫరా జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌ హయాంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు లేకుండా జిరాక్స్‌ సెంటర్లు కూడా నడిచేవి కాదు. పగలంతా కరంటు కోతలే…రాత్రి పూట కూడ పగబట్టినట్లే ఉక్కపోతల్లో బతకాల్సి వచ్చేది. ఆ నరకం గురించి తెలిసిన తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ ను చీదరించుకుంటుందే గాని, ఆదరించే సమస్యే లేదు. ఒక్కొక్కటిగా మరో సారి బైట పడుతున్న కాంగ్రెస్‌ మోసాలు. అయినా తెలంగాణలో కర్నాటక కట్టు కథలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. కర్నాటక లో గుట్టు రట్టవౌతున్న అబద్దాల హామీలు కాంగ్రెస్‌ పాలిట శాపాలౌతున్నాయి.
కర్నాటక లో వ్యవసాయానికి కరంటు రెండు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కర్నాటక మొత్తం రోడ్డెక్కి రైతుల ధర్నాలు చేస్తున్నారు.. వంటా వార్పులు చేస్తున్నారు. అక్కడ పరిశ్రమలకు కూడా కోతలే విధిస్తున్నారు. ఇండ్లకు కూడా గంటల గంటలు పవర్‌ కట్ల కటకటే. కాంగ్రెస్‌ ను పొరపాటున నమ్మితే తెలంగాణ లో కూడా జరిగేది కూడా అదే! అన్నది ప్రజలు గమనించాలి.
కాంగ్రెస్‌ ను కోరుకుంటే పాత రోజులే వస్తాయన్నది నేటి తరానికి గుర్తు చేయాలి. కాంగ్రెస్‌ చూపించిన చీకటి రోజుల గురించి నేటి యువతకు పెద్దలు చెప్పాలి.

బిఆర్‌ఎస్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు

https://epaper.netidhatri.com/

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార కార్యక్రమాలు… పార్టీ పరమైన అంశాలు…ఆయన మాటల్లోనే.

`ఈనెల 15 న ప్రకటించనున్న కేసిఆర్‌.

`ఇప్పటికే ప్రచారంలో ముందంజ!

`అటు కేటిఆర్‌… ఇటు హరీష్‌ రావు.

`మూడు నెలలుగా విసృత ప్రచారం.

`అభ్యర్థులు నెల రోజులుగా ప్రజల్లోనే.

`త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రచారం ప్రారంభం.

`ప్రతిపక్షాల కుయుక్తులకు చెక్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ అంటే ఒక బ్రాండ్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఒక స్ట్రాంగ్‌ లీడర్‌. తెలంగాణ ఒక ఆదర్శవంతమైన రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్మాణాత్మకమైన నాయకుడు. తెలంగాణ కోసం ఉద్యమం నిర్మాణం చేశాడు. పద్నాలుగేళ్ల పాటు నిరంతరం పోరాటం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడగట్టారు. నాయకుల చేత సంతకాలు చేయించారు. ఏ ఒక్కరు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకున్నాడు. అన్ని రాష్ట్రాలు తిరిగి తెలంగాణ ప్రజల గోస గురించి వివరించారు. అంతిమంగా తెలంగాణ తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ తలరాతే మర్చేసిన గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. తెలంగాణ వస్తే ఇంత అభివృద్ధి సాధ్యమైందా? అని ఆశ్చర్యపోక తప్పదు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో చూడిరడి..అని ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెబుతుంటే ఎవరూ నమ్మలేదు. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే నిత్యం కరంటు కోతులువుండేవి. వ్యాపారం రంగం మొత్తం కుదేలైపోయింది. ఒక దశలో నగర పరిసరాల్లో వున్న పరిశ్రమలన్నీ తరలిపోతాయా? అన్న అనుమానం కలిగిన రోజులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరం కరంటు కావాలంటూ ఇందిరాపార్క్‌ దగ్గర పారిశ్రామిక వేత్తలంతా ధర్నాలు చేసిన రోజలున్నాయి. కొన్ని తరలిపోయిన పరిశ్రమలు కూడా వున్నాయి. కాని నేడు ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్‌ చూస్తున్నాయి. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. జిఎస్టీ పేరుతో దేశంలో అనేక పరిశ్రమల మూతకు కేంద్ర ప్రభుత్వం కారణమైతే, తెలంగాణలో అధ్భుతమైన పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కారణమయ్యారు. అంటే ఎవరు గొప్ప నాయకుడు ప్రజలే అర్ధం చేసుకోవాలి. హైదరాబాద్‌లో ఐటి, నగరం చుట్టూ ఫార్మా రంగం విస్తరించిన తీరును దేశంలోని మిగతా రాష్ట్రాల ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌నుంచి పెద్దఎత్తున యువత ఉపాధి పనుల కోసం, చదువకున్న వాళ్లు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు. కాని నేడు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తెలంగాణకు ఏటా లక్షలాది మంది వస్తున్నారు. తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిన ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసి, అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. తెలంగాణలో వ్యవసాయ పనులు చేసేందుకు మహరాష్ట్ర, కర్నాకటలనుంచే కాకుండా బీహార్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లనుంచి యువత వస్తున్నారు. తెలంగాణ రైస్‌ మిల్లులలో పనులు చేస్తున్నారు. నిర్మాణ రంగంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందని వ్యక్తులు పనిచేసి, ఉపాధి పొందారంటే తెలంగాణ ఎలా నీడనిచ్చే, బతుకునిచ్చే చెట్టుగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు వలసల తెలంగాణను నేడు ఉపాధి తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కింది. కేసిఆర్‌ లాంటి నాయకుడు యుగానికొక్కడే కనిపిస్తాడు అంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాందీ, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న హైదరాబాద్‌ అభివృద్ధి విశేషాలు…ఆయన మాటల్లోనే..
మొత్తం తెలంగాణ గురించి చెప్పుకున్నా, ఒక్క హైదరాబాద్‌ గురించి చెప్పుకున్నా ఇక్కడ జరిగిన అభివృద్ధి దేశంలో మరెక్కడా జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సెక్రెటరియేట్‌ వద్ద వున్న ఫ్లైవోర్‌ ఉమ్మడి రాష్ట్రంలో 13 సంవత్సరాలు గడిస్తే తప్ప పూర్తి చేయలేదు. ఇలా అప్పట్లో అక్కడక్కడ నిర్మాణం చేసిన నాలుగు ఫ్లైవోర్లు పదిహేనేళ్లపాటు సాగాయి. కాని తెలంగాణలో దేశంలోనే భృహత్తరమైన, బహుళార్ధక ప్రాజెక్టును మించిన నిర్మాణం కాళేశ్వరం కేవలం మూడు సంవత్సరాలలో నిర్మాణం జరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల కళ్లముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒక్క ఫ్లైఓవరే పదమూడు సంవత్సరాలకు గాని పూర్తి కాలేదు. అంతే కాదు హైదరాబాద్‌లోని మెట్రో రైల్‌ నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనా, తొమ్మిదేళ్లపాటు నత్తనకడన సాగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ జోక్యంతో చకచకా పూర్తయి ప్రజలకు సేవలందిస్తోంది. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ గొప్పదనం. హైదరాబాద్‌లో తొంబైవదశకం నుంచి తెలంగాణ వచ్చే దాకా పట్టుమని పది ప్లైఓవర్లు కూడా నిర్మాణం చేయలేదు. ట్రాపిక్‌ సమస్యను గాలికొదిలేశారు. హైదారాబాద్‌ అభివృద్దిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పం, మంత్రి కేటిఆర్‌ పట్టుదలకు నిదర్శనంగా 37 ప్లైఓవర్లు కేవలం తొమ్మిదేళ్లలో పూర్తి చేసి, నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పూర్తిగా తొలగించారు. ఒకప్పుడు హైదరాబాద్‌ నగరంలో ప్రయాణం ఒక నరకం. కాని నేడు ఎంతో సులభం. ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ దాటి విద్యానగర్‌ చేరాలంటే మూడు కిలోమీటర్ల దూరం కనీసం గంటన్నర సమయం పట్టేది. ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసిన ఫ్లైఓవర్‌ మూలంగా ఐదు నిమిషాలలో ఎలాంటి ఆటకంకం లేకుండా వెళ్తున్నారు. ఇక మాదాపూర్‌లో ట్రాపిక్‌ సమస్య కోసం కొత్త చెరువు మీద వేలాడే వంతెన ఏర్పాటు చేసి, నగరాన్ని అందంగా ముస్తాబు చేయడమే కాకుండా, ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొ, ఎన్నెన్నో విజయాలు వున్నాయి. ఒకప్పుడు ఎల్‌బినగర్‌ లో ట్రాఫిక్‌ కష్టాలు కథకథలుగా చెప్పుకునేవారు. ఇప్పుడు స్టీల్‌ వంతెన నిర్మాణం ఏర్పాటు చేసి, ఆ ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పించడం జరిగింది. దేశంలోనే తొలిసారి సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసిన ఘనత కూడా మంత్రి కేటిఆర్‌కే దక్కుతుంది. ఈ తొమ్మిదేళ్లకాలంలో నగరం విస్తరించిన తీరును చూసి ఎవరైనా అబ్బురపడాల్సిందే. ఒకప్పుడు కూకట్‌ పల్లి దాటితే నగర శివారు అనే పరిస్ధితి వుండేది. ఇప్పుడు చందానగర్‌ ప్రాంతం మరో నగరాన్ని తలపించేంత గొప్పగా ఆవిషృతమైంది. తెలంగాణ రాకముందు ఐటి సెక్టార్‌ అనేది కొంత వరకు మాత్రమే పరిమితమై వుండేది. తెలంగాణకుముందు ఐటి ఎగుమతులు కేవలం 50వేలకోట్లు. కాని ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలోనే రెండో స్ధానంలో నిలిచింది. త్వరలో మొదటి స్ధానానికి చేరుకుంటుంది. హైదరాబాద్‌ నగరంలో మంచినీటి కటకట అంటే తెలియని వాళ్లు లేరు. వారంలో రెండు రోజుల పాటు వచ్చే మంచినీటి సమస్యతో ప్రజలు ఎంతో సతమతమైన పరిస్దితి. ఉమ్మడి రాష్ట్రంలో ఆ నీటికి కూడా మీటర్‌ పెట్టి మరీ బిల్లులు వసూలు చేసిన రోజులు. అప్పార్టుమెంట్లు నిత్యం వాటర్‌ ట్యాంకర్లు కొంటేగాని పూట గడవని పరిస్దితి. మరి ఇప్పుడు నిత్యం మంచినీరు అందుబాటులోకి తేవడం జరిగింది.
ఈ తొమ్మిదేళ్లలోచెప్పుకోవడానికి కొన్నివందల అభివృద్ధి పనులు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. వందల సంక్షేమపథకాలు అమలులో వున్నాయి. మరి బిజేపి ఏం చెప్పుకుంటుంది? దేశం బైట వున్న నల్లధనం తెస్తామని తెచ్చిందా? నోట్లరద్దుతో దేశాన్నిమొత్తం రోడ్ల మీద నిలబెట్టింది. జిఎస్టీతో పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసింది. ధరలు పెంచింది. సామాన్యుల నడ్డి విరిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లకాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టైనా నిర్మాణం చేసిందా? పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్లు దారాధత్తం చేసింది. వారికి రుణమాఫీలు చేసింది. కాని సామాన్యులకు ఏం చేసింది. అందుకే ప్రజలు ప్రతిపక్ష పార్టీలను పట్టించుకునే పరిస్ధితి లేదు. అంతే కాదు త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశమే అబ్బురపడేంత గొప్ప పథకాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రచారం మొదలు పెట్టిన తర్వాత తెలంగాణ రాజకీయం మరొక లెక్క..అంతే… బిఆర్‌ఎస్‌కు తిరుగులేదు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గెలుపును ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ప్రజల గుండెల్లో వున్నదే మేము..! మేం చేసిన అభివృద్ది పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. బిఆర్‌ఎస్‌ 90స్ధానాలు గెవడం పక్కా!

https://youtube.com/shorts/adGjxOiLdeE

రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం!

https://epaper.netidhatri.com/

బావిబడి జీవితం బంగారుమయం

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌,

నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు..ఆయన మాటల్లోనే..

తెలంగాణలో విద్యా విప్లవం.

`ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం.

`త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు మహార్థశ.

`పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తారా?

 

`ఇదేనా ప్రతిపక్షాలు విధానం!

`బడి పిల్లల ఉపాహారం మీద విమర్శలా?

`గురుకుల విద్యార్థులకు చేపల కూరతో భోజనం పెట్టడాన్ని ఎన్నికలకు ముడిపెడతారా?

 

`ఎన్నికల స్టంట్‌ అని వ్యాఖ్యలా!

`బీఆర్‌ఎస్‌ ను విమర్శించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి?

`కేంద్రం 2020లో దేశ వ్యాప్తంగా బడి పిల్లలకు అల్పాహారం ప్రకటించారు?

`ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు?

`పిల్లలకు ఉపాహారం పెట్టేందుకు కేంద్రం వద్ద నిధులు లేవా?

`పిల్లలంటే ప్రతిపక్షాలకు ఎంత చులకనో అర్థమౌతోంది!

`ప్రధాని మోడీ పసుపు బోర్డు ఇప్పుడెందుకు ప్రకటించారు?

`ఐదేళ్లనుంచి ఎందుకు చేయలేదు?

`పసుపు బోర్డు కన్నా మంచిది ఇచ్చామని అప్పుడెందుకు చెప్పారు?

`వరంగల్‌ స్పైసీ బోర్డు నుంచి ఒక వింగ్‌ నిజామాబాదు కు తరలించి గొప్పలు చెప్పుకున్నారు.

`అబద్దాల పునాదుల మీద బిజేపి నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.

`రాజస్థాన్‌ లో కాంగ్రెస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడే ఎందుకు తగ్గించింది?

`అది ఎన్నికల జిమ్మిక్కు కాదా?

`పిల్లలకు అన్నం పెట్టేందుకు వెనుకాడిన బిజేపికి బిఆర్‌ఎస్‌ ను విమర్శించే అర్హత వుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికలంటే బిఆర్‌ఎస్‌ కు ఒక పవిత్ర యజ్ఞం. ప్రజల జీవితాలలో గొప్ప మార్పుకు సంకేతం. ఆ యజ్ఞంతోనే తెలంగాణ సాధించుకున్నాం. అదే కంకణ బద్దంగా తెలంగాణ అభివృద్ధికి బాటలు చేసుకున్నాం. ప్రపంచంలోనే ఇంత వేగమైన అభివృద్ధి ఎక్కడా జరిగింది లేదు. తొమ్మిదేళ్లలలో జరిగిన అభివృద్ధి అద్భుతం. కాదన్నారంటే వారి కుత్సిత, కుటిల మనస్తత్వాలకు నిదర్శనం. రాజకీయాలలో కాంగ్రెస్‌, బిజేపి నాయకులు అబద్దాలు మాట్లాడడం బాగా అలవాటు చేసున్నారు. తెలంగాణ లో అభివృద్ధి, ప్రగతి అంటే ఏమిటో అర్థం కూడా తెలియని వాళ్లకు పదవీ కాంక్షలు ఎక్కువైపోయింది. బిఆర్‌ఎస్‌ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేయాలని తెలంగాణ వచ్చిన మరు క్షణం నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వున్నారు. వారి అతి తేటలను, కుటిల మనస్తత్వాలను, దుర్నీతిని ప్రజలు ఎప్పకప్పుడు గమనిస్తూనే వున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాలలో ఆ పార్టీలను ప్రజలు ఎప్పుడో దూరం పెట్టారు. అభివృద్ధి నిరోధకులుగా వాళ్లను ప్రజలు గుర్తించారు. రాజకీయాలకు మాత్రమే వారు పరిమితం. తెలంగాణ అభివృద్ధి కాంక్ష ప్రతిపక్షాలలో ఇసుమంతైనా లేదు. ఎంత సేపు అధికార యావ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎంత దుర్మార్గమంటే పరీక్షలు రాసే విద్యార్థులను పుస్తకాలు వదిలిపెట్టమని పిలుపునిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయమని ప్రోత్సాహిస్తున్నారు. ఇంత దుర్మార్గపు రాజకీయాలు ఎక్కడైనా వుంటాయా? రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు అవసరం లేదని ఒకరంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్షాల దిగజారుడు తనం పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం పెట్టడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బడి పిల్లలకు ఇంత మంచి పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడాన్ని ప్రశంసించాలి. విజ్ఞులైతే అభినందించాలి. రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ ప్రతిపక్షాలకు చెందిన నేతలకు విద్యార్థులకు మేలు చేయడం కూడా ఇష్టం లేదు. ఇక గురుకులాల విద్యార్థులకు చేపల కూరను కూడా మెనులో చేర్చడం జరిగింది. అది కూడా తప్పే అన్నట్లు రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు బాగా గమనిస్తున్నారు. వారికి తప్పకుండా ప్రజలు మళ్ళీ గుణపాఠం చెబుతారు. అసలు ప్రజల్లో లేని పార్టీలు తమ ఉనికి కోసం పడే ఆరాటంలో ఆగమాగమౌతున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా సోయిలేకుండా కూతలు కూస్తున్నారు. ఈసారి తెలంగాణ లో విద్యా విప్లవం ఎలా వస్తుందో అతి తొందరలోనే చూస్తామంటున్న మాజీ పార్లమెంటు సభ్యుడు ,రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. బినోద్‌ కుమార్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు… ఆయన మాటల్లోనే…
రానున్న రోజుల్లో తెలంగాణలో విద్యా విప్లవం రానున్నది.
ఇప్పటికే తెలంగాణలో వెయ్యికి పైగా సంక్షేమ గురుకుల పాఠశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా స్కూళ్లలో పేద విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులు, ఉత్తమ భోధన, భద్రత కల్పన జరుగుతోంది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కేజి టు పిజి విద్య అందుతోంది. దాంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత పటిష్టమైంది. తెలంగాణ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంటోంది. కానీ అవి మన రాష్ట్ర ప్రతిపక్షాలకు కనిపించవు. దేశాలోనే స్వచ్చ సర్వేక్షన్‌ అవార్డులు తెలంగాణ కు సింహ భాగం ఏటా వస్తున్నాయి. బిజేపి పెద్దలు డిల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు. తెలంగాణ కు వచ్చి ఏవేవో మాట్లాడి పోతుంటారు. అందుకే ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ అభివృద్ధి అన్నది ఒక్క బిఆర్‌ఎస్‌ మాత్రమే చేయగలదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అందుకే రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు త్వరలో మహార్థశ రానున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భోదన తెలంగాణలో చూస్తున్నాం. రానున్న రోజుల్లో మన విద్యా వ్యవస్థలో అనేక గొప్ప ఆవిష్కరణలు చూడనున్నాం. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇంకా చాలా మంది పిల్లలు స్కూల్‌ కు రావడం లేదు. పల్లెల్లో ప్రైవేటు స్కూళ్లకు ఆస్కారం లేదు. కాస్తో, కూస్తో పిల్లల చదువుల కోసం కొంత వెచ్చించుకోగలం అనుకునే వారు ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. అది కూడా ఆగిపోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా విద్యా బోధన జరుగుతుంది. ప్రైవేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు చాలా తేడా వుంటుంది. అందుకే అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడమే ఉత్తమం. ఇక పల్లెల్లో ఇప్పటికీ తమ పిల్లలను స్కూల్‌ కు పంపకుండా వుండే వారు చాలా మంది వున్నారు. అలాంటి పిల్లలకు పౌష్టికాహారం కూడా అవసరం. ఆ పిల్లలకు ఉదయం ఉపాహారం అందించడం వలన మధ్యాహ్నం వరకు ఆకలి లేకుండా శ్రద్ధగా చదువుకునే అవకాశం వుంది. అది విద్యా పరంగా ఆరోగ్య పరంగా ఎంతో మంచిది. మధ్యాహ్నం మిడ్‌ డే మీల్‌ అందుతుంది. తెలంగాణ ఇరవై లక్షలకు పైగా విద్యార్థుల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని అల్పాహారం అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అన్ని విధాల సౌకర్యాల కల్పన చేసి, ప్రారంభించుకోవడం జరిగింది. దానిని ప్రతిపక్షాలు స్వాగతించాలి. అంతే కాని పిల్లల నోటికాడి ముద్ద లాగేసేలా వ్యవహరించొద్దు. స్కూల్‌ పిల్లలకు ఆహారం అందించడాన్ని కూడా రాజకీయం చేసే బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలు తిరస్కరిస్తున్నాయి. 2020లో కేంద్ర ప్రభుత్వం ఓట్ల కోసం దేశం మొత్తం స్కూళ్లలో పిల్లలకు అల్పాహారం అందిస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు దాని విధి విధానాలు కూడా ఖరారు చేయలేకపోయింది. దేశం మొత్తం మీద వున్న స్కూళ్లలో అల్పాహారం అందించడానికి మూడు వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం వుంది. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు మూడు వేల కోట్లు ఖర్చు చేయాలంటే వారికి చేతులు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తోంది. కనీసం అభినందించాలన్న సోయి కూడా బిజేపికి లేకుండా పోయింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్టానికి వచ్చి సభలు ఏర్పాటు చేసి నిజామాబాదు లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. మంచిదే…కానీ ఈ ఐదేళ్లు ఎందుకు చేయలేదు. తెలంగాణ లో పసుపు బోర్డు ఏర్పాటు కుదరని కూడా చెప్పిన సందర్భాలు కూడా వున్నాయి. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం మొదలవడంతో అంతకు మించిమ స్పైసీ బోర్డు తెచ్చామని ప్రజల్ని నమ్మించారు. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలోనే వరంగల్‌ లో వున్న స్పైసీ బోర్డు నుంచి ఒక వింగ్‌ నిజామాబాదు లో ఏర్పాటు చేసి మమ అనిపించారు. ప్రజలకు బిజేపి అసలు రంగు అర్థమైంది. దాంతో మళ్ళీ ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రస్తావించారు. ఇస్తామన్నారు. అంతే ఎప్పుడు ఇస్తామన్నది చెప్పలేదు. తర్వాత ఇస్తారా? లేదా అన్నది కూడా చెప్పలేం. బిజేపి అబద్దాల రాజకీయాలు అలా వుంటాయి. ఇక కాంగ్రెస్‌ ఇస్తున్న హామీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్‌ లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంది. కానీ ఐదేళ్లుగా రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ అందించడం లేదు. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించింది. చత్తీస్‌గఢ్‌ లో కూడా కాంగ్రెస్‌ పార్టీ యే అధికారంలో వుంది. అక్కడ మాత్రం సిలిండర్‌ అందించే కార్యక్రమం లేదు. కర్నాటక లో ప్రకటించి ఆరు నెలలౌతున్నా ఇంత వరకు అమలు చేస్తున్నది లేదు. ఇలాంటి ప్రతిపక్షాలు తెలంగాణ లో రాజకీయాలు చేయడం మన దౌర్భాగ్యం. ఇలాంటి పార్టీలు తెలంగాణ లో అధికారం కోసం అర్రులు చాచడం తప్ప అభివృద్ధి చేయడానికి పనికి రావు. ప్రజలకు కూడా ఈ విషయం బాగా తెలుసు. ఈ ఎన్నికలలో కూడా లేనివి వున్నట్లు, వున్నవి లేనట్లు ప్రచారం చేసి ప్రజలను గందరగోళ పర్చాలని చూస్తున్నారు. ప్రజలు వాళ్ల మాటలు వినరని మరో సారి రుజువౌతుంది. బిఆర్‌ఎస్‌ కచ్చితంగా 90కి పైగా సీట్లు గెల్చుకుంటుంది.

కాంగ్రెస్‌ ను నమ్మితే ఖతమే! బతుకులు తలకిందులే!!

https://epaper.netidhatri.com/

Continue reading కాంగ్రెస్‌ ను నమ్మితే ఖతమే! బతుకులు తలకిందులే!!

కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

https://epaper.netidhatri.com/

కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!!

`భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే…

`కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!

`బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ!

`నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు.

`ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు.

`ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు.

`గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు.

`టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు.

`బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

`తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.

`ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు.
`జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు.

`ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు.

`మూడోసారి భంగపాటు తప్పదు.

` కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. రేవంత్‌ ను నమ్ముకున్న కాంగ్రెస్‌ కు దక్కేది రెవడే..మిగిలేవి పగటి కలలే. తెలంగాణ ఆత్మాభిమానంపై కాంగ్రెస్‌ ఏనాడో దెబ్బ కొట్టింది. ఇచ్చింది మేమే అంటున్న కాంగ్రెస్సే తెలంగాణ ను ముంచింది. తెలంగాణ ఉద్యమానికి కనీసం సంబంధం లేని వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిని చేసుకొని అధికారంలోకి వస్తామనుకోవడం అంటేనే ఆ పార్టీ నిజ స్వరూపం అర్థమౌతోంది. అంతే కాదు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కొన్ని సత్యాలు తెలియాల్సి వుంది. 2014 ఎన్నికలలో ఆంద్రప్రదేశ్‌ లో ప్రచారం చేసిన రాహుల్‌ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటనలు చేశారు. తెలంగాణకొచ్చి రాష్ట్రం ఇచ్చాం కాబట్టి కృతజ్ఞత తీర్చుకోండి అన్నట్లు మాట్లాడాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోనే మా పని అయిపొయింది. తెలంగాణ కు ఏమీ ఇవ్వాల్సిన పని లేదని తేల్చేసిన కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం అన్నది ఇక ఎప్పుడూ జరగదు. ఆంద్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పలేదు? ఇప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరు క్షణం ప్రత్యేక హోదా ఇస్తామనే కాంగ్రెస్‌ చెబుతోంది. అసలు అరవై ఏళ్లపాటు గోస పడిరదే తెలంగాణ. బాగుపడిరదే ఆంద్రప్రదేశ్‌. తెలంగాణ వస్తే అంధకారమౌతుంది. అడుక్కుతినే పరిస్థితి వస్తుంది. మేం లేకుండా ఒక్క రోజు కూడా బతకలేరు. అసలు తెలంగాణ నాయకులకు పాలన చేయడం కూడా రాదు. తొండలు గుడ్లు పెట్టేందుకు కూడా పనికి రాని తెలంగాణ భూములని ఎగతాళి చేశారు. తెలంగాణ కు అన్నం పెడుతున్నదే మేమన్నారు. విడిపోయి తెలంగాణ నష్టపోకూడదనే చెబుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో విడిపోయి నష్టపోయామంటున్నారు. వాళ్ల మాటలు నమ్మి ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించలేని కాంగ్రెస్‌ ను ప్రజలు నమ్మతారని ఎలా అనుకుంటున్నారు. పగటి కలలు ఎందుకు కంటున్నారు. ముందు తెలంగాణ ను ప్రేమించడం కాంగ్రెస్‌ నేతలు నేర్చుకోవాలొలి. కేవలం అదికార యావ తప్ప తెలంగాణ మీద కాంగ్రెస్‌ కు ఎలాంటి మమకారం లేదు. తెలంగాణ ఇచ్చామన్న కృతజ్ఞత తీర్చుకోవాలన్న అహంకారంతో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. అంతే కాదు తెలంగాణ లో కాంగ్రెస్‌ కు అధికారం ఇవ్వకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరు క్షణం రెండు రాష్ట్రాలు కలుపుతామని కాంగ్రెస్‌ నాయకులు అన్న మాటలు ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మితే నిండా మునిగినట్లే అన్న సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే పదేళ్లయినా ప్రజలు కాంగ్రెస్‌ ను నమ్మేందుకు సిద్దంగా లేదు. కాంగ్రెస్‌ పథకాల ప్రచారం అంతా పెద్ద డ్రామా… అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ మోసాలు ఎలా వుంటాయో వివరించారు… ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ లో అధికారంలోకి రావాలన్న తపన మాత్రమే కనిపిస్తోంది.
తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఓ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌ లో అధికారంలోకి రావడం కోసం 2014 లో చంద్రబాబు చెప్పివన్నీ అబద్దాలే అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అబద్దాలు చెప్పి నమ్మించడం తప్ప ప్రజలను నిజాలతో నమ్మించలేమని స్వయంగా రేవంత్‌ రెడ్డే అన్నారు. కావాలంటే ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో రేవంత్‌ రెడ్డి చెప్పిన వీడియో వుంది. అందుకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కోరిక కాంగ్రెస్‌ కన్నా రేవంత్‌ కు ఎక్కువ ఆశగా వుంది. అసలు తెలంగాణ లో ప్రజలు కాంగ్రెస్‌ నే నమ్మడం లేదు. అలాంటిది రేవంత్‌ ను నమ్మి ఓట్లు వేయడం అన్నది కల. కలగంటే కూడా తీరని కోరిక. గత ఏడాది క్రితం వరకు కాంగ్రెస్‌ లో వున్న వాళ్లే కాంగ్రెస్‌ పని అయిపోయింది అని చెప్పిన సందర్భం వుంది. కేవలం కర్నాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ ఊపుకొచ్చిందన్న ఊహల్లో విహరిస్తున్నారు. అసలు విషయం దాచి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కర్నాటక లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి పదిహేను సంవత్సరాలౌతుంది. రెండు సార్లు బిజేపి స్వంత మెజారిటీతో కర్నాటక లో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ జేడీఎస్‌ కూడమి మెజారిటీ సీట్లు సాధించింది. కానీ బిజేపి కాంగ్రెస్‌ ను చీల్చి మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. పైగా బిజేపి పార్టీ పైకి చెప్పేదొకటి చేసేది ఒకటి అని ప్రజలకు తెలిసిపోయింది. దాంతో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ ను మోసం చేయడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు బాగా ప్రభావం చూపాయి. బిజేపి కర్నాటక ఆత్మ గౌరవంతో ఆడుకున్నది. ఎలాగైనా గుజరాత్‌ కు అమూల్‌ పెరుగును కర్నాటక ప్రజల మీద రుద్దాలనుకున్నారు. కర్నాటక లో పేరు మోసిన పెరుగు కంపనీని అమూల్‌ లో విలీనం చేయాలనుకున్నారు. దానికి తోడు పెరుగు పేర కన్నడం లో కాకుండా కేవలం హిందీలో రాయాలని కేంద్రం నిర్ణయం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పెరుగు ప్యాకెట్ల మీద హిందీ బాషను మాత్రమే ప్రింట్‌ చేయాలని ఒత్తిడి ని దేశ ప్రజలతో పాటు కర్నాటక ప్రజలు కూడా తిరస్కరించారు. బలవంతంగా హిందిని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడమే అవుతుందని కర్నాటక బిజేపి మీద కన్నెర్ర చేసింది. బిజేపిని కాదని, కాంగ్రెస్‌ కు కర్నాటక ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్‌ కొన్ని అలవికానీ హామీలను గుప్పించడం కూడా సీట్లు పెరగడానికి కారణమైంది. అంతే తప్ప కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలే కర్నాటక లో అధికారం సిద్దించలేదు. కర్నాటక లో బిజేపి ఓటమికి ఇన్ని కారణాలున్నాయి. పైగా బిజేపి మళ్ళీ అధికారంలోకి తెచ్చినా తనకు పెద్ద ప్రాధాన్యత లభించకపోవచ్చని యడ్యూరప్ప సైలెంట్‌ గా వుండడం కూడా బిజేపి కి మైనస్‌ అయ్యింది. కాంగ్రెస్‌ కు అది కూడా కొంత కలిసి వచ్చింది. ఇదీ అసలు ముచ్చట.
కాంగ్రెస్‌ వన్నీ కోతలే! కాంగ్రెస్‌ చెప్పే విషయాలు నమ్మశక్యమైనవి కాదు.
గతంలో ఇలాంటి పథకాలు అమలు చేసింది లేదు. కాంగ్రెస్‌ పార్టీ అంటే జాతీయ పార్టీ. ఆ పార్టీలో ఏదైనా ఒక విధానం తీసుకుంటే అది అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి. తెలంగాణ తో పాటు త్వరలో ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలలో కూడా ఇదే మేనిఫెస్టో అమలు చేస్తారా? అన్నది చెప్పాలి. ఇప్పటికే అధికారంలో వున్న చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ లలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. అధికారంలో వున్న రాష్ట్రాలలో అమలు చేయకుండా ఎందుకున్నారు.
హస్తమంతా రిక్తమే!! అంతే అంతా ఉత్తదే. కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!
కర్నాటక లో ప్రకటించిన ఏ ఒక్కటి ఇంకా అమలుకు నోచుకోలేదు. కర్నాటక లో అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా అక్కడ సిలిండర్‌ రూ. 500కు సిలిండర్‌ ఇచ్చింది లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హెల్త్‌ స్కీమ్‌ లేదు. ఇందిరమ్మ ఇండ్లు కర్నాటక లో లేదు. జాగాలున్న వారికి రూ. 5 లక్షల పథకం లేనే లేదు. రైతులకు రైతుబందు లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. కానీ తెలంగాణ లో మాత్రమే ఇస్తారట. నిన్నటి దాకా తెలంగాణ అప్పుల రాష్ట్రం అన్నారు. జీతాలకే పైసలు లేవన్నారు. ఇవన్నీ ఎలా అమలు చేస్తారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత నిజాయితీ వుండాలి. ఇంత కాలం తెలంగాణ సంపన్న రాష్ట్రం అని ఒక్కసారైనా అని వుంటే బాగుండేది. పూరి గుడిసెలో ఏసి ఫిట్‌ చేస్తామని చెబితే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్‌ చెప్పింది అలాగే వుంది. తెలంగాణ లో ఆదాయం అప్పలకే సరిపోతుందన్న వాళ్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే జనం నమ్ముతారా?
బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు నిశితంగా పరిశీలిస్తే కొత్తగా వాళ్లు చెబుతున్నది ఏమీ లేదు?
ఎందుకంటే వాళ్లు వచ్చేది లేదు. ఇచ్చేది లేదు. అందుకే నోటికొచ్చిన హామీలిస్తున్నారు.ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు బాగా తెలుసు. గెలిచేది లేదన్నది సీనియర్‌ నేతలందరికీ నాయకులకు తెలుసు. ఓ వైపు టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు నిత్యం వినిపిస్తున్నవే. కేవలం డబ్బులు వున్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని చెప్పుకుంటున్న మాటలే. టిక్కెట్ల పేరుతో రేవంత్‌ రెడ్డి సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. ఇది తెలిసే సీనియర్లు గుర్రుగా వున్నారు. పైగా బైట నుంచి ఎవరొస్తారా? టిక్కెట్లు అమ్ముకుందామా? దుకాణం నడుస్తోంది. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. ముచ్చట మూడో సారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం తధ్యం. తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు. జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు. ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు. మూడోసారి భంగపాటు తప్పదు. కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు. కేవలం తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్‌ రెడ్డి ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నమ్మడం లేదు. తెలంగాణ కోసం ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తో కలిసి పద్నాలుగేళ్లు కొట్లాడి సాధిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన రేవంత్‌ ను కాంగ్రెస్‌ నేతలు నమ్మినా ప్రజలు జీవితంలో నమ్మరు. రేవంత్‌ రెడ్డి వున్న కాంగ్రెస్‌ కు ఓటు కూడా వేయరు. రేవంత్‌ సృష్టిస్తున్న అబద్దాల మాయా మశ్చీంద్రను జనం అసలే నమ్మరు. తన సొంత నియోజకవర్గ ప్రజలే తెలంగాణ విషయంలో రేవంత్‌ చేసిన పాడు పనికి చీ కొట్టి ఓడిరచారు. ఇక తెలంగాణ ప్రజలు నమ్మడం అనే కల్ల. కాంగ్రెస్‌ పథకాలన్నీ డొల్ల.

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!

https://epaper.netidhatri.com/

పదేళ్ల లో తెలంగాణ పురోగతిపై పారిశ్రామిక ప్రగతి గురించి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ‘‘దాస్యం వినయ్‌ భాస్కర్‌’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…

` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి.

`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.

`ఐటిలో మేటి తెలంగాణ.

`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.

`ఫార్మాహబ్‌ గా తెలంగాణ.

`హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు.

`కొత్త కట్టడాలు.

`మహానగరంగా…విశ్వ నగరంగా

`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్‌ లోనే.

`బిజినెస్‌ సమ్మిట్ల వేధిక.

`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్‌ లో..

`రజనీకాంత్‌ లాంటి వారు ఆశ్చర్యపోయామన్నారు.

`లండన్‌ లో వున్నానా అని చెప్పిన సినీ నటి లయ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక్కసారి కళ్లు మూసుకొని గతంలోకి తొంగిచూసి, కళ్లు తెరిస్తే చాలు మన తెలంగాణ ఒక అందమైన ప్రపంచాన్ని తలపిస్తుంది. నాటి రోజులు, నేటి రోజులు బేరీజు వేసుకుంటే అందమైన ప్రపంచమే మన కళ్లముందు ఆవిషృతమౌతుంది. అంతలా తెలంగాణ మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పదేళ్ల క్రితం తెలంగాణ చూసిన వాళ్లు మళ్లీ హైదరాబాద్‌ వస్తే ఆశ్చర్యపోక తప్పదు. అసలు ట్యాంక్‌ బండ్‌ను కొన్ని దశాబ్దాల పాటు చూసిన వాళ్లు, మళ్లీ ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం వక్తం చేస్తారు. అటు కొత్త సెక్రెటరియేట్‌, ఇటు అంబెద్కర్‌ విగ్రహం, ఆ పక్కన అమర వీరుల స్మృతి వనం, ముందు హుస్సేన్‌ సాగర్‌ , మధ్యలో గౌతమ బుద్దుడు. చెప్పుకుంటుంటూనే ఒక అందమైన లోకంలో విహరించినట్లు అనిపిస్తుంంది. చూసేవారికి సుందర లోకం కనిపిస్తుంది. ఇద మన తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేంతగా ఎదగింది. దీనంతకీ కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన పాలనలో తెలంగాణే పెట్టుబడులకు స్వర్గదామంగా మారిపోయింది. పదేళ్ల క్రితం తెలంగాణ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏముందో వింటే మనసు కలిచివేస్తుంది. కన్నీళ్ల దుఖం తన్నుకొస్తుంది. ఆ గోసులు కళ్లముందు కదలాడుతుంటాయి. ఉపాధిలేక, వ్యవసాయం సాగక, చేతినిండా పని లేక, పస్తులతో కాలం వెల్లదీసింది తెలంగాణ. తెలంగాణ పల్లెల నిండా సమస్యలే..ఆకలి బాధలే…అరణ్య రోధనలే…ఇంటి ముందు కనీసం పాడి కూడా లేకుండా, పశువులను కూడా సాదుకోలేని దుస్ధితి తెలంగానది. అలాంటి తెలంగాణను విముక్తి చేయాలని, తెలంగాణ వస్తే తప్ప బతుకులు బాడపడవని, ఉమ్మడి రాష్ట్రంలో ఇక ఊపిరి కూడా తీసుకోలేమని ముఖ్యమంత్రి కేసిఆర్‌ పద్నాలుగేళ్ల సుధీర్ఘ పోరాటం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేశాడు. ఉద్యమ బాట పట్టించాడు. తెలంగాణ వెతలు తీరాలంటే తెలంగాణ రావాల్సిందే అని ప్రజల్లో చైతన్యం నింపాడు. దేశానికి అవసరమైతే ఇంటికో సైనికుడు ఎలా తయారు కావాలో..తెలంగాణ కోసం కూడా ఇంటికొకరు కదలాలని చెబితే మొత్తం తెలంగాణ సమాజామే కదిలింది. కేసిఆర్‌ వెంట నడిచింది. తెలంగాణ సాధన కోసం అహర్నిషలు కొట్లాడి కేసిఆర్‌ తెలంగాణ సాధించారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేశారు. తెలంగాణ జీవితాల్లో వెలుగులు నింపారు. తెలంగాణ యువత కోసం మరో లోకం నిర్మించారు. హైదరాబాద్‌లో అధ్భుతమైన అవకాశాల కల్పన వేదికను చేశారు. తెలంగాణనే పెట్టుబడుడుల స్వర్గదామం చేశారు. అందుకోసం మంత్రి కేటిఆర్‌ చేసిన కృషి అంతా ఇంతా కాదు. తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో అన్ని రంగాల పురోగతి సాధించడం అన్నది సామాన్య విషయంకాదు. అందరి వల్ల అయ్యేది కాదు. ఇలా ఏక కాలంలో సమ్మిలిత వృద్ధి సాధించడం అన్నది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలు తిరిగి వచ్చిన వారు ఆ దేశాల గొప్పదనం చెబుతుండేవారు. ఇప్పుడు అమెరికాలాంటి దేశాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు అమెరికాలో కొన్ని వందల ఎకరాలు స్ధలాలుండి, ఆస్ధులు సంపాదించిన వాళ్లు కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో ఎకరం స్ధలం కొనాలంటే మా స్దోమత సరిపోదని చెబుతున్నారు. అంటే తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగిందో, తెలంగాణ సగటు వ్యక్తి ఎంత ఎదిగాడో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్‌లో ఎంత అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మధ్య తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ హైదరాబాద్‌లో తిరుగి, నేను అమెరికాలో వున్నానా..లండన్‌లో వున్నానా? అన్న అనుమానం కలిగిందని కితాబిచ్చారు. సీని నటి లయ లండన్‌ నుంచి వచ్చినా లండన్‌లో వున్నట్లే అనిపిస్తందని చెప్పింది. అంటే హైదరాబాద్‌ ఎంతలా అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. అనితర సాధ్యమైన పనిని, సాధించి తెలంగాణ ప్రజలకు బహుమానంగా అందించడం అంటే మాటలు కాదు. అలాంటి అభివృద్ధి యజ్ఞంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలకు, ఆచర రూపం కల్పించి తెలంగాణను పారిశ్రామిక రంగంలో నెంబర్‌ వన్‌ చేశారు. తెలంగాణలో మంత్రి కేటిఆర్‌ పారిశ్రామిక విప్లవం సృష్టించారు. అంటున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ హన్మకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌ , నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ రాకు ముందు ఐటి ఎగుమతులు రూ.50వేల కోట్లు. కాని నేడు అంతకు నాలుగురెట్లు పెరిగింది.
ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల ఐటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఐటి అంటే బెంగుళూరు గురించి చెప్పుకునేవారు. ఆ తర్వాత చెన్నై అనేవారు. కాని నేడు ఎక్కడ విన్నా హైదరాబాద్‌ గురించె మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం మూలంగా పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వస్తే చిమ్మ చీకట్ల మయమౌతుందని భయపెట్టారు. తెలంగాణరాష్ట్రం సాధించుకున్నా ముఖ్యమంత్రికేసిఆర్‌ విజన్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ వెలుగులు చూసి నిజమా..కలా అనుకుంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ముందుకు వచ్చేవారు. అప్పటి ప్రభుత్వాలు ఎంత ఆహ్వానించినా వచ్చేవారు కాదు. కారణం కరంటు. ఒక దశలో పరిశ్రమలు కూడా పవర్‌ హాలిడే ప్రకటించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడిరది. అంతే కాదు చంద్రబాబు ముఖ్యమంత్రి వున్న సమయంలో క్రాప్‌ హాలిడే కూడా ప్రకటించడం చూశాం. అసలు తెలంగాణలో సాగే లేదంటే క్రాప్‌ హలిడే ప్రకటించి తెలంగాణను అంధకారం చేశారు. అలాంటి కాలం నుంచి తెలంగాణ నేడు వెలుగు కాలం చూస్తోంది. రెప్పపాటు కూడా పోని కరంటును చూస్తోంది. దేశంలో ఎక్కడా ఇంతగా విద్యుత్‌ సౌకర్యం లేదు. బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ప్రస్తుతం కరంటు కోతలు వున్న సంగతి తెలిసిందే. కాని తెలంగాణలో ఒక్క గృహ అవసరాలకే కాదు, రైతాంగానికి ఉచితంగా 24 గంటల కరంటు ఇవ్వడం జరుగుతోంది. పరిశ్రమలకు పవర్‌ హాలీడే అన్నది ఎప్పుడూ లేదు. తెలంగాణలో ఐటి పరిశ్రమతోపాటు ఫార్మా రంగం కూడా విస్తరించింది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో పెద్దఎత్తున ఫార్మాకంపనీలు తెలంగాణలో తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. ఈ సందర్భంగా హెటిరో సంస్ధ పార్ధసారధిరెడ్డి చెప్పిన విషయం గుర్తు చేయాలి. గతంలో తమ ప్లాంటుకు నిత్యం కొన్ని వందల వాటర్‌ ట్యాంకులు కొని తెచ్చుకునే వాళ్లం. విదేశాల ప్రతినిధులు ఓ ఫార్మా తయారీ కోసం తమ సంస్ధను ఎంచుకొని అగ్రిమెంట్లు జరిగే సమయంలో వాటర్‌ ట్యాంకులను చూసి ఆ ఒప్పందం ఆగిపోయింది. ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ తమ సంస్ధను సందర్శించినప్పుడు అదే సీన్‌ చూశారు. మాకు నీటి కొరత వుందని ఒక్క మాట చెప్పగానే వారం రోజుల్లో నీటి సౌకర్యం కల్పించారని చెప్పారు. అంటే తెలంగాణ పారిశ్రామిక రంగం వృద్ధి మీద ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎంత చిత్త శుద్ది వుందో ఈ ఒక్క సంఘటనతోనే తెలుసుకోవచ్చు. తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోంది. తెలంగాణలో గ్లోబల్‌ సెంటర్ల ఏర్పాటు పెరుగుతోంది. గతంలో బెంగుళూరును ఎంచుకునేవారు. కాని ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో తమ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2020లో 5 సెంటర్లతో మొదలై గ్లోబల్‌ సెంటర్ల ఏర్పాటు ఈ ఏడాది ఏకంగా 33 సెంటర్లు ఏర్పాటు చేశారంటే హైదరాబాద్‌ బ్రాండ్‌ గొప్పదనం తెలుస్తోంది. ఇలా తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తోంది. ఏ రంగం చూసినా తెలంగాణే కనిపిస్తోంది. సంక్షేమ రంగంలో తెలంగాణను మించిన రాష్ట్రం మరొకటి లేదు. అభివృద్ధి విషయంలో తెలంగాణతో పోటీ పడే రాష్ట్రం లేదు. పారిశ్రామిక ప్రగతి పరుగులో తెలంగాణే ముందుంది. చివరికి తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన నేలల్లోనే బంగారు పంటలు పండుతున్నాయి. వ్యవసాయం రంగంలోనూ నెంబర్‌ వన్‌గా వెలుగొందుతోంది. అదీ కేసిఆర్‌ పాలనకు నిదర్శనం. తెలంగాణ ప్రగతికి సంకేతం. పారిశ్రామికాభివృ ద్ధికి నిదర్శనం.

తెలంగాణ స్వాభిమాన పతాక

https://epaper.netidhatri.com/

`స్వావలంబన అభిమాన గీతిక.

`తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవ ప్రతీక.

` కేంద్ర సాయం మీద ఆధారపడకుండా నిలిచిన వేధిక.

`విభజన హామీలు అమల కోసం ఎదురు చూడకుండా ఎదిగిన అభివృద్ధి నమూన.

` కేసిఆర్‌ నిరంతర శ్రమ..అహర్నిశలు పడిన తపన.

`ఇంత వేగవంతమైన అభివృద్ధి ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యమైంది.

`ఉమ్మడి పాలకులు పీల్చి పిప్పి చేశారు.

`పదేళ్లలో కేసిఆర్‌ నిలబెట్టి చూపించారు.

`తెలంగాణ బాగు పడడం గిట్టని వాళ్ల కళ్లు కుళ్లుకుంటున్నాయి.

`తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి.

`తెలంగాణకు మళ్ళీ పాత రోజులు తేవాలని చూస్తున్నాయి.

తెలంగాణ పోరాటి సాధించుకున్న ఆత్మ గౌరవ పతాక. స్వాభిమాన వీచిక. గుండె ధైర్యం నిండిన విజయ వేధిక. ఉద్యమమే నినాదమైన, తెలంగాణ పదమే వేదమైన కరదీపిక. దేశానికే వెలుగు రేఖ. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వావలంబన గీతిక. ఇంత గొప్పది నా తెలంగాణ. ఆ తెలంగాణ రావడానికి, నేడు బంగారు తెలంగాణ నిర్మాణం జరిగింది ఒక్కరితోనే. ఆ ఒక్కరే ముఖ్యమంత్రి కేసిఆర్‌. అసలు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆత్మాభిమాన ఉద్యమ బాట. తెలంగాణకు పోరాటం కొత్త కాదు. గెలవడం కొత్త కాదు. సమస్యలు కొత్త కాదు. వాటిని అధిగమించడం కొత్త కాదు. గెలిచి నిలబడిన చరిత్ర కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక చరిత్ర సృష్టించడమే తెలంగాణ గొప్పదనం. ప్రపంచ దేశాలకే పోరాట విలువలు నేర్పిన ఏకైక ప్రాంతం తెలంగాణ. నిజాం కాలంలో రైతంగా సాయధ పోరాటమైనా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమమైనా వ్యవస్ధలకు పట్టుదలను రుచి చూపించిన నిఘంటువు నా తెలంగాణ. భూమికోసం , భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తికోసం పోరాటాలు ఎన్ని జరిపినా అలసిపోలేదు. అలాగే అభివృద్దిలోనూ ఆగిపోలేదు. పోరాటమైనా, ప్రగతి దారైనా ముందుకే. తెలంగాణ ఎవరి సహాకారం కోరదు. తెలంగాణ ఎవరి మీద ఆధారపడదు. ఇది నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌.
తెలంగాణ రాక ముందు ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు ఎన్ని మాటలు అన్నారో విన్నాం.
తెలంగాణ వచ్చిన తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పదేళ్లుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. అయినా ఎక్కడా వెరవలేదు. ఆగిపోలేదు. అలసిపోలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలను దాటకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏనాడో గుజరాత్‌ను వెనక్కి నెట్టేశాం. ఇదే బిజేపికి నచ్చని విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బిజేపి సహకరించిందన్న మాట మినహా…2014 నుంచి తెలంగాణ కోసం కేంద్రం ఏ సహాయం చేయలేదన్నది తెలుసుకోవాలి. 2014 ఎన్నికల్లో సాక్ష్యాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ కింద ప్రధాని మోడీ మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని అన్నారు. ఆ తర్వాత ఆ మాటను అనేక మార్లు ఉటంకించారు. అవకాశం దొరికనప్పుడల్లా తెలంగాణ మీద విషం కక్కారు. తెలంగాణ ఏర్పాటు కావడం తనకు ఇష్టం లేదన్నంతగా పరక్ష వ్యాఖ్యలు చేశారు. 1998లో కాకినాడలో జరిగిన బిజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తీర్మాణం చేసి, ఉత్తరాధిన మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కాని తెలంగాణను వదిలేసింది. నిజానికి బిజేపి ప్రభుత్వ హాయంలో ఇచ్చిన మూడు రాష్ట్రాలకన్నా ముందు నుంచి సాగుతున్న ఉద్యమం తెలంగాణది. 1956లోనే నాటి ప్రధాని నెహ్రూ తెలంగాణ ప్రజలు వద్దనుకున్న నాడు ప్రత్యేకమైపోవచ్చు. అని కూడా చెప్పారు. కాని ఆయన హయాంలో కుదరలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఇవ్వలేదు. ఎవరూ ఇవ్వలేదు. ఆఖరకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ సారధ్యంలో సాగిన పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. దీన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోవడం లేదు. గతంలో పాత పార్లమెంటులో పలుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టారు. ఆఖరుకు ఇటీవల కొత్త పార్లమెంటు తొలి రోజున కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇదే ఒక ప్రధాని చేయాల్సిన వ్యాఖ్యలు. అయినా సరే తెలంగాణ ప్రజలు భరిస్తూనే వున్నారు.
ఇక తెలంగాణ ఇస్తే చిమ్మ చీకట్లౌతుందని సీమాంధ్ర నేతలు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అసలు తెలంగాణ మనుగడే సాధ్యం కాదన్నారు. తెలంగాణ వస్తే ఇక అంధకారమే అంటూ కర్ర పట్టుకొని చీకట్లో నిలబడి కరంటు లెక్కలు చెప్పాడు. ఇప్పుడు ఆ కిరణ్‌కుమార్‌ రెడ్డే తెలంగాణ వెలుగులను చూస్తున్నారు. తెలంగాణ వస్తే కనీసం పెండిరగ్‌ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోలేరనాన్నరు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు వస్తాయన్నారు. అసలు తెలంగాణ భూములు తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరావన్నారు. ఇలా ఎవరికి ఇష్టమెచ్చినట్లు వాళ్లుమాట్లాడారు. తెలంగాణ పూర్వ చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా ఎవరికి తోచించి వారు మాట్లాడారు. కాని తెలంగాణకు ఒక చరిత్ర వుంది. తొలి తెలుగు చరిత్ర మొదలైందే తెలంగాణలో…కరీంనగర్‌ జిల్లాలోని కోటి లింగాలలోనే తొలి శాతవాహన చరిత్రకు శ్రీకారం జరిగింది. ఆ తర్వాతే ధాన్య కటకానికి వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను కనుమరుగు చేశారు. అలా మొదలైన తెలంగాణ ప్రస్తానం కాకతీయ కాలంలో ఉచ్చదశకు చేరుకున్నది. సంపన్న ప్రాంతమై విలసిల్లింది. సుమారు 300 సంవత్సరాలకు పైగా సాగిన కాకతీయ చరిత్రలోనూ తెలంగాణది స్వర్ణయుగమే. ఆ తర్వాత మొగలులపాలనైనా, నిజాం పాలన దాకా తెలంగాణలో కరువు లేదు. ఎందుకంటే నిజం కాలంలో హైదరాబాద్‌ వజ్రాల వ్యాపారానికి పేరెన్నిక కగన్నది. లండన్‌ మహారాణికి అత్యంత విలువైన వజ్రాల హారాన్ని బహూకరించింది నిజాం రాజు. లండన్‌ వీధుల్లో తిరిగే రోల్స్‌ రాయిస్‌ కార్లతో హైదరాబాద్‌ వీధులు ఊడిపించిన చరిత్ర తెలంగాణది. అలాంటి తెలంగాణపై ఎవరు వ్యాఖ్యలు చేసినా వాళ్లే చరిత్ర హీనులయ్యారు.
అలాంటి తెలంగాణను తెచ్చింది కేసిఆర్‌. నిలబెట్టింది కేసిఆర్‌.
పదేళ్లలో తెలంగాణ ప్రగతి రాకెట్‌ కన్నా వేగంగా దూసుకెళ్లింది. అసలు తెలంగాణలో తాగు నీరే దొరకదు. ఇక సాగు నీటి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. అలాంటి తెలంగాణలో కేంద్రం నుంచి రూపాయి సాయం లేకున్నా,ఎలాంటి సహాకారం లేకున్నా కాళేశ్వరం లాంటి అధ్భుతమైన ప్రాజెక్టును ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణం జరిగింది. తెలంగాణ మొత్తం సస్యశ్యామం చేసేందుకు కారణమైంది. అసలు తెలంగాణ సాధించిన మూడేళ్లకే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. మంత్రి హరీష్‌రావు రాత్రింబవళ్లు పర్యవేక్షణ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిశీలన, అంకిత భావం వున్న తెలంగాణ ఇంజనీరింగ్‌ వ్యవస్ధ కలిసి సృష్టించిన భగీరధ నిర్మాణం కాళేశ్వరం. అదే సమయంలో నిర్మాణం మొదలైన పోలవరం అక్కడే ఆగిపోయింది. కాళేశ్వరం పూర్తి చేసుకున్న తర్వాత మొదలు పెట్టిన పాలమూరు..రంగారెడ్డి కూడా పూర్తియ్యింది. దాంతో తెలంగాణ మొత్తం నీటి గంగాలమైంది. వీటి నిర్మాణం సాగుతుండగానే తెలంగాణలోని నలభై ఆరు చెరువులకు పూర్వ వైభవం తేవడం జరిగింది. అనేక రిజర్వాయ్యర్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎన్నేళ్ల కలగానో మిగిలిపోయిన మానేరు ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఖమ్మంలో సీతారామా లాంటి ప్రాజెక్టులు కూడా నీళ్లందిస్తున్నాయి. నీటి చుక్కకు కోసం కన్నీళ్లు కార్చిన తెలంగాణ కళ్లలో ఆనందభాష్పాలు చూస్తున్నామంటే అది కేసిఆర్‌. ఆయన సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఒక యజ్ఞంగా చేపట్టారు. తెలంగాణ మొత్తం నీరందించి, సస్యశ్యామలం చేశారు. ఇక కరంటు కష్టాలు తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో తీర్చాడు. రైతాంగానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరంటు ఇస్తున్నారు. హైదరాబాద్‌ను పెట్టుబడుల స్వర్గధామం చేశాడు. ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా చేశాడు. ఐటి రంగానికి కేరాఫ్‌ చేశాడు. పార్మా రంగంలో తెలంగాణను అగ్రగామి చేశాడు. హైదరాబాద్‌లో ట్రాపిక్‌ సమస్యకు పరిష్కారం చూపెట్టారు. ఈ పదేళ్ల కాలంలో 37 కొత్త ప్లైఓవర్లు నిర్మాణం చేశారు. కొత్త కొత్త నిర్మాణాలు చేసి, హైదరాబాద్‌ రూపు రేఖలు మార్చేశారు. కొత్త సెక్రటెరియేట్‌, ముప్పై మూడు జిల్లాల్లో కొత్త జిల్లా కలెక్టర్ల సముదాయ భవనాలు. అమర వీరుల స్మృతి వనం. 125 అడుగుల అంబెద్కర్‌ విగ్రహంతో కొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించారు. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్ర్రంగా తీర్చిదిద్దుతున్నారు. 33 జిల్లాల్లో కొత్తగా వైద్య విద్యాలయాలు ఏర్పాటుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం సహాకారం లేకుండా, పైసా సాయం లేకుండా నిలబడిరది తెలంగాణ. దాన్ని రూప శిల్పి ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన పేరే ఒక బ్రాండ్‌. హైదరాబాద్‌ ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌. దటీజ్‌ తెలంగాణ…దిసీజ్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన. ఎనీ డౌట్‌!

నా చెరువు నాడు…నేడు!

https://epaper.netidhatri.com/

`గణేష్‌ నిమజ్జనాలకు కూడా నీళ్లుండేవి­ కాదు!

`గణేష్‌ నిమజ్జనాల కోసం తెలంగాణ నుంచి విజయవాడ వరకు వెళ్లాల్సివచ్చేది.

`తెలంగాణ పట్టణ పరిసరాల చెరువుల్లో చుక్క నీరుండేది కాదు.

`కాళేశ్వరం ఇసక ఎడారిని తలపించేది.

`సమ్మక్క జాతరలో జంపన్న వాగులో చుక్క నీరుండేది కాదు.

` కేవలం జాతర కోసం నీళ్లు వదిలే వారు.

`ఇప్పుడు నిరంతరం జంపన వాగులో నీటి ప్రవాహం.

`పుష్కరాలప్పుడు ఆంధ్రా వెళ్లాల్సిందే.

`ఇదీ ఆనాటి తెలంగాణ దుస్థితి.

`ఇప్పుడు ప్రతి పల్లె ఒక నీటి గంగాళం.

`ప్రతి చెరువులో నిరంతరం జలం.

`కుల వృత్తులకు ఆదాయ మార్గం.

`పొలాల గొంతు తడుపుతున్న గంగమ్మ ప్రతిరూపం.`

పాడిపంటలందిస్తున్న అష్టలక్ష్మి వైభవం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కళ తప్పిన నా తెలంగాణ చెరువుకు మళ్లీ జీవమొచ్చింది. చెదిరిన చెరువుకు జలజీవమొచ్చింది. చెరువు బాగైంది. అందమైన నీటి బాంఢగారమైంది. మా చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. అంతకన్నా సుందరంగా ముస్తాబైంది. జలమంత చెవరుకు జగమంత పండగొచ్చింది. ఊరంతా మురిసింది. ఊరే మెరిసింది. సంబరాలు చేసుకున్నది. కూలి పోయిన కులవృత్తులకు మళ్లీ తెలంగాణ పల్లె ఆలవాలమైంది. చెరువే తెలంగాణ పల్లెకు ఆదెరువు. అది ఉమ్మడి రాష్ట్రంలో చెదిరిపోయింది. చిద్రమైపోయింది. పల్లె బతుకు ఆగమైంది. కులవృత్తులు అంతరించిపోయాయి. మత్స సంపద కానరాకుండాపోయింది. దాని మీద ఆధారపడే మురిరాజ్‌లు నారాజైండ్రు. కొత్త ఉపాధి బాటనెంచుకున్నారు. ఊరు వదిలి పట్టణాలు వలస వెళ్లిండ్రు. బొంబాయి లాంటి ప్రాంతాలలో కూలి పనులు చేసుకున్నారు. తెలంగాణలో మత్స సొసైటీలన్నవి కనుమరుయ్యాయి. చెరువే లేక ముదిరాజ్‌ల జీవనమే ఆగమైంది. ఇలా చెరువు ఎండిపోయి సాగు లేకుండాపోయింది. చెరువులో నీరు లేక పశు సంపద మృగ్యమైంది. మొత్తంగా పల్లెకు గ్రహణం పట్టినంత పనైంది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ పల్లెకు మళ్లీ సొగసొచ్చింది. చెరువుకు సోయగమొచ్చింది. తెలంగాణ రాగానే చెరువుకు నీరొచ్చింది. వానా కాలం కాకపోయినా చెరువు నిండిరది. ఏళ్ల తరబడి గొంతెండి పోయిన చెరువు దాహంతీరేదాకా నిండిరది. చెరువు నింపడంతో ఊరంతా పచ్చబడిరది. భూగర్భమంతా నీరు సందడి చేస్తోంది. పల్లెకు పండగొచ్చింది. మళ్లీ సాగు చిగురించింది. ఎండిన బీడులు పొలాలయ్యాయి. గుంట కూడా వదిలిపెట్టకుండా పంట పండుతోంది. ఊరిని సుసంపన్నం చేస్తోంది. చెరువు కుల వృత్తులకు ఆధారమైంది. ఆదాయం సమకూర్చుతోంది. పల్లె జీవితాలను నిలబెట్టింది. ఇదీ తెలంగాణ చెరువుల ఘనత. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణకు అందించిన కలల పంట.
ఒకనాడు నా చెరువులో నీటి చుక్క లేక కొన్ని దశాబ్దాలు ఎండిపోయింది. కాదు..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఒట్టిపోయింది.
వర్షాకాలంలో కూడా చెరువులోకి నీరు రాకుండాపోయింది. ఓ వైపు కరువు. మరో వైపు పాలకుల దుర్మార్గం. ప్రకృతి పగబట్టినట్లే కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణను చినుకు ముద్దాకుండా శాపానికి గురైంది. ఉమ్మడి పాలకుల కోపానికి గురైంది. దాంతో తెలంగాణ చెరువు పూర్తిగా ఎండిపోయింది. తన ఆనవాలు తానేమర్చిపోయింది. ఒక దశలో గణేష్‌ నిమజ్జన సమయంలో విగ్రహాల నిమజ్జనానికి కూడా చుక్క నీరు లేక తెలంగాణ గోసపడిరది. అయ్యో గణనాధా? అంటూ బోరున విలపించింది. భక్తిభావంతో నిలుపుకొని కొలిచిన దేవుడిని నీరు లేని చెరువులో నిమజ్జనం చేయలేక, కొన్ని సార్లు విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్లిన సందర్భాలున్నాయి. ఇక తెలంగాణ పల్లెల్లో కూడా ఎక్కడ ఏ చెరువులో నీరుందో తెలుసుకొని ఎంత దూరమైనా వెళ్లి నిమజ్జనం చేసిన ఘటనలున్నాయి. ఇదీ ఆనాడు తెలంగాణ దీనస్దితి. ఇక తెలంగాణలో ఎంతో గొప్పగా జరుపుకునే ఆది వాసి సమ్మక్క సారక్క జాతర. రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. తలాపున గోదారి పరుగులుపెడుతుంది. కాని సమ్మక్క సారక్క జాతర ప్రాంతంలో జంపన్న వాగు ఎప్పుడూ ఎండిపోయి వుండేది. జాతర సమయంలో జంపన్న వాగులోకి గోదావరి నదీ జలాలు వదిలేవారు. ఆసియాలోనే అత్యంత గొప్ప జాతరగా గుర్తింపు వున్న మేడారం జాతరలో నీటి కట కట అలా వుండేది. కనీసం భక్తులు స్నానాలు చేసేందుకు కూడా నీరు సమృద్దిగా వుండేది కాదు. మరి ఇప్పుడు నిరంతరం జంపన్న వాగు జీవ నదిలా పారుతోంది. మేడారం వచ్చిన భక్తుల పాపాలను కడిగేస్తూ నిరంతరం సాగిపోతోంది. ఇదీ నా తెలంగాణ. ఇక పుష్కరాల సమయం అంటే చాలు ఆంధ్రాకు పండగ. తెలంగాణలో కూడా కృష్ణా, గోదారి నదులు పారుతున్నా వాటిలో స్నానం చేసేందుకు కూడా ఉమ్మడి పాలకులు అవకాశం కల్పించేవారు కాదు. అసలు తెలంగాణలో పారుతూవున్న గోదారి నీళ్లకన్నా, రాజమండ్రి వెళ్తేనే పుణ్యం అన్నంతగా ప్రచారం చేసేవారు. కృష్ణా నది పుష్కరాల సమయంలో విజయవాడలో స్నానం చేస్తేనే పుణ్య స్నానం పూర్తయినట్లు చెప్పేవారు. దాంతో తెలంగాణలో ఆ నదులున్నా, ఆ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. నీటి గోసకు, నిర్లక్ష్యానికి తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌ చేశారు. తెలంగాణ ప్రజలు ఆగమౌతుంటే నవ్వుకున్నారు.
నా తెలంగాణ పచ్చబడాలి. పల్లె కళకళలాడాలి. పచ్చ దనం వెల్లివిరియాలి.
పాడి పంట సమృద్ధిగా మారాలి. పల్లెలో కరువును తరిమివేయాలి. పల్లెకు మళ్లీ వెలుగు రావాలి. ఊరంతా పండగ కావాలి. అంటే ముందు చెరువు బాగు పడాలి. చెరువుకు పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పించారు. తెలంగాణలో వున్న నలభై ఆరు వేల చెరువులను మూడేళ్లలలో దశల వారిగా బాగు చేశారు. ముందు కరువు రక్కసితో బాధపడుతున్న ప్రాంతాలను గుర్తించారు. తొలి విడతలో ఆ చెరువుల బాగుకు ప్రణాళికలు తయారు చేశారు. తెలంగాణ వచ్చిన తొలి ఏడాది నుంచే చెరువుల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. ముందు చెరువుల్లో పూడిక తీయించారు. చెరువు కట్టలు బాగు చేశారు. వాటిపై తాటి, ఈత చెట్లు పెంచారు. 2015లోనే చెరువులు గోదావరి నీళ్లతో నింపడం మొదలు పెట్టారు. ఒక్కసారిగా తెలంగాణ వాతావరణం మారిపోయింది. కొన్ని దశాబ్దాలుగా చుక్క నీటిని చూడని చెరువులు ఎండకాలంలో మత్తళ్లు పోశాయి. వాగులు వంకలు వానలు లేకున్నా పారాయి. మత్తళ్లు దుంకుతూ పారిన జలాలు గొలుసు కట్టు చెరువుల బాటన ఒక చెరువు నుంచి మరో చెరువు చేరాయి. ఇలా తెలంగాణలో చెరువులన్నీ నిండాయి. ఊళ్లన్నీ పచ్చబడ్డాయి. ఎండిపోయిన బావుల్లో ఊటలు మొదలయ్యాయి. వానాకాలంలో ఎల్లబోసే బావులు ఎండాకాలంలో కూడా ఎల్లబోశాయి. ఎండిన బోర్ల నీళ్లతో నిండాయి. ఇంతలో నిరంతర ఉచిత కరంటు వచ్చింది. రైతులకు వరమైంది. పాడి పంటల పండుగలు మళ్లీ మొదయ్యాయి. ఇలా చెరువులు నీటి గంగాళాలై నిత్యం కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు చెరువు ఆనవాలు వుందా? అన్న అనుమానం వున్న చోట చెరువు లోతుగా వుంది. అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రతి పల్లెలో నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ చెరువులు నిండి మత్స సంపదకు ఆలవాలమైంది. పొలాలు తడిపే గంగమ్మతల్లి ప్రతిరూపమైంది. ఒక రకంగా చెప్పాలంటే పాడిపంటల సంపదనందిస్తూ, అష్టలక్ష్మి వైభవం పల్లె చూస్తోంది. ఇదంతా కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. అపర భగీరధుడు కలలు గన్న తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ సస్యశ్యామలమైంది. ఈ తరానికి చెరువును చూపించడమే కాదు, పాడి పంటలను అందించే వరంగా తీర్చిదిద్దారు. మలి తరానికి బంగారు బాటలు వేశారు. Continue reading నా చెరువు నాడు…నేడు!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version