బాలానగర్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
జడ్చర్ల / నేటి ధాత్రి.
జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండల కేంద్రంలోని జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్లో సోమవారం భారతీయ జనతా 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో.. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1980లో ఏర్పడినప్పుడు 2 సీట్లతో ప్రారంభమై, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు.పార్టీ సిద్ధాంతం ప్రకారం “దేశ ప్రథమం” నినాదంతో, జాతీయవాదం, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో.. మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేష్ , శ్రీనివాస్ కార్యదర్శి బాలరాజు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ శ్రీశైలం, బీజేపీ సీనియర్ నాయకులు నర్సింలు,యాదయ్య, సామ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
