తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో సిసి రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీర్లవంచ గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ విధుల నుండి మంజూరైన పది లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మించుతూ గ్రామ అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో పల్లెల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఇకముందు కూడా గ్రామాలలో అభివృద్ధి చేయడానికి మరిన్ని నిధులు రావడానికి కృషి చేస్తామని తెలియజేశారు నిధులు మంజూరు చేయడానికి కృషిచేసిన వేములవాడ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్ డైరెక్టర్లు గంగుకొండయ్య గ్రామ శాఖ అధ్యక్షులు గంగు మహేష్ నాయకులు నలువాల జలంధర్ రెడ్డి గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు