క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో ప్రేమ్ కుమార్, సంపత్ కుమార్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు..శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని తెలిపారు, క్రీడాకారులు గెలుపు, ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ లో దిష్టిబొమ్మ దహనం.

వనపర్తి,నేటిధాత్రి:
వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్ లో శుక్రవారం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థులు సి ఎం ఆర్ కాలేజీ యజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో విద్యార్థినిలను వేధించినందుకు నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేశామని ఆయన పేర్కొన్నారు. వెంటనే సీఎంఆర్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చి దిష్టిబొమ్మను దహనం చేయడానికి అనుమతి ఉన్నదా? అని పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ ను ప్రశ్నించారు.

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ సిరికొండ, రాజ్యసభ మాజీ సభ్యులు రావులతో కలిసి సంఘ సంస్కర్త సావిత్రి భాయికి నివాళి

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,

vaddiraju ravichandra

రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డితో కలిసి స్త్రీఅభ్యుదయవాది, గొప్ప సంస్కర్త,స్త్రీవిద్య,అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీరవనిత సావిత్రి భాయిపూలేకు ఘనంగా నివాళులర్పించారు.సావిత్రి భాయి 194వ జయంతి సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆమె చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి స్త్రీవిద్యా వ్యాప్తికి చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్,కోతి కిశోర్ గౌడ్,తుంగబాలు,గాంధీ నాయక్ తదితరులు పాల్గొని సావిత్రి భాయి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.

ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ,రెజ్లింగ్ పోటీలు పరిశీలించిన సీఎం ఓఎస్డీ 

రెజ్లింగ్ లో హనుమకొండకు ఏడు పతకాలు

“నేటిధాత్రి”, హనుమకొండ

రాష్ట్రస్థాయి సీఎంకప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిసాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత మూడు రోజులుగా జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2వేల మంది ఈ పోటీలో పాల్గొన్నారు. గురువారం ఈ పోటీలను ముఖ్యమంత్రి ఓఎస్డీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. గత కొన్ని రోజులుగా హనుమకొండలు జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ గురించి జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి గుగులోతు అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. పోటీలో పాల్గొన్న క్రీడాకారులను సీఎం కప్ పోటీల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు సమకూర్చిన భోజనాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం కాకుండా భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అందించిన వసతి సౌకర్యాలపై కోచ్ లు మేనేజర్లను అడిగారు. వీరితో పాటు డీసీపీ దేవేందర్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్, డివైఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు కె.సారంగపాణి, మహ్మద్ కరీం, ఎన్ఐటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ డా.రవికుమార్ లు పాల్గొన్నారు.

హనుమకొండ రెజ్లర్ల హవా…

రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ లో హనుమకొండ జిల్లా రెజ్లర్ల హవా కొనసాగింది. రెజ్లర్లు అద్వితీయ ప్రతిభ కనబరిచి 4 స్వర్ణ , ఒక రజతం, రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. సబ్ జూనియర్ 60 కేజీలో వి. గణేష్ స్వర్ణం, 53కేజీలో బి.అంజలి, 48 కేజీల విభాగంలో ఎస్.అర్జున్ సాగర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. జూనియర్ బాలికల 50 కేజీల విభాగంలో బి. ప్రణవి, 59 కేజీలో జె.చిన్ని , 61కేజీలో కొర్ర అఖిల్ స్వర్ణ పతకం

సాధించగా, 57కేజీలో ఎ.రాహుల్ రజత పతకం కైవసం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను హనుమకొండ జిల్లా క్రీడల యువజన అధికారి గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం, వరంగల్, హనుమకొండ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు వై.సుధాకర్, షేక్ రియాజ్, కోచ్ లు కందికొండ రాజు, ఎం.జైపాల్ లు అభినందించారు.

బిసిటియు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పెరుమాండ్ల సాంబమూర్తి

 

నేటిధాత్రి,కాజీపేట

కాజీపేట ఫాతిమా నగర్ కు చెందిన పెరుమాండ్ల సాంబమూర్తి బిసిటియు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అయిన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ నియామక ఉత్తర్వులను సాంబమూర్తికి అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘమైన బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైల్వే గేట్ లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పెరుమాండ్ల సాంబమూర్తి సేవలందించారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అంతకుముందు సాంబమూర్తి మాట్లాడుతూ వరంగల్ జిల్లా బిసిటియు అధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ కు, బి సి టి యు నేతలైన తాళ్లపల్లి సురేష్, సుంకరి శ్రీనివాస్ రావు, ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సాంబమూర్తిని పలువురు అభినందించారు

భూభారతి 2024 చట్టంతో సమస్యలు తీరేనా?

రైతులకు చుక్కలు చూపించిన ధరణి

భౌతిక రికార్డులకు డిజిటల్‌ రికార్డులకు పొంతనలేదు

చిన్న పొరపాటుకు కూడా కలెక్టర్‌నే కలవాలంటే ఎట్లా?

పనులు వదులుకొని రైతులు కలెక్టర్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి

ప్రభుత్వ నిర్వాకానికి లబోదిబో మంటున్న రైతులు

రేవంత్‌ సర్కార్‌పై ఆశలు పెట్టుకున్న రైతులు

కొత్త చట్టం అమల్లోకి వస్తే బాధలనుంచి గట్టెక్కుతామన్న ఆశ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కొత్త రెవెన్యూ చట్టం భూభారతి (ఆర్వోఆర్‌ా2024) బిల్లు గవర్నర్‌ ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం పంపింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లు అమల్లోకి వ స్తుంది. డిసెంబర్‌ 18న శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్వోఆర్‌ా2024 బిల్లును ప్రవేశపెట్టడం, 20వ తేదీన శాసనసభలో, 21న శాసన మండలిలో చర్చలు జరిగిన తర్వాత బిల్లు ఉభయసభల ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలను రెవెన్యూశాఖ అధికార్లు పూర్తిచేశారు. ఇక సాగుభూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్ల సేవల పోర్టల్‌ ధరణి…నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇన్ఫ ర్మేటిక్‌ సెంటర్‌ చేతికి వచ్చాయి. జనవరి 1వ తేదీన ఈ పోర్టల్‌ను సంస్థ పూర్తిస్థాయిలో నిర్వ హించింది. గత ప్రభుత్వ హయాంలో 2020 నవంబర్‌ 2వ తేదీనుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్‌ను ఐఎఫ్‌ఎల్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థ టెర్రా ఐఏసీఎస్‌లు నిర్వహిస్తూ వచ్చాయి. ఈ విదేశీ సంస్థలను తొలగించి స్వదేశీ నిర్వహణలోకి ఈ పోర్టల్‌ను తీసుకొస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది. ఈమేరకు నవంబర్‌ నెలాఖరుతో టెర్రా ఐఏసీఎస్‌తో ఒప్పందా న్ని ముగించింది. ధరణి పోర్టల్‌ను భూభారతిగా మార్చారు. ఇందుకోసం రెవెన్యూ చట్టంలో ప్ర భుత్వం మార్పులు చేసింది. దీనికి సంబంధించిన లోగో మరియు ఇతర వివరాలను రెవెన్యూ శాఖ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత లోగో ఖరారు చేసి, ప్రారంభించే తేదీని నిర్ణయిస్తారు.

తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ యాక్ట్‌`2020 ప్రకారం ‘ధరణి’ పేరుతో ఆన్‌లైన్‌ రికార్డును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ ధరణిపై భూయజమానుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పట్టేదార్‌ పాస్‌పుస్తకాలు అందకపోవడం లేదా రిక ర్డుల్లో తమ భూములు, పేర్ల వివరాలు తప్పుగా నమోదు కావడంతో రైతులు గగ్గోలు పెట్టారు. ఈ పొరపాట్ల వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మరి ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగి దీన్ని పూర్తిగా మార్చివేస్తామని, సమస్యలను పరి ష్కరిస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం చేసింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ వల్ల ఏర్పడిన సమస్యలపై ని యమించిన సబ్‌`కమిటీ మొత్తం 123 సమస్యలనుగుర్తించింది. భూమి కొనుగోలుదార్లు, రైతులకు నిద్రలేని రాత్రులనే ధరణి మిగిల్చింది. దిగువ స్థాయిలో అప్పిలేట్‌ అథారిటీ లేకపోవడం మరిన్ని సమస్యలు సృష్టించింది. నిజానికి ఈ 123 సమస్యల్లో సింహభాగం మండల స్థాయిలోనే పరిష్కారమవుతాయి. మొత్తం బాధ్యతను కలెక్టర్‌కే అ ప్పగించడంతో చిన్నా, పెద్దా సమస్యలన్నీ పెండిరగ్‌లో పడిపోయాయి. చిన్న సమస్య పరిష్కారానికి కూడా కలెక్టర్‌ వద్దకే పరిగెత్తాల్సి రావడం గ్రామాల్లోని చిన్న,సన్నకారు రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ధరణిపోర్టల్‌లో వచ్చిన తప్పులు లేదా పొరపాట్లు లేదా ఇతరత్రా చిన్న సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లినా తమకు అధికారం లేదంటూ చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర అయోమయానికి గురైనమాట వాస్తవం. అదీ కాకుండా పాత పద్ధతే వుంటే ఈ గొడవ వుండేది కాదుకదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆవిధంగా చిన్న పొరపాట్లకు సంబంధించి వేలాది కేసులు అట్లా పెండిరగ్‌లో పడిపోయాయి. అవి ఎప్పటికి పరిష్కారమవుతాయో కూడా తెలియని పరిస్థితి! ఇక మ్యుటేషన్‌ విషయానికి వస్తే దాన్ని దిగువ స్థాయి అధికార్లకు వదిలేస్తే సరిపోయేది. ఒకవేళ అక్కడ సమస్య పరిష్కారం కకపోతే వారికి ఎగువన రెవెన్యూ డివిజన్‌ స్థాయి లో మరొక లేయర్‌ అధికార్లకు సమస్య పరిష్కారానికి అవకాశం కల్పించాల్సింది. ఇక నాలాల ఆక్రమణల విషయం కూడా స్థానిక అధికార్ల స్థాయిలోనే పరిష్కరించవచ్చు. ఆ విధానమే లేకుండా మొత్తం ఏకబిగిన కలెక్టర్‌, సీసీఎల్‌లపైనే మొత్తం భారం పెట్టడంతో ప్రతి చిన్న సమస్య పీటముడి పడిరది. అప్పుడు రైతులు తమ వ్యవసాయపనులు ఇతర కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలా, ప్రభుత్వం చేసిన నిర్వాకానికి కలెక్టర్‌ ఆఫీసు చుట్టూ తిరగాలా? అన్న పరిస్థితి ఏర్పడిరది.

ధరణి సమస్యలను గుర్తించడానికి ఒక స్వచ్ఛంద సేవాసంస్థ పైలెట్‌ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పది గ్రామాల్లో సర్వే చేసింది. ఈ గ్రామాల్లో 2114 మంది రైతులు ధరణి పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. అంతేకాదు 4465 ఎకరాలు సర్వే నెంబర్లకు కూడా ధరణివల్ల లేనిపోని సమస్యలు వచ్చినట్టు స్పష్టమైంది. ‘లీగల్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అసిస్టెంన్స్‌ టు ఫార్మర్స్‌’ (లీఫ్‌) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థ తాము సేకరించిన సమస్యాత్మక సమాచారాన్ని రెవెన్యూ అధికార్లకు గత సెప్టెంబర్‌ నెలలో అందజేసింది. ఈ సంస్థ తొలి దశలో ఆయా గ్రామాల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేయగా, రెండో దశలో రెవెన్యూ రికార్డులను పరిశీలించి రెవెన్యూ అధికార్ల దృష్టికి తీసుకెళ్లడం, మూడో దశలో రైతులకు సమస్య పరిష్కారంలో సహకరించడం అనే రీతిలో ఈ సంస్థ పనిచేసింది.

భూముల సమగ్ర సర్వే చేపట్టకుండానే ధరణి పోర్టల్‌లో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్‌ చేస్తూ వచ్చారని, ఫలితంగా చాలామంది భూయజమానులైన రైతుల పేర్లు పోర్టల్‌లో కనిపించడం లేదన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. దీనివల్ల రైతుబంధుకు అర్హులైన రైతులకు రైతుబంధు మొ త్తం వారి ఖాతాల్లో జమకాలేదు. మరికొంతమంది రైతులు ధరణి రాకముందే తమ భూములను తనఖాకు పెట్టిన సందర్భాలున్నాయి. వీరు రుణాలు చెల్లించిన తర్వాత ధరణి పోర్టల్‌లోని పొర పాట్ల కారణంగా తమకు పాస్‌పుస్తకాలు రావడంలేదని లబోదిబోమంటున్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో ప్రస్తుతం రైతులు భూభారతి పోర్టల్‌లోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

నిజానికి గత మూడేళ్ల కాలంలో ధరణి పోర్టల్‌ వల్ల అనేక కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. బౌతికంగా వున్న రికార్డులకు, డిజిటల్‌ రూపంలో ధరణిలో పేర్కొన్న రికార్డులకు అసలు పొంతనే లేదు. కొన్ని దశాబ్దాలుగా రైతులు దున్నుకుంటున్న భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఆ భూ యజమానులు అయోమయంలో పడటమే కాదు, తమ సమస్యను ఎవరికి చెప్పుకో వాలో కూడా తెలియని పరిస్థితికి లోనయ్యారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను అమ్ము కోవడానికి వీల్లేకుండా పోయింది. సమస్యను నియమిత కాలావ ధిలో పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఫలితంగా రెవెన్యూ అధికారి స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ధరణి పుణ్యమాని కోర్టుల్లో మూ లుగుతున్నాయి. నిరుపేద రైతులు తమ సమస్యలను వినిపించుకునే అవకాశమే లేకుండా పో యింది. ఈ నేపథ్యంలోనే ధరణి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారంగా కొత్త ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్తచట్టాన్ని రూపొందించింది. వ్యవసాయేతర భూ ములను కూడా ఈ చట్ట పరిధిలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకురావడమే కాదు, సమస్యలు ఉత్పన్నమైతే దాన్ని పరిష్కరించేందుకు ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా కాపాడటం కూడా దీన్ని ముఖ్యోద్దేశం. ప్రస్తుత ప్రభుత్వం భూములను రీసర్వే చేయడం ద్వారా ధరణిలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడానికి ఉద్యుక్తమైంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఏవిధంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుందో చూడాలి.

కాలేజీల దుర్మార్గం… తల్లిదండ్రుల దౌర్భాగ్యం!?

`బాధ్యతలేని సమాజంలో బతుకుతున్నాం.

`చదువు పేరుతో పిల్లలను నరకకూపంలోకి పంపుతున్నాం.

`పేరున్న విద్యా సంస్థలని లక్షలు పోసి సీట్లు కొంటున్నాం.

`పిల్లల జీవితాలతో కాలేజీలు ఆటలాడుతుంటే గుడ్లప్పగించి చూస్తున్నాం

`చేష్టలుడిగి మన చేతగాని తనానికి సిగ్గు పడుతున్నాం

`తల్లిదండ్రులుగా ఫెయిల్‌ అవుతున్నాం.

`పిల్లలకు గొప్ప చదువులు చదివించాలని ఆరాటపడుతున్నాం.

`మన కోరికలను వారి మీద బలవంతంగా రుద్దేస్తున్నాం.

`వారికి ఎలాంటి చదువు ఇష్టమో కనుక్కోలేకపోతున్నాం.

`లక్షల ఫీజులు చెల్లించి బందర దొడ్డి లాంటి కాలేజీలకు పంపిస్తున్నాం.

`వాళ్లు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేయం.

`కాలేజీలో సమస్యల గురించి పిల్లలు చెబితే వినిపించుకోం.

`చదవలేక కుంటిసాకులు చెబుతున్నారని బెదిరిస్తాం.

`లక్షల ఫీజులు చెల్లించామని పిల్లల్నే భయపెట్టిస్తాం.

`మన పిల్లలు మన వద్ద వుంటే చదవలేరని మనమే డిసైడ్‌ అవుతాం.

`హస్టళ్లలో వేస్తేనే భయంతో చదువుతారని గుడ్డిగా నమ్మేస్తుంటాం.

`మన బలహీనతలు విద్యా సంస్థల అరాచకాలకు ఆజ్యం పోస్తున్నాయి.

`మన పాలిట యమపాశాలౌతున్నాయి.

`అయినా మనం కళ్లు తెరవం.

`కార్పొరేట్‌ కాలేజీలకి పిల్లలను పంపడం ఆపం.

`మన దౌర్భాగ్యం…కార్పొరేట్‌ కాలేజీల అరాచకాలను నిలదీయలేం.

`ఎన్ని దుర్మార్గాలు చేసినా మళ్ళీ మళ్ళీ అవే కాలేజీలకు పంపిస్తుంటాం.

`మనమెందుకు మారతాం..పిల్లల ప్రాణాలు పోతున్నా చలించం.

`చదువు పేరుతో ఆడపిల్లలను రాక్షసుల మధ్యకు పంపిస్తూనే ఉంటాం.

తెలంగానలోని కార్పోరేట్‌ కాలేజీల్లో రోజుకో వివాదం ముసురుకుంటోంది. కాలేజీలలో యాజమాన్యాల పట్టింపు లేని తనం, అందులో పనిచేసే ఉద్యోగుల నిర్లక్ష్యం, దుర్మార్గాల మూలంగా విద్యార్దుల జీవితాలు ఆగమౌతున్నాయి. ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీల దాకా అనేక రకాలైన వివాదాలు చుట్టుముడుతూనే వున్నాయి. యాజమాన్యాలు సంపాదన మీద పెట్టే దృష్టి పిల్లల భద్రత మీద పెట్టడం లేదు. నోట్లు లెక్కపెట్టుకోవడంలో వున్న శ్రద్ద మహిళా విద్యార్ధులకు రక్షణ కల్పించడంలో చూపడం లేదు. అసలు కాలేజీ హస్టళ్లలో అమ్మాయి వీడియోలు రహస్యంగా తీస్తూ, వారి జీవితాలతో ఆటలాడుకునేంత ధైర్యం ఎలా వచ్చింది? అమ్మాయిలు వుండే హస్టళ్లలో ఎన్ని రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలో అవగాహన లేకుండా పోతోందా? అందులో పనిచేసే ఉద్యోగుల వ్యహరశైలి ఎలా వుందో తెలుసుకోలేనంత తీరక యాజమాన్యాలకు లేదా? తాజాగా మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో జరిగిన ఉదంతంలో దోషులను కఠినంగా శిక్షించాల్సి వుంది. కాలేజీ యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం వుంది. ప్రైవేటు కార్పోరేట్‌ కాలేజీలలో ఏం జరిగిన పాలకులు పట్టించుకోరన్న ఒక భావన అందరిలోనూ ఏర్పడిపోయింది. విద్యా సంస్దలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విద్యార్దుల కేరిర్‌ పాడైపోతుందనో, ఏడాది విద్యా కాలం వారికి వృధా అవుతుందని పాలకులు దూర దృష్టితో ఆలోచిస్తుంటే, యాజమన్యాలు మాత్రం సంకుతంగా తయారౌతున్నారు. పాలకులు తమ జోలికి రారన్న ధీమాతో వుంటున్నారు. ఇటీవల నగరశివారులో వున్న అనేక కార్పోరేట్‌ కాలేజీలో అనేక వరుస సంఘటలను జరిగాయి. శ్రీచైతన్య కాలేజీలో ఓ అమ్మాయి చనిపోయింది. మరో కాలేజీలో వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే చామకూర మల్లారెడ్డి కాలేజీలో ఆహారం విషయంలో విద్యార్ధులు రోడ్కెక్కారు. లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్దులు ఆందోళన చేశారు. నాసిరకం బోజనాల మూలంగా అనారోగ్యం పాలౌతున్నామని గోడు వెల్లబోసుకున్నారు. ఆ వివాదం ముగిసిపోకముందే చామకూర మల్లారెడ్డి కాలేజీలో విద్యార్ధునులకు చెందిన వీడియోలు తీస్తున్నారని, బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని విద్యార్దులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పాలమ్మిన, పూలమ్మిన, పడరాని కష్టాలు పడినా అని చెప్పుకునే మల్లారెడ్డి కాలేజీలో నీతి మాలిన పనులు చేస్తుంటే ఏం చేస్తున్నాడు. దేశంలోనే ఎక్కడా లేనన్ని విద్యా సంస్ధలు ఏర్పాటు చేశానని, తన కాలేజీలలో వున్న సౌకర్యాలు మరెక్కడా లేవంటూ ఊదరగొట్టే మల్లారెడ్డి ఈ విద్యార్దులకు ఏం సమాధానం చెబుతారు.

విద్యా సంస్ధలు ఏర్పాటు చేసుకోవడం, అక్రమాలు చేయడం, రాజకీయాల్లో చేరడం తప్పులను కప్పిపుచ్చునేందుకు అండగా మల్చుకోవడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. ఇదే మల్లారెడ్డి అల్లుడికి చెందిన మెడికల్‌ కాలేజీలో చనిపోయిన వ్యక్తికి చికిత్స చేసి ఠాగూర్‌ సినిమాను చూపించారని బంధువులు ఆందోళన చేశారు. ఇలా విద్యా సంస్ధల ముసుగులో కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకునే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. చామ కూర మల్లారెడ్డి కాలేజీలో చదువుకునే అమ్మాయిలు గత కొంత కాలంగా కాలేజీకి అనుబంధమైన హాస్టల్‌లో ఏదో జరుగుతోందని వార్డెన్‌కు పిర్యాధులు చేస్తూనే వున్నారు. గత మూడు నెలల నుంచి ఏదో జరుగుతోందన్న అనుమానం అమ్మాయిలు వ్యక్తం చేస్తూనే వున్నారు. అయినా వార్డెన్‌లో స్పందన లేదని, పైగా తమనే బెదిరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. తీరా పిల్లలు నిలదీస్తే అమ్మాయిలు బాత్‌ రూముల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అందుకోసం కెమెరాలు ఏర్పాటు చేసినట్లు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు కూడా చెబుతున్నారు. అంటే అమ్మాయిలు కాలేజీలలో చేరింది హస్టల్‌ బాత్‌ రూంలలో ఆత్మహత్యలు చేసుకోవడానికా? ఇలాంటి సమాధానాలు ఎవరైనా చెబుతారా? అంటే కాలేజీ హస్టళ్లలోని బాత్‌ రూంలలో తామే కెమెరాలు ఏర్పాటు చేశామని వార్డెన్‌ చెబుతున్నప్పుడు వెంటనే మల్లారెడ్డి చర్యలు తీసుకోవాలి. ఇంతటి దుర్మార్గాలకు ఒడిగడుగుతున్న మల్లారెడ్డి కాజీలను మూసేయించాల్సిన అవసరం వుంది. మల్లారెడ్డి కాలేజీ మూసేస్తే విద్యార్ధులకు ఒక ఏడాది విద్యా సంవత్సరం వృధా అవుతుందేమో కాని, వారి జీవితాలకు భద్రత దొరుకుతుంది. లేకుంటే వారి జీవితాలు నాశనమౌతాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆడపిల్లలకు భద్రత లేకుండా వుంది. ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న విద్యార్దుల విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా వున్న కాలేజీల అనుమతులు రద్దుచేస్తే, ఇతర కాలేజీల్లో భయం ఏర్పడదు. విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజీలను గుర్తించి, వాటి గుర్తింపు రద్దు చేస్తే తప్ప విద్యా వ్యవస్ధలో మార్పులు రావు.

కాలేజీల వ్యవహారం ఇలా వుంటే తల్లిదండ్రుల దౌర్భాగ్యం మరోలా వుంది. మనం బాధ్యత లేని సమాజంలో బతుకుతున్నామన్న సోయి తల్లిదండ్రుల్లో కూడా కరువౌతోంది. పేరున్న కాలేజీ, కార్పోరేట్‌ కాలేజీల పేరుతో సాగుతున్న దందాలను తల్లిదండ్రులే పెంచి పోషిస్తున్నారు. కాలేజీలు ఇష్టాను సారం నిర్ణయించిన లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి, ఆ కాలేజీలలో చదవించడం కూడా స్టేటస్‌ సింబల్‌ అన్నట్లుగా మారిపోతున్నారు. ఉన్నత విద్య చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నారంటూ గొప్పలు చెప్పుకోవడం అలవాటు చేసుకున్నారు. కాని అందులో చదివినంత మాత్రానే ఉద్యోగాలొస్తాయని, ఉజ్వలమైన భవిష్యత్తు వుంటుందన్న అపోహలు పెంచుకుంటున్నారు. గొర్రెల్లా ఒకరిని చూసి ఒకరు తమ పిల్లలను ఆ కాలేజీలలో చేర్పిస్తున్నారు. అందుకే చామకూర మల్లారెడ్డి కాలేజీల మీద కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాడు. తమ పిల్లల చదవు పేరుతో మల్లారెడ్డి కాలేజీల లాంటి నరకకూపంలోకి పంపిస్తున్నామని తెలుసుకోవడం లేదు. ఆ కాలేజీలో చదివితే ర్యాంకులోస్తాయని, మంచి ఉద్యోగాలొస్తాయన్న భ్రమల్లో తల్లిదండ్రులు వుంటున్నారు. అందులో చదివినా, ఎందులో చదవినా మార్కులను చూసి ఉద్యోగాలు ఇవ్వరు. విద్యార్ధుల నాలెజ్డ్‌, స్కిల్స్‌తోనే ఉద్యోగాలు వస్తాయి. అంతే తప్ప మల్లారెడ్డి కాలేజీలో చదినంత మాత్రాగా ఉద్యోగాలు ఇచ్చే కంపనీలు గుడ్డిగా సెలెక్ట్‌ చేయరు. లక్షలకు లక్షలు జీతాలు ఇవ్వరు. ఎవరో ఒకరికి మంచి మంచి ప్యాకేజీలు వచ్చాయని, ఆ కాలేజీలో చదితేనే వెంటనే ఉద్యోగాలు వస్తాయన్న ప్రచారాన్ని తల్లిదండ్రులు నమ్మడం ఒక వ్యసనంగా మార్చుకున్నారు. పేరున్న విద్యా సంస్ధలంటూ లక్షలకు లక్షలు పోసి తమ పిల్లలను అందులో చేర్చుతున్నారు.

మంచి భవిష్యత్తు కోసమంటూ తమ పిల్లలను అలాంటి కాలేజీల్లో చేర్పిస్తే ఎంతో మంది అమ్మాయిల జీవితాలు ఆగమౌతున్నాయి. అవి మాత్రం ఏ తల్లిదండ్రులకు కనిపించవు. తమ పిల్లలు మాత్రమే మంచి వాళ్లు. ఇతరుల పిల్లలు చెడ్డవారన్న అభిప్రాయం కూడా ప్రతి తల్లిదండ్రులలోనూ నాటుకుపోతోంది. తమదాకా వస్తే గాని గుండెలు పగిలే నిజాలు వినపడవు. మల్లారెడ్డి కాలేజీలో ఇంతటి దారుణం జరిగిందని తెలిసినా తల్లిదండ్రులు ఎందుకు మౌనంగా వుంటున్నారు? కాలేజీలో ఆందోళన చేస్తున్న వారికి ఎందుకు సంఫీుభావం ప్రకటించడం లేదు. తమ పిల్ల ల జీవితాలను ఎలా ఆగం చేస్తారని నిలదీసేందుకు ఎవరూ వెళ్లడం లేదు. ఇది తల్లిదండ్రుల నిర్లక్ష్యం కాదా? చేతగాని తనం కాదా? చేష్టలుడిగి చూసే తనం కాదా? విద్యార్థులతోపాటు, వివిధ పార్టీల విద్యార్ధి నాయకులు మల్లారెడ్డి కాలేజీ ముందు ఆందోళనలు చేస్తుంటే , తల్లిదండ్రులు ఎందుకు మేలుకోవడం లేదు. తమ పిల్లలు గొప్ప చదువులు చదవాలన్న ఆరాటం వుంటే సరిపోదు. లక్షలు పోసి పిల్లలను చదవిస్తున్నాం..ఫీజులు చెల్లిస్తున్నామని గొప్పలుచెప్పుకుంటే గెలిచినట్లు కాదు. పిల్లల జీవితాలను ఆగం చేస్తున్నవారిని ప్రశ్నించడంలో తల్లిదండ్రులు చొరవ చూపించకపోవడం కూడా తప్పే. అన్యాయం జరిగిన అమ్మాయిల తల్లిదండ్రులకు సంఫీుభావంగా మిగతా పిల్లల తల్లిదండ్రులు కలిసి వచ్చిన సందర్భాలే కనిపించవు. అందుకే కాలేజీల యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. తప్పులు చేసిన ఎవరూ పట్టించుకోరనుకుంటున్నాయి. తప్పుల మీద తప్పులు జరుగుతున్నా పట్టింపు లేని తనాన్ని ప్రదర్శిస్తున్నాయి.

జిసిసి హమాలీ కార్మికుల మెరుపు సమ్మె

* భద్రాచలం ఒప్పందం ప్రకారం పెరిగిన రేట్లు అమలు చేయాలి*
భద్రాచలం నేటి ధాత్రి

సమ్మెను ప్రారంభించిన సిఐటియు పట్టణ ఇన్చార్జి నాయకులు గడ్డం స్వామి*
అక్టోబర్ 2024 లో జరిగిన జిసిసి సివిల్ సప్లై రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన సమ్మెను సిఐటియు పట్టణ ఇంచార్జ్ నాయకులు గడ్డం స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ నాయకులు నకిరికంటి నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై మరియు జీ సి సి హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్ల విషయమై గత మూడు నెలల క్రితం 20 24 అక్టోబర్ 3 న అన్ని కార్మిక సంఘాల సమక్షంలో సివిల్ సప్లై కమిషనర్ మరియు అధికారులు చర్చలు జరిపి పాత రేట్ల కంటే అదనంగా మూడు రూపాయలు దిగుమతి, ఎగుమతి రేట్లు పెంచడం జరిగిందని, పెంచిన రేట్లను 20 24 జనవరి నుండి అమలు చేస్తామని ఏరియల్స్ తో కలిపి చెల్లిస్తామని సివిల్ సప్లై అధికారులు హామీ ఇచ్చారు. కానీ నేటికి ఒప్పందం అమలు కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగి మూడు నెలలు కావస్తున్న నేటికీ పెరిగిన రేట్లకు సంబంధించిన జీవోను అధికారులు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఒప్పందాలు జరిగిన వెంటనే జీవో విడుదల చేసే వారని, కానీ ఒప్పందం జరిగి మూడు నెలల గడుస్తున్న జీవో విడుదల చేయకపోవడం సరైనది కాదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హమాలీల రేట్ల పెంపు జీవోను విడుదల చేసి 20 24 జనవరి నుండి ఏరియర్స్ కు బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఎస్ అజయ్ కుమార్ ,ఆర్ రాములు, పాల్గొనగా ఈరోజు సమ్మెలో జిసిసి హమాలీలు సుబ్రహ్మణ్యం, ప్రసాదు, శేషు, లోకేష్, రామారావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ కామ్రేడ్ ఏ బి బర్ధన్ తొమ్మిదవ వర్ధంతి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి కార్యాలయం కామ్రేడ్ ఏ బి బర్ధన్ తొమ్మిదవ వర్ధంతిని జరిపినాము. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి రాజమౌళి సీనియర్ నాయకులు కామ్రేడ్ చిప్ప నరసయ్య మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ ఏ బి బర్ధన్ 1924 సెప్టెంబర్ 25న బెంగాల్ రెసిడెన్సి చెందిన బరిసాల్ ప్రస్తుత బంగ్లాదేశ్ లో జన్మించినారు.ఆయన 15 వ వయసులో సిపిఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన నాగపూర్ లో యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఫెడరేషన్ లో చేరి యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా పని చేస్తూ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ 1957లో నాగపూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిగెలిచినారు.ఆయన ఏ ఐ టి యు సి యూనియన్ ద్వారా అనేక ఉద్యమాలు చేసినారు అనేక అరెస్టయినారు. నాలుగేళ్లకు పైబడి జైలు జీవితం గడిపినారు ఏ ఐ టి యు సి కి అధ్యక్షుడిగా పని చేసినారు.పార్టీ పిలుపు మేరకు కేంద్రంలో 1990లో పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ 1996 లో అప్పటివరకు జాతీయ కార్యదర్శిగా ఉన్న ఇంద్రజిత్ గుప్త హోం మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైనారు నాలుగు పర్యాయాలు 16 సంవత్సరములు పార్టీ కార్యదర్శి గా పని చేసినారు పార్టీకి పలు సూచనలు ఇస్తూ చనిపోయే వరకు పని చేసినారు.పార్టీ కార్యకర్తలు కామ్రేడ్ బర్దన్ గారి అంకుటిత దీక్ష వారు చేసిన సేవలను పునికి పుచ్చుకొని పార్టీ విస్తరించడానికి ఉపయోగపడాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పీడిత ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రైతు ఉద్యమాలను అణచివేస్తూ కార్మిక చట్టాలను మారుస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుంది.దీనికి వ్యతిరేకంగా పార్టీ ఉద్యమాలను చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణ బి కే ఎన్ యు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గుండా చంద్రమాణిక్యం జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ మేకల రాజేశం పట్టణ సహాయ కార్యదర్శి కామ్రేడ్ కొంకుల రాజేష్ పట్టణ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రత్నం రాజo బొంకూర్ రామచందర్ పార్టీ నాయకులు స్వామి దాస్ ఇనుముల రాజమల్లు రాధాకృష్ణ పాల్గొన్నారు.

వరంగల్ ఎంపీ చేతుల మీదుగా టి.ఎస్.యు.టి.ఎఫ్ నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, వరంగల్

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టి.ఎస్.యు.టి.ఎఫ్) వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టి.ఎస్.యు.టి.ఎఫ్ నూతన సంవత్సర (2025) క్యాలెండర్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యచే ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాటికాయల కుమార్, సుజన్ ప్రసాద్, ఉపాధ్యక్షులు మేకిరి దామోదర్, కోశాధికారి, రవూఫ్, కార్యదర్శులు బి.వెంకటేశ్వరరావు, పాక శ్రీనివాస్, నామోజు శ్రీనివాస్, కె. రమేష్, గుండు కరుణాకర్, మండల బాధ్యులు టివి సత్యనారాయణ, వి.నర్సింహరావు, డి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు

రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు
సారంపల్లి మల్లారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమురయ్య హాలులో 2 నుంచి 6వ తేదీ వరకు జరిగే జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి సారంపల్లి మల్లారెడ్డి, వెంకటేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ పాలెస్తిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ అశాంతికి ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి కారణం అవుతుందని ఇది ప్రపంచంలోనే అశాంతి నెలకొల్పే విధంగా ప్రజల్ని దుఃఖాన్ని కలిగిస్తూ అంతుచిక్కని స్థాయిలో మరణాలను చూపిస్తూ విషాదాన్ని నింపుతుందని ఇది దేశాలపై ఆర్థిక పరమైనటువంటి భారాన్ని చూపిస్తుందని అంతేకాకుండా ప్రపంచ అశాంతిని ఐక్యతను దెబ్బతీసే విధంగా యుద్ధాలు కారణమవుతున్నాయని అందుకే సిపిఎం పార్టీ ప్రపంచ శాంతిని కోరుకుంటుందని ప్రజల్లో ఐక్యత సమైక్యతలను నెలకొల్పుతూ మానవ ప్రాణాలను కాపాడుకుంటూ దేశాల ఆర్థిక పురోగతిని పెంపొందించే విధంగా ప్రపంచ దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు కానుంచి మానవ సమైక్యతను కోరుకునే విధంగా ప్రపంచం లో శాంతి వర్ధిల్లాలని సిపిఎం కోరుతుందని ఆ స్థాయిలోనే కమ్యూనిస్టు పార్టీలు వాటి పాత్రను కొనసాగిస్తున్నాయని ఆయన అన్నారు
అదేవిధంగా దేశంలో మోడీ విధానాల వల్ల దేశం నష్టపోతుందని ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ క్షీనిస్తుందని రూపాయి విలువ ఇప్పటికే 85% తగ్గిందని దేశంలో 16% నిరుద్యోగం పెరిగిందని ఈ దేశంలో మోడీ వచ్చిన తర్వాత జీఎస్టీ నోట్ల రద్దు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు దేశంలో ప్రోత్సహిస్తున్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి 96% విద్యాభివృద్ధికి పాటుపడాలని 8 శాతం ఉన్న నిరుద్యోగాన్ని రూపుమాపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు జిల్లా కార్యదర్శి సభ్యులు చెన్నూరి రమేష్ గుర్రం దేవేందర్ జిల్లా కమిటీ సభ్యులు సంఘం ప్రీతి ఆత్కూరి శ్రీకాంత్ గడప శేఖర్ ఆకుదారి రమేష్ లతోపాటు 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

సిఎం రేవంత్ రెడ్డి కి “నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలిపిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

నేటిధాత్రి, వరంగల్

హైదారాబాద్ లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో, నూతన సంవత్సర సంధర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి, ఎమ్మేల్సీ బస్వరాజు సారయ్య, ఖమ్మం నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి

పి.ఆర్.టి.యూ టిఎస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, కొండూరు, వరంగల్

జిల్లా పరిషత్ హైస్కూల్ కొండూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కె పద్మలత చే 2025 నూతన సంవత్సరం పి.ఆర్.టి.యూ టిఎస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కటకం రఘు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంకిడి కరుణాకర్ రెడ్డి, రాయపర్తి మండలం అసోసియేట్ అధ్యక్షులు నేతుల స్వామి, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ లో గురువారం రోజున విద్యార్థులకు సైబర్ నేరాలపై చిట్యాల జి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్స్ లాల్ సింగ్, లింగన్న, సందీప్, నాగరాజు లు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి నారు,
చిట్యాల సైబర్ వారియర్ లాల్ సింగ్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గణనీయంగా పెరిగిందని,వాటిలో ముఖ్యంగా:1.ఫిషింగ్,
2. రాన్సోమ్ వేర్ 3. గుర్తింపు దొంగతనం,4. ఆన్‌లైన్ వేధింపులు,5. సైబర్‌స్టాకింగ్,6. క్రెడిట్ 7. హ్యాకింగ్8. మాల్వేర్*,9. సోషల్ ఇంజనీరింగ్*10. ఆన్‌లైన్ మోసాలు*11. సైబర్ గూఢచర్యం,12. *డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్,13. *క్రిప్టోజాకింగ్,
14. ఆన్‌లైన్ పిల్లల దోపిడీ,
15. మేధో సంపత్తి,
ఈ రకమైన సైబర్ నేరాల గురించి తెలుసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం, సాఫ్ట్‌వేర్‌ను తాజాగా ఉంచడం మరియు లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు లేదా ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని అందించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం అని వివరించి
సైబర్ క్రైమ్ కి గురాయ్ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 సైబర్ హెల్ప్ నెంబర్ కి కాల్ చేయాలని, పోగొట్టు కున్న ఒక గంట లోపే చేయడం ద్వారా డబ్బులు హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందని, దానిని గోల్డెన్ హవర్ అంటరాని చెప్పారు.
కార్యక్రమం లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొత్త గనులు వస్తేనే సింగరేణి మనుగడ

కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే దిశగా చర్చలు..

గుర్తింపు సంఘంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

2035 వరకు పాత గనులు మూతపడే అవకాశం ఉందని సింగరేణిలో నూతన గనులు రాకుంటే మను గడ ప్రశ్నార్ధకమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి కొరిమి రాజ్ అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే5,ఇంక్లైన్ గని ఆవరణలో
ఏఐటీయూసీ గని ఫిట్ సెక్రెటరీ దోర్నాల తిరుపతి అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న పాత బావులు 2035 వరకు పనిచేస్తాయని ఆ తర్వాత నూతన గనులు రావలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై యాజమాన్యంతో చర్చించి నూతన గనుల ఏర్పాటుకు కోరడం జరిగిందన్నారు. కార్మికులకు మా సంఘంఇచ్చిన హామీలను యాజమాన్యంతో స్ట్రక్చర్ మీటింగ్లలో మాట్లాడి ఇచ్చిన ప్రతి హామీని పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకు వెళ్ళమని, కార్మికుల సొంత ఇంటి చిరకాల కోరిక నెరవేరుస్తామని అన్నారు.
అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ విషయంలో కోలిండియాలో 9వ వెజ్ బోర్డు చార్చలలో ఒప్పందాలు జరిగాయని కోల్ ఇండియాలో ఇప్పటికే కంపెనీ పేర్స్కులర్ పై న ఇన్కమ్ టాక్స్ కంపెనీ రాయితి కల్పిస్తుందని, సింగరేణి కార్మికులకు కూడా మన కంపెనీ ఇన్కమ్ టాక్స్ పైన రాయితి కల్పించాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేర్ల విషయంలో స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడి ఆ సమస్య పరిష్కరిస్తామని ఈ సందర్భంగా రాజ్ కుమార్ తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార దిశలో మా ఏఐటీయూసీ కార్మిక సంఘం ముందు ఉంటదని కార్మికులంతా ఏఐటీయూసీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఎండి ఆసిఫ్ పాష, రవికుమార్, వి మల్లికార్జున్, యు కుమారస్వామి, ఎన్ నాగేంద్రబాబు,
వి రాజేందర్, జి తిరుపతి, పి నారాయణమూర్తి, వి ఆంజనేయులు, నాయక్, ఐ ప్రకాష్, కే తిరుపతిరెడ్డి, భీమ,చుక్కన్న, బి రాయమల్లు, జె.రాజు, పి సమ్మిరెడ్డి, టి రమేష్, బి శ్రీనివాస్, ఎం ప్రవీణ్, సిసిందర్, వి రాజు, చందు, రామచందర్, కృష్ణ, కత్తెరసాల తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 4న లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు

జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని అంధులైన దివ్యాంగులకు తెలియజేయునది ఏమనగా, లూయిస్ ట్రెయిలి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఈనెల 04.01.2025 రోజున ఉదయం: 11.00 గం.లకు కలెక్టర్ కార్యలయం జయశంకర్ భూపాలపల్లి నందు లూయిస్ బ్రెయిలి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
కావున, జిల్లాలోని అంధులైన దివ్యాంగులందరు సమావేశ మందిరం, కలెక్టర్ కార్యలయం,జయశంకర్ భూపాలపల్లి నందు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరనైనది.
జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు

రాజకీయ వివాదాలు, అవినీతిపై విచారణలతో హోరెత్తిన తెలంగాణ 2024 రివ్యూ

`కేసీఆర్‌ దిగ్గజాన్ని ఓడిరచి అధికారాన్ని కైవసం చేసుకున్న రేవంత్‌

`హామీల అమలులో కొత్త ప్రభుత్వం తలమునకలు

`గత ప్రభుత్వ అవినీతిపై విచారణలు వేగవంతం

`‘తగ్గేదే లేదు’ అంటూ దూసుకెళుతున్న రేవంత్‌

`వివాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి

`కాంగ్రెస్‌కు ఎదురులేదు…బీఆర్‌ఎస్‌ ఇక లేవలేదు

`కాంగ్రెస్‌, బీజేపీలు ఢీ అంటే ఢీ

`ఊపేసిన హైడ్రా

`కుదిపేసిన సంధ్య థియేటర్‌ సంఘటన

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల దగ్గరినుంచి, సినీ నటుడు నాగార్జున ఎన్‌ాకన్వెన్షన్‌ కూల్చివేత, నాగచైతన్యాసమంత విడాకులపై తెలంగాణ మంత్రి ఆరోపణలు, సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి, ఆమె తనయుడు కోమాలోకి వెళ్లడం, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వంటి వివాదాలు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఎన్నికల్లో చేసిన ఆరు వాగ్దానాల అమలును పూర్తిచేయాలంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భారత రాష్ట్రసమితి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొని రావడం, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావడానికి ఇప్పటినుంచే వ్యూహాలు అమలుచేయడం, ఇదే సమయంలో పదిమంది బీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగించిన రాజకీయ పరిణామాలు. లిక్కర్‌ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్‌, బీఆర్‌ఎస్‌ హయాంలో పోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక రిటైర్డ్‌ పోలీసు అధికారితో సహా సర్వీసులో వున్న ముగ్గురు పోలీసు అధికార్ల అరెస్ట్‌ గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలపై విచారణ వంటి సంఘటనలు కూడా ఈ ఏడా దిపతాక శీర్షికలెక్కాయి.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే బీఆర్‌ఎస్‌, బీజేపీలు, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు అమలు పరచాలంటూ కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావడం, లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున వెంటనే వాటి అమలు సాధ్యం కావడంలేదని కాంగ్రెస్‌ చెప్పడం జరుగుతూ వచ్చింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరి 8స్థానాల్లో గెలుపొంది ఢీ అంటే ఢీ అనే స్థాయి లోవుండగా, ఎంఐఎం హైదరాబాద్‌ స్థానాన్ని నిలబెట్టుంది. 2019తో పోలిస్తే కమలం పార్టీ తనస్థానాలను రెట్టింపు చేసుకొని ఔరా అనిపించింది. అంతేకాదు మరో ఆరు సీట్లలో రెండో స్థానా న్ని ఆక్రమించి అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు సవాలు విసిరింది. 2019లో కేవలం 19.05శాతం ఓట్లతో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 35.08 శాతం ఓట్లతో ఎనిమిది స్థానాల్లో గెలుపు సాధించి ప్రత్యర్థి పక్షాలను ఖంగు తినిపించింది. అతే 2003 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ సా ధించిన ఓట్లు కేవలం 13.90 శాతం మాత్రమే. ఈ ఓట్లతో 119 స్థానాలున్న అసెంబ్లీలో 8 సీట్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికలకు వస్తే 10`12 సీట్ల వరకు గెలవడం తథ్యమన్న విశ్వాసంతో కాంగ్రెస్‌ వుం డిరది. విచిత్రమేమంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ స్థానంతో పాటు, ఆయన గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ చేజా ర్చుకోవడం పార్టీ నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. 2019లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 30.9% ఓట్లతో మూడు స్థానాల్లో విజయం సాధించగా 2024లో తన ఓట్ల షేర్‌ను 40.10 శాతానికి పెంచుకొని 8స్థానాల్లో గెలుపు సాధించింది. అదే 2023 నవంబర్‌లో జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లకు గాను 64 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఓట్లు 39.40%. అంటే లోక్‌ సభ ఎన్నికలకు సుమారు రెండు శాతం ఓట్లను పెంచుకోగలిగింది.

2001లో తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటైన నాటినుంచి పరిశీలిస్తే, 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (ఒకప్పటి టీఆర్‌ఎస్‌) దారుణంగా ఓటమి పాలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 9స్థానాల్లో గెలుపొందిన బీఆర్‌ఎస్‌, 2024లో ఒక్క స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. నిజంగా పార్టీ ఆవిర్భావం నుంచి పరిశీలిస్తే ఇది గొప్ప పరాభవమని చె ప్పాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీ 37.35% ఓట్లతో 39 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ ఓట్లు 16.68% పడిపోవడం గమనార్హం. పదేళ్లు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీ పది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడంతోపాటు పాటు కీలక నాయకులు కూడా పార్టీని వీడటంతో తీవ్రస్థాయిలో నష్టపోయింది.

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం విపక్షపార్టీకి ఈ ఏ డాది తగిలిగిన తొలి దెబ్బ. ఈ ఏడాది మే నెలలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఖాళీ అయిన ఈ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. కానీ ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ గెలుచుకోవడంతో ఎమ్మెల్యే మరణం వల్ల వస్తుందనుకున్న సానుభూతీ పనిచేయలేదు. ఇక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల్లో పరాజయం తర్వాత మొగం చాటేశారు. ఒకటి రెండు సార్లు అసెంబ్లీకి వచ్చారంతే. ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన మళ్లీ జనాల్లోకి రాలేదు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నాయకుడు హరీష్‌రావులు పార్టీని భుజాన మోస్తున్నారు.

ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, కె.సి.ఆర్‌. తనయ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేయడం సంచలనం సృష్టించడమే కాదు, బీఆర్‌ఎస్‌ అధినే తకు తీరని మనస్తాపానికి కారణమైంది. ఆమె జ్యుడిషియల్‌ కస్టడీలో వుండగా, సీబీఐ కవిత అరెస్ట్‌కు కోర్టు అనుమతి తీసుకుంది. ఆవిధంగా ఐదునెలల పాటు తీహార్‌ జైల్లో గడిపిన కవిత ఎట్ట కేలకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

ఇక ఈ ఏడాది చివర్లో యాంటీ కరప్షన్‌ బూరో (ఏసీబీ), ఫార్ములా రేస్‌ కేసు విషయంలో కల్వ కుంట్ల తారకరామారావుపై కేసు నమోదు చేయడం కె.సి.ఆర్‌. కుటుంబానికి మరో షాక్‌. గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ అనుమతించిన నేపథ్యంలో, అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. యు.కె.కు చెందిన ఫార్ములా ఈ`ఆపరేషన్స్‌ లిమిటెడ్‌కు రూ.54.88 కోట్లు నిబంధనలను అతిక్రమించి చెల్లింపులు జరిపారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ కేటీఆర్‌, రాష్ట్రాన్ని విద్యుత్‌ వాహనాల హబ్‌గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఫార్ములా ఈ`రేస్‌ను నిర్వహించాలని తలపోశామని వాదిస్తున్నారు. ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఈడీ రంగంలోకి దిగి మనీ ల్యాడరింగ్‌కు సంబంధించి ఎన్‌పోర్స్‌మెట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌)ను నమోదు చేసింది. కవిత, కె.టి.ఆర్‌ల పని ముగించిన తర్వాత ఇప్పుడు మరో సీనియర్‌ నాయకుడు కె. హరీష్‌రావుపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టి పెట్టింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ విచారణ జరుపుతోంది. ప్రస్తుతం ఈ నివేదిక రూపకల్పన తుది దశలో వుంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాద్రి మరియు యాదగిరి థర్మల్‌ ప్రాజెక్టులపై వచ్చిన అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించారు. అంతే కాకుండా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల విషయంపై కూడా రేవంత్‌ విచారణకు అనుమతించారు. రెండు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.బి. లోకుర్‌ విచారణ జరుపుతున్నారు. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదు.

గత మార్చి అసెంబ్లీ సమావేశాలను టెలిఫోన్‌ ట్యాపింగ్‌ అంశం కుదిపేసింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) డీఎస్‌పీ ప్రణీత్‌రావును ఈ కేసుకు సంబంధించి అరెస్ట్‌ చేశారు. అయితే నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ టి.ప్రభాకర్‌ రావు, జర్నలిస్ట్‌లు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులపై నిఘా పెట్టేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన విచారణలో ఆరోపించారు. ఇంకా అద నపు ఎస్‌.పి.లు తిరుపతన్న, భుజంగరావు, మాజీ డీసీపీ పి. రాధాకృష్ణారావులు కూడా అరెస్ట యిన వారిలో వున్నారు. అయితే ప్రస్తుతం యు.ఎస్‌.లో వున్న టి. ప్రభాకర్‌రావు, ఒక న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రావణ్‌కుమాలను ఇక్కడికి రప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, చిరుమర్తి లింగయ్యలను కూడా పోలీసులు విచారించారు.

ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం కూడా ఎన్నికల హామీ కావడంతో, రేవంత్‌ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పునర్‌వ్యవస్థీకరించారు. వివిధ కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంస్థ పరీక్షలు జరిపి నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా నే గత ఫిబ్రవరిలో మెగా డీఎస్సీని నిర్వహించి 11,062 పోస్టులను భర్తీ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేశామని కాంగ్రెస్‌ చెబు తుండగా వీరంతా తమ హయాంలో ఎంపికైన వారేనని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. కాంగ్రెస్‌ కేవలం వీరికి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ చెబుతోంది.
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీల అమలుకు ఉపక్రమించింది. పగ్గాలు చేపట్టిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. మిగిలిన హామీలను అమలు పరచేందుకు బి.పి.ఎల్‌. కుటుంబాలనుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వా నించింది. రేవంత్‌ ప్రారంభించిన ప్రజాపాలన సందర్భంగా 1.05కోట్ల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. రూ.2లక్షల లోపు రైతు రుణాల మాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, బి.పి.ఎల్‌. కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి హామీలను కూడా ప్రభుత్వం అమలుచేసింది. 25లక్షల రైతులకు రుణ మాఫీ కింద రూ.21వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని, సన్నరకం బియానికి క్వింటాకు రూ.500బోనస్‌ చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. ఇది ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే అధికమని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు రైతులకు 24/7 ఉచిత విద్యుత్‌ సరఫరాకు కూడా హామీ ఇచ్చింది.

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుతో పాటు, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. రేవంత్‌ ప్రభుత్వ సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, కుల సర్వేను చేపట్టింది. ఇక సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. విపక్ష బీఆర్‌ఎస్‌ ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్‌ తల్లి విగ్రహమంటూ ఎద్దేవా చేసింది. ఈ విగ్రహంలో తెలంగాణ సంస్కృతి చిహ్నమైన బతుకమ్మ ఏదంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణ తల్లిని ‘పేదరాలు’గా చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలావుండగా రేవంత్‌ రెడ్డి, రాష్ట్రంలో కె.సి.ఆర్‌. ప్రవేశపెట్టిన సంప్రదాయాలను చెరిపివేసే పనిలో వున్నారు. ‘టి.ఎస్‌’ స్థానంలో ‘టి.జి’, ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించడం ఇందులో భాగమే. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు ఇతర నీటి తావుల పరిరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేత కు రేవంత్‌ ప్రభుత్వం ‘హైడా’ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది పెద్ద వివాదమే రేపింది. తమ్మిడి కుంట చెరువులోని ఫుల్‌ ట్యాంక్‌ ప్రాంతంలోని బఫర్‌జోన్‌లో ఉన్నదంటూ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌`కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. ఇది 1.12 ఎకరాల మేరకు చెరువును అక్రమంగా ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలున్నాయి. అయితే నాగార్జున కుటుంబం ఈ ఆరోపణలను కొట్టివేసింది. ఇదిలావుండగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ, నాగచైతన్య`సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. నాగార్జున మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. కె.టి.ఆర్‌. కూడా మంత్రికి వ్యతిరేకంగా మరో పరువునష్టం దావా వేశారు.

పుష్పా2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరగడం, ఒక మహిళ మృతిచెందగా మరో బాలుడు కోమాలోకి వెళ్లిన సంఘటన తెలంగాణలో మరో వివాదానికి దారితీసింది. ఈ కేసులో థియేటర్‌ యాజమాన్యం, సినీ హీరో మరియు ఆయన టీమ్‌పై కేసు నమోదు చేశారు. రేవంత్‌ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత, అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడం, సినీ పెద్దలు హీరోను పరామర్శించేందుకు క్యూలు కట్టడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచాయి. తర్వాత సినీపెద్దలు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడినప్పటికీ పరిస్థితిలో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు లేకపోవడం వర్తమాన చరిత్ర.

అప్పు’డు సాయం… ఇప్పుడు నేరం!

`కేంద్రం కొత్త మార్గదర్శకత్వం ఎవరి కోసం?

`ముందు చూపు లేని నిర్ణయం?

`అత్యవసరాలకు అప్పులు దొరక్కపోతే ప్రజలను ఆదుకునేవారెవరు?

`ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే అప్పులు నమ్మకాల మీద…

`ఫైనాన్స్‌ కంపెనీలు ఇచ్చే అప్పులు ఆస్తుల మీద…

`ఒకవేళ కేంద్రం అలాంటి మార్గదర్శకాలు తెస్తే సామాన్యుడు చితికిపోవడం ఖాయం.

`బిజేపి మీద వ్యతిరేకత పెరగడం తధ్యం.

`ధరల మోతలను ఇప్పటికీ భరిస్తూనే వున్నారు.

`అన్ని రకాల పన్నులను చెల్లిస్తూనే వున్నారు.

`ప్రశ్నించలేని సమాజంలో బతుకుతున్నారు.

`బతకలేక, చావలేక చస్తూ బతుకుతున్నారు.

`వెసులుబాటు లేని అర్థిక పరిస్థితులలో ఒదిగిపోతున్నారు.

`ప్రైవేటు వ్యక్తులు ఫైనాన్స్‌ వ్యాపారం నేరమే.

`ప్రభుత్వ రంగ సంస్థలు సామాన్యుడి అవసరాలను తీర్చగలదా?

`అత్యవసర పరిస్థితులనుంచి కాపాడగలదా?

`పెద్దలను కొట్టి పేదలకు పంచి అనే మాట విన్నాం.

`పేదల సొమ్ము పెద్దలకు పంచడం చూస్తున్నాం.

`ఒకప్పుడు పెద్దలు దేశాన్ని పోషిస్తున్నరని చెప్పుకునే వాళ్లు.

`ఇప్పుడు మధ్య తరగతి దేశానికి ఆదాయం ఇస్తోంది.

`ముక్కు పిండి వసూలు చేస్తున్నా మూలిగే శక్తి మధ్యతరగతికి లేదు.

`పన్నుల మీద పన్నులేస్తే సంపన్నులు దేశంలో వుండడం లేదు.

`ఇప్పుడు సాటి మనిషిని ఆదుకునే పరిస్థితి దూరమైతే మనిషే వుండడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అమ్మ పెట్టదు..అడుక్కుతిననివ్వదు..అని సామెత. అచ్చం కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక నిర్ణయమే చేయబోతోందని సమాచారం. ఊరు చెరువు ఎంత నిండినా పేద వాడి గుండె ఎప్పుడూ తడవదు. నిండదు. చెరువు నిండి పొలానికి నీరు పారినా పంట చేతికొచ్చేదాకా నమ్మకం వుండదు. పంట చేతికొచ్చే సమాయానికి చెరువు ఎండిపోవచ్చు. నీరు ఇంకిపోవచ్చు. పొలం మడి బీడులు వారొచ్చు. కరువు రావొచ్చు. పంటలుఎండపోవచ్చు. లేకుంటే అతి వృష్టి వచ్చి పంటంతానీట మునిగి మరిగిపోవచ్చు. చెడగొట్టు వానలు పడి పంట రాలిపోవచ్చు. ఇందులో ఏదైనా జరగొచ్చు. ఏది జరగకుండా, ఎంతో కొంత నష్టపోకుండా ఎప్పుడూ రైతు పూర్తిగా పంట చేతికొచ్చిన సందర్భాలు ఎప్పుడూ వుండవు. పేద వాడి కలలు కూడా అంతే. అవి తీరేదాకా కంటి మీద కునుకుండదు. ఎన్ని రోజులు ఎదరుచూసినా తీరుతాయన్న నమ్మకం కూడా వుండదు. కంటి తుడుపు చర్యలు తప్ప సామాన్యుడి కడుపు ఎప్పుడూ నిండా నిండిరది లేదు. మన దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం ఇందులో దాగి వుంది. మనది పూర్తిగా వ్యవసాయాధారిత ఆర్ధిక వ్యవస్ధ. మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని రకాల వ్యాపారాలు పెరిగినా కొనుగోలు శక్తి అంతా ఆ పల్లెల నుంచే రావాలి. సామాన్యుల చేతి నుంచే ఖర్చు కావాలి. దేశానికి ఆదాయం అందాలి. సాగును వదిలేసి ఏదైనా ఇతర కూలీ పని చేసుకుందామని పల్లె జనం అనుకుంటే పెట్టుబడి దారుడు ముగిపోయే కాలమొస్తే, మళ్లీ కూలి బతుకులు రోడ్డు మీదకు రావొచ్చు. మన దేశంలో బతులకే దిక్కులేదు. రోగమొస్తే వైద్యానికి సరైన సంపద లేదు. సాగుకే సక్కగ పెట్టుబడి లేదు. రోగమొస్తే లక్షలు ఖర్చు చేసుకునే దిక్కు లేదు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఆదుకునే ఏకైక మార్గం అప్పు. ఆ పదం పెద్దదైనా ఎంతోమంది జీవితాలను కూడా నిలబెట్టే మంత్రం. అందుకే పెద్దలు తప్పని స్దితిలో అప్పు చేసి పప్పు కూడా తినొచ్చని కూడా అన్నారు.
మన దేశంలో సుమారు 5లక్షలకు పైగా గ్రామాలున్నాయి. మన దేశమంతా గ్రామీణ ఆర్దిక వ్యవస్ధ మీదనే ఆదారపడి సాగుతోంది. ప్రతి గ్రామంలో మన దేశంలో ఒక వ్యక్తిమీద, మరో వ్యక్తి ఆధారపడకుండా రోజు గడవదు. పూట కూడా గడవదు. పల్లె జీవితంలో అంతంటి అన్యొన్యమైన అనుబంధాలు ముడివేసుకొని వుంటాయి. అందులో ఆర్దిక సంబంధాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవే వారిని ముందుకు నడిపిస్తుంటాయి. పట్టణ వ్యవస్దలో ఇది ఇందుకు పూర్తి భిన్నంగా వుంటాయి. ఒకరికొకరికి ఎలాంటి మానవ సంబంధాలు పెద్దగా వుండవు. ఆర్ధికసంబంధాలు కూడా పెద్దగా కనిపించవు. బంధువుల మధ్య కూడా ఆ అనుబంధం పెద్దగా కనిపించదు. కాని పట్టణ వ్యవస్ధకన్నా, మన దేశంలో పల్లె వ్యవస్ధ పెద్దది. ఆర్ధికంగా బలమైంది. అందుకే పల్లెల్లో ఒకరి అవసరాలు మరొకరు తీర్చేంత నమ్మకాలు ఎక్కువగా వుంటాయి. అవసరానికి పల్లెలలో ఒకరు కాకపోయినా, ఎవరో ఒకరు ఆదుకునే వాళ్లు వుంటారు. ఒక వ్యక్తి కళ్ల ముందు చనిపోతుంటే చూస్తూ పోయేంత దౌర్భాగ్య పరిస్ధితులు కనిపించవు. సహజంగా ఆర్ధిక అవసరాలే, మనుషుల మధ్య బలమైన బంధాలను ఏర్పరుస్తుంటాయి. అవే కొన్నిసార్లు మనుషులను దూరం చేస్తాయి. శత్రువులుగా మారుస్ధాయి. కక్షలు, కార్పణ్యాలకు కారణమౌతాయి. అలాగని పల్లెలో ఒకరికొకరు సాయం చేసుకునే మనస్థత్వాలలో ఇప్పటికీ మార్పు రాలేదు. వారి జీవితాల్లో అగాదాలు సృష్టించబడలేదు. సహజం ఆర్ధిక అవసరాలు ఎదురైనప్పుడు అప్పులు తీసుకునేవాళ్లు పల్లెలో నూటికి ఎనభై మంది వుంటారు. వారిలో కొందరు అప్పులు తీర్చలేక కూడా అవస్దలు ఎదుర్కొంటుంటారు. కొందరు అత్యాశకు పోయి అప్పులు చేసి తిప్పలు పడుతుంటారు. ఇందులోనే అప్పులు చేసి తీర్చలేక ఎగ్గొట్టేవారుంటారు. అంటే అప్పులు ఇచ్చిన వారు కూడా కొన్ని సార్లు మోసపోయే సందర్భాలుంటాయి. అన్ని ఆర్ధిక సంబంధాలు సక్రమంగా వుంటాయని చెప్పలేం. అలాగని గ్రామీణ ప్రాంతాల ప్రజల తక్షణ అవసరాలను తీర్చేది సమీప బంధువులు. స్నేహితులు, సన్నిహితులు. వడ్డీ వ్యాపారులు. అందుకే పెద్దలు పల్లెల్లో ఓ మూడు ముఖ్యమైన వారుండాలని సూచించారు. ప్రతి పల్లెలో అప్పిచ్చువాడు వుండాలన్నారు. ప్రతి పల్లెలో వైద్యడు వుండాలన్నారు. ప్రతి ఊరు పక్కన ఏరు వుండాలని సూచించారు. ఈ మూడు సౌకర్యాలు వున్న ఊరులోనే నివాసం వుండాలని కూడా పూర్వీకులు చెప్పారు. ఎందుకంటే వడ్డీ వ్యాపారి అయినా సరే అవసరానికి డబ్బు సాయం చేసి ఆదుకునే వ్యక్తి ప్రతి ఊరిలోనూ వుంటే ఊరికే ఎ కష్టాలు వండవని అంటుంటారు. ఇప్పటికీ పల్లెల్లో అదే నమ్ముతారు. వారిపైనే ఆదారపడుతుంటారు. ఇక వైద్యుడు ఖచ్చితంగా వుండాలని అంటారు. అర్ధరాత్రో అపరాత్రో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనా చేతిలో డబ్బులులేకపోయినా వైద్యం అందుతుంది. అప్పటికప్పుడు ఉపశనమం పొందేందుకైనా ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలకు మంచినీరు, పంట పొలాలను సాగు నీరు అందే ఏరు వుండాలంటారు. ఇది వున్న ఏ ఊరు ఇబ్బందులకు గురి కాదు.
మరి ఇప్పుడు మన ప్రభుత్వాలు అప్పులు ఇచ్చే వారి మెడమీద కత్తిపెట్టే లాంటి నిర్ణయం చేయబోతోందన్న వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజలనుంచి ప్రతి సందర్భంలోనూ తీసుకునే, చెల్లించే సొమ్ముల మీద కూడా పన్నులు వేలాడీస్తామంటే సరైంది కాదు. ప్రజలు ప్రతి అవసరానికి ఫైనాన్స్‌ కంపనీల మీద, ప్రభుత్వ బ్యాంకుల మీద ఆదారపడాలంటే సాద్యమౌతుందా? అందుకు బ్యాంకింగ్‌ వ్యవస్ధ ఒప్పుకుంటుందా? ప్రభుత్వాలకు రుణాలు ఇచ్చేందుకే నానా నిబంధనలు చూసుకొని ఇస్తాయి. ప్రైవేటు ఫైనాన్స్‌లు కూడా అంతే.. పైకి మాత్రం తక్కువ వడ్డీ అంటూ చెప్పినా, వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు, వాటిపై బారు వడ్డీలు వడ్డించకుండా వుంటాయా? అయినా ఈ సంస్ధలు సామాన్యుడి తక్షణ అవసరాలను తీర్చుతాయి. ఒక వ్యక్తికి తక్షణ అవసరాలకు బ్యాంకులు క్షణాల్లో రుణాలు ఇస్తాయా? కనీసం అప్పుకోసం వచ్చిన సామాన్యుడిని బ్యాంకు మేనేజర్‌ కలిసే అవకాశం వుంటుందా? ప్రైవేటు బ్యాంకులు కూడా ఎలాంటి తనఖా లేకుండా, ప్రభుత్త ఉద్యోగుల పూచీ సంతకాలు లేకుండా రుణాలిస్తాయా? పల్లెల్లోగాని, పట్టణాలలో గాని వ్యక్తిగత రుణాలు అందించే ప్రైవేటు వ్యక్తులు ఇచ్చినంత సులువుగా పైనాన్స్‌ కంపనీలు అత్యవసర వేళల్లో డబ్బు సమకూర్చుతుందా? ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మూలంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి వాస్తవమే. అలాంటి వ్యాపారులే క్షణాల మీద డబ్బులు పేదలకు ఇచ్చేది. వారికి అప్పుగా, నిర్ణీత వడ్డీకన్నా ఎక్కువ వసూలు చేసినా ప్రాణాల మీదకు వచ్చేంత సమస్యలున్నప్పుడు ఆదుకునేది ఆ వడ్డీ వ్యాపారులే. గ్రామాలలో ఆడ పిల్ల పెళ్లి చేసేందుకు కావాల్సిన డబ్బులు సాయంచేసేది వడ్డీ వ్యాపారులే. ఏదైనా అనారోగ్యంతో బాదపడుతున్నవారి వైద్య సాయం కోసం అప్పులిచ్చేది అలాంటి వాళ్లే. అయితే వారి అరచాలు పెరిగిపోతుంటే కట్టడి చేసేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. అప్పులు తీసుకున్న వారిని వేధించడాన్ని అడ్డుకునేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని అప్పులే ఇవ్వకూడదన్నట్లు ప్రభుత్వాలు పాలసీ తీసుకొస్తే పల్లె జీవితాలు ఆగమౌతాయి.
మనది మిశ్రమ ఆర్ధిక వ్యవస్ద. ఏకీకృత ఆర్ధిక వ్యవస్ధ కాదు. మన దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎంతో కృషి చేశారు. అందుకోసం భవిష్యత్తు తరం కోసం ప్లాన్డ్‌ ఎకానమీ ఫర్‌ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఇప్పటి వరకు ఆయన సేవలను ప్రభుత్వాలు అనుసరిస్తూ వస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందే మన దేశంలో దేశ ఆర్ధిక వ్యవస్దను గాడిలోపెట్టేందుకు అవసరమైన అనేక ప్రణాళికలు చేపట్టడం జరిగింది. అందులో ఎంఎన్‌ఎన్‌ రాయ్‌ లాంటి వారుతెచ్చిన పీపుల్స్‌ ప్లాన్‌, శ్రీమన్నారాయణ తెచ్చిన సామ్యవాద ఆర్ధిక వ్యవస్దలో భాగమైన గాందీ ప్రణాళిక, 1943లో బొంబాయికి చెందిన ఎనమిది మంది పారిశ్రామిక వేత్తలు అందులో ముఖ్యమైన టాటా. బిర్లాలు కలిసి బాంబే ప్రణాళికలను రూపొందించారు. దాదాబాయ్‌ నౌరోజీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ వంటి వారు తెచ్చిన అనేక ప్రతిపాదనలన్నీ క్రోడీకరించి ప్రణాళికులు అమలు చేశారు. ఆర్ధిక వ్యవస్దను గాడిలో పెట్టారు. పైగా కాలానికనుగుణంగా ఇందిరాగాందీ, పివి. నర్సింహారావు, మన్మోహన్‌ సింగ్‌లు సంస్కరణలు కూడా తెచ్చారు. కాని గ్రామీణ ఆర్ధిక వ్యవస్దను ఎక్కడా చెడగొట్టే చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. కాని ఇప్పుడు గ్రామీణ ఆర్ధిక వ్యవస్దకు అండగా వుంటున్న వడ్డీ వ్యాపారులు అప్పులు ఇవ్వడంపై ఆంక్షలు విదిస్తే, సామాన్యులకు పల్లెల్లో రూపాయి అప్పు పుట్టదు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద అస్తవ్యస్తమయ్యే పరిస్దితులు ఎదురౌతాయి. కేంద్రం ఈ విషయంపై తీసుకురావానుకుంటున్న నిర్ణయం సరైంది కాకపోవచ్చు. మన దేశంలో ఎంత పట్టణ వ్యవస్ధ పెరిగినా పల్లె వాతావరణంలో మార్పు రాదు. తేలేము. వారి జీవితాలను చిద్రం చేసే నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దు. కాకపోతే ఇష్టానుసారం వడ్డీ వ్యాపారం చేయడాన్ని నియంత్రించాల్సిన అవసరం వుంది. ప్రామిసరీ నోట్ల మీద ఖచ్చితంగా వడ్డీ కూడా రాసేలా నిబంధనలు తీసుకురావాలి. సహజంగా ప్రామిసరీ నోటు మీద సంతకం తప్ప ఎలాంటి రాతలు లేకుండానే అప్పులు చేస్తుంటారు. వడ్డీలకు ఇచ్చే వారు కూడా నోటి మాట ద్వారానే వడ్డీని చెబుతుంటారు. ప్రభుత్వాలు నిర్ణయించిన మేరకు మాత్రమే అప్పులకు వడ్డీలు వసూలు చేసే వ్యవస్ధను నిర్మాణం చేయాలి. ప్రజలు కొంత ఉపశమనం కల్గించేలా నిర్ణయాలు చేయాలి.

సీఎం “రేవంత్” కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన “పిసిసి అధికార ప్రతినిధి”.

“నేటిధాత్రి”, హైదరాబాద్

ఆంగ్ల నామ నూతన సంవత్సర ని పురస్కరించుకొని బుధవారం రోజున ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి” నీ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టి పిసిసి అధికార ప్రతినిధి “బండి సుధాకర్ గౌడ్”

ఇండిపెండెంట్ చర్చిలో ప్రార్థనలు

నిజాంపేట, నేటి ధాత్రి

మండల కేంద్రంలోని ఇండిపెండెంట్ చర్చిలో పాస్టర్ కాంతి రాజు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుండి ప్రార్థనలు చేశారు. నస్కల్, తిప్పనగుల్ల ,కాసింపూర్ గ్రామాల నుండి ఏసుక్రీస్తు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పాస్టర్ కాంతి రాజు మాట్లాడుతూ యేసు క్రీస్తు దయామయుడు కరుణామయుడు అని సకల జీవుల యందు ప్రేమ గల దేవుడు అన్నారు. అదేవిధంగా ఏసుప్రభు భక్తులు కూడా సత్యమునే మాట్లాడాలని ఆయన యందు విశ్వాసం ఉంచువారు ధన్యులు అవుదురు గాక అన్నారు. ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతతో కలిసిమెలిసి జీవించాలన్నారు. యవ్వనస్తులు యువతి యువకులు భయభక్తులతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన, పాస్టర్ పౌలు, ఆశీర్వాదం, బిక్షపతి, చంద్రం, స్రవంతి, వినోద, రాజమణి, చంద్రకళ, స్వరూప, సరోజ, ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version