చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ లో గురువారం రోజున విద్యార్థులకు సైబర్ నేరాలపై చిట్యాల జి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్స్ లాల్ సింగ్, లింగన్న, సందీప్, నాగరాజు లు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి నారు,
చిట్యాల సైబర్ వారియర్ లాల్ సింగ్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గణనీయంగా పెరిగిందని,వాటిలో ముఖ్యంగా:1.ఫిషింగ్,
2. రాన్సోమ్ వేర్ 3. గుర్తింపు దొంగతనం,4. ఆన్లైన్ వేధింపులు,5. సైబర్స్టాకింగ్,6. క్రెడిట్ 7. హ్యాకింగ్8. మాల్వేర్*,9. సోషల్ ఇంజనీరింగ్*10. ఆన్లైన్ మోసాలు*11. సైబర్ గూఢచర్యం,12. *డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్,13. *క్రిప్టోజాకింగ్,
14. ఆన్లైన్ పిల్లల దోపిడీ,
15. మేధో సంపత్తి,
ఈ రకమైన సైబర్ నేరాల గురించి తెలుసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి బలమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, సాఫ్ట్వేర్ను తాజాగా ఉంచడం మరియు లింక్లపై క్లిక్ చేసేటప్పుడు లేదా ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని అందించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వంటి చర్యలు తీసుకోవడం చాలా అవసరం అని వివరించి
సైబర్ క్రైమ్ కి గురాయ్ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 సైబర్ హెల్ప్ నెంబర్ కి కాల్ చేయాలని, పోగొట్టు కున్న ఒక గంట లోపే చేయడం ద్వారా డబ్బులు హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందని, దానిని గోల్డెన్ హవర్ అంటరాని చెప్పారు.
కార్యక్రమం లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.