కురివి మండల కేంద్రంలోని రైతు వేదికలలో రైతు భరోసా సంబురాలు
మరిపెడ/కూరవి నేటిధాత్రి.
రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖా-ముఖీ కార్యక్రమం లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గ లో ని కూరవి మండల రైతు వేదిక లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రునాయక్, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల తో కలిసి సమావేశం లో పాల్గొని మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో ప్రజల్లో కి తీసుకెళ్ళి ప్రజా పాలన, ప్రభుత్వo అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు, నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా ప్రతి ఎకరాకు 6000 రు చొప్పున లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో కొరవి మండల పార్టీ అధ్యక్షులు,మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్,కొరవి దేవస్థానం చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండి వెంకటరెడ్డి, మరియు ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.