AIYF Extends Full Support to Nationwide Strike
12న దేశవ్యాప్త సమ్మెకు ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు
బద్దం ఏల్లారేడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేసిన బావండ్లపల్లి యుగేందర్
కరీంనగర్, నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వ కార్మికవర్గ వ్యతిరేక, యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధిత గోడ ప్రతులను గణేష్ నగర్ లోని బద్దం ఏల్లారెడ్డి భవన్ లో కార్యాలయంలో విడుదల చేసారు. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ఆస్తులు మరియు అవసరమైన ప్రజా సేవల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఫలితంగా ఉద్యోగాలు కోల్పోవడం, కార్మిక హక్కులను హరించివేయడం మరియు సామాజిక భద్రత నిరాకరణ, యువత మరియు శ్రామిక ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను పలుచన చేసిన, కార్మిక సంఘాలను బలహీనపరిచి, “వ్యాపారం చేయడం సులభతరం” పేరుతో సంస్థాగతమైన దోపిడీకి కారణమైన నాలుగు కా
