అట్టహాసంగా చెల్పూర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

Teachers Teachers

అట్టహాసంగా చెల్పూర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్పూర్ లో 2007-2008 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులు అంతా కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని బుధవారం ఆ పాఠశాల ప్రాంగణంలో అపూర్వంగా నిర్వహించుకున్నారు
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గతంలో ఉపాధ్యాయులు గా పనిచేసిన పూర్వ ఉపాధ్యాయులందరూ అతిధులుగా హాజరయ్యారు
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆ సంవత్సరం చదివిన మొత్తం మందిలో ఎనిమిది మంది దురదృష్టవశాత్తూ మృతి చెందారని వారికి ఘనంగా నివాళులర్పించిన పిమ్మట మిగతా పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క పరిచయాన్ని తాము జీవితంలో స్థిరపడ్డ విధానాన్ని సభా కార్యక్రమంలో వివరించారు.

 Teachers
తాము పదవ తరగతి చదువుకొని అప్పుడే 18 సంవత్సరాలు గడిచాయి అంటే నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు

విద్యార్థులందరూ గత స్మృతులను నెమరువేసుకొంటూ నాడు సెల్ ఫోన్ లే కాదు ల్యాండ్ ఫోన్లు కూడా లేని సమయంలో అత్యంత సీదా సాదాగా ఉండేవారమని పూర్తి సమయాన్ని చదువుతోపాటు ఆటపాటలకు కేటాయించే వారమని ఇంటి పనులు కూడా చేసుకునే వారమని చెప్పారు ఎలక్ట్రానిక్ మీడియా విస్తృత ప్రచారంలో లేని కాలంలో ఉపాధ్యాయులే జీవితంగా శ్వాసగా ఉండేవారమని వారు ఏది చెబితే అది శిరసావహించే వారమని కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం విద్యార్థినీ విద్యార్థులంతా సెల్ ఫోన్ ప్రభావములో ఉండడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు

 Teachers
Teachers

తమ ఉపాధ్యాయుల సేవలు త్యాగాలు ఎన్నడు మరువలేమని తమ జీవితాల్లో స్థిరపడడానికి వారు అందించిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం కారణమని నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు
తాము చదివిన కాలంలో తమతో పాటు చదువుకున్న విద్యార్థులతో పాటు 8 మంది దివంగతులు అయినందున వారి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల లతో పాటు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!