
"Anjani Putra Hosts Grand Annadanam"
అంజనీ పుత్ర ఆధ్వర్యంలో ఘనంగా అన్న దాన కార్యక్రమం…
అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వచనాలు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు న అంజనీపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న
ప్రజలు అన్నదాతా సుఖీభవ అంటూ భక్తులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ.. అన్ని దానాల్లో అన్న దానం గొప్పదని. సామాజిక కార్యక్రమాలలో అంజనీ పుత్ర సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అంజనీ పుత్ర అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడిందని అన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అంజనీ పుత్ర గణపతి మండపం గురించి ప్రత్యేకంగా చర్చించుకునేలా వసతులను వారు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేనీ కిషన్, కాసర్ల సదాందం, డైరెక్టర్ లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.