రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి.

Farmers Farmers

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి

నర్సంపేట నేటిధాత్రి:

 

రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్న రైతు భరోసా రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయా రైతులకు అందించాలని బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత రైతు భరోసా ఎకరాకు రూ 15 వేలు ఇస్తాం అని చెప్పి ఇవ్వకుండా రైతులకు ఎకరాకు రూ 19 వేలు బాకీ ఉన్నదని అట్టి రూపాయలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టి అధికారంలోకి వచ్చిన తరువాత
2023 – 24 రబీ లో ఒక్కో ఎకరాకు రూ,2500/- ఇవ్వకుండా మొత్తం
మొత్తం నాలుగు సీజన్లకు కలిపి ఒక ఎకరా ఉన్న రైతు కు రైతు భరోసా రూ.పంతొమ్మిది వేల రూపాయలు బాకీ ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహారాములు, క్లస్టర్ ఇన్చార్జి లు మోతే జై పాల్ రెడ్డి,మోతే పద్మ నాభా రెడ్డి,కోడారి రవి,మోటురి రవి,కందుల రాజి రెడ్డి,సంగెం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!