ముప్పై ఐదేళ్ళ నాటి కథతో…

Keerthy Suresh Keerthy Suresh

ముప్పై ఐదేళ్ళ నాటి కథతో…

 

 

 

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’.

 

సుహాస్ ప్రాధాన్యమున్న పాత్ర పోషించిన ఈ సినిమా జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh), సుహాస్ (Suhas) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). బాబు మోహన్, శ్రతు, తాళ్ళూరి రామేశ్వరి ఇందులో కీలక పాత్రలు పోసించారు.

అని ఐ.వి.శశి దర్శకత్వంలో ఈ సినిమా రాధికా లావు (Radhika Lavu) నిర్మించారు.

వసంత్ మరింగంటి ఈ మూవీకి రచన చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పుకప్పురంబు’ మూవీని వివిధ భాషల్లో ప్రైమ్ వీడియో (Prime Video) జూలై 4న స్ట్రీమింగ్ చేయబోతోంది.

తాజాగా ‘ఉప్పుకప్పురంబు’ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు సుహాస్, కీర్తి సురేశ్‌ కూడా పాల్గొన్నారు.
చిట్టి జయపురం అనే చిన్న పల్లెటూరిలో జరిగే కథ ఇది.
ఆవూరికి గ్రామాధికారిగా అపూర్వ (కీర్తి సురేశ్‌) ఎంపిక అవుతోంది.
అయితే ఓ మహిళ ఆ పదవిని చేపట్టడాన్ని ఊరిలో కొందరు సహించలేకుండా ఉంటారు.
ఆమెను ఎలాగైనా ఇరకాటాన పెట్టాలనుకుంటారు.
ఊరి శ్మశానంలో మనుషులను పూడ్చడానికి చోటు లేని పరిస్థితి ఏర్పడుతుంది.
అలాంటి సమయంలో ఏం చేయాలో పాలు పోక ఆమె కాటికాపరి అయిన చిన్న (సుహాస్) సహాయం కోరుతుంది.
శ్మశానంలో స్లాట్ బుక్ చేసుకోవడానికి లక్కీ డ్రా తీయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
ఈ నేపథ్యంలో వ్యంగాత్మకంగా ఈ మూవీ సాగుతుంది.

‘ఉప్పుకప్పురంబు’లో తాను పోషించిన పాత్ర గత చిత్రాలకు ఎంతో భిన్నంగా ఉంటుందని, అవగాహనలేని మహిళ పాత్రే అయినా ఆమె ఆదర్శాన్ని పాటించే విషయంలో దృఢంగా ఉంటుందని కీర్తి సురేశ్‌ తెలిపింది.

గ్రామీణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన

ఈ సినిమాలో చక్కని హాస్యానికి చోటు దక్కిందని ఆమె అన్నారు.

ఇది సందేశం ఇచ్చే చిత్రం కాదని, గ్రామీణ జీవితానికి అద్దం పట్టే సినిమా అని సుహాస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!