ముప్పై ఐదేళ్ళ నాటి కథతో…
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’.
సుహాస్ ప్రాధాన్యమున్న పాత్ర పోషించిన ఈ సినిమా జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ (Keerthy Suresh), సుహాస్ (Suhas) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). బాబు మోహన్, శ్రతు, తాళ్ళూరి రామేశ్వరి ఇందులో కీలక పాత్రలు పోసించారు.
అని ఐ.వి.శశి దర్శకత్వంలో ఈ సినిమా రాధికా లావు (Radhika Lavu) నిర్మించారు.
వసంత్ మరింగంటి ఈ మూవీకి రచన చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పుకప్పురంబు’ మూవీని వివిధ భాషల్లో ప్రైమ్ వీడియో (Prime Video) జూలై 4న స్ట్రీమింగ్ చేయబోతోంది.
తాజాగా ‘ఉప్పుకప్పురంబు’ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘ఉప్పుకప్పురంబు’లో తాను పోషించిన పాత్ర గత చిత్రాలకు ఎంతో భిన్నంగా ఉంటుందని, అవగాహనలేని మహిళ పాత్రే అయినా ఆమె ఆదర్శాన్ని పాటించే విషయంలో దృఢంగా ఉంటుందని కీర్తి సురేశ్ తెలిపింది.
గ్రామీణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన
ఈ సినిమాలో చక్కని హాస్యానికి చోటు దక్కిందని ఆమె అన్నారు.
ఇది సందేశం ఇచ్చే చిత్రం కాదని, గ్రామీణ జీవితానికి అద్దం పట్టే సినిమా అని సుహాస్ అన్నారు.