వ్యవసాయ మార్కెట్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
జెండా ఆవిష్కరించిన ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి
పరకాల నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి జెండావిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల బలిదానాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావాన్ని మనం జరుపుకోవడం సంతోషకరమైనదని ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ నారాయణ,తహాసిల్దార్ విజయలక్ష్మి,కాంగ్రెస్ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ,మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్,మార్కెట్ డైరెక్టర్స్ దాసరి బిక్షపతి,బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళి,భోగం కమల,నల్లెల కుమారస్వామి,
పెండ్యాల కుమారస్వామి,
ఎండి రంజాన్,వైద్యుల వెంకటరాజిరెడ్డి,శానం కుమారస్వామి,గాదె విజయ్,
బుడిమే రాజయ్య
మల్లక్కపేట భక్తాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్,కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, , రాయపర్తి మాజీ ఎంపిటిసి పర్నెం మల్లారెడ్డి,మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు , తాజా మాజీ కౌన్సిలర్స్ పరకాల మండల పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పరకాల మండల పట్టణ నడికూడ మండల సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు,మార్కెట్ కార్యదర్శి,వ్యవసాయ అధికారులు,సిబ్బంది
రైతులు పాల్గొన్నారు.