పోయిన ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులకు అప్పగింత
మొగుళ్లపల్లి మే 24 నేటి ధాత్రి:
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
మండలంలోని ఇప్పలపల్లి, బంగ్లాపల్లి గ్రామాలకు చెందిన గడ్డం కుమార్, బోయిన హర్షవర్ధన్,లు గత కొన్ని రోజుల క్రితం తమ చరవాణిలను ఎక్కడో పోగొట్టుకున్నారు. బాధితులు ఎంత వెతికిన చరవాణి దొరకపోవడంతో. మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో. ఎస్సై బొరగల అశోక్ ను బాధితులు సంప్రదించి విషయం వివరించడంతో. ఎస్ఐ. అశోక్ స్పందించి హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, సిఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్ జ్యోతి కి ఆదేశాలు జారిచేయడంతో. పోగొట్టుకున్న వారి ఫోన్ లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి శనివారం రోజున బాధితులను పోలీస్ స్టేషన్ కు రప్పించి చరవాణిలను హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, బాధితులకు అప్పగించారు. చరవాణి ని ట్రేస్ చేయడంలో ముఖ్యపాత్ర వహించిన సీఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్ కానిస్టేబుల్ జ్యోతిని ఎస్ఐ. అభినందించగా. చరవాణిని పోగొట్టుకున్న బాధితులు గడ్డం కుమార్ బోయిన హర్షవర్ధన్, ఎస్సై అశోక్ ను పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.