పద్మశాలి సంఘ సభ్యత నమోదు
మందమర్రి నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం మార్కెట్ ప్రాంతంలో గల పద్మశాలి సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. గత అధ్యక్ష పదవి కాలం ముగిసిన సందర్భంగా మరల అధ్యక్ష ఎన్నికల కొరకై ప్రణాళిక సిద్ధం చేయుట కొరకు పద్మశాలి కుల బాంధవుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అడక్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుత అడగ్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ ప్రాంతంలోని అన్ని వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ ఏరియాలోనీ వ్యాపార సముదాయాలలో గల పద్మశాలి కుల బాంధవులను కలిసి వారి యొక్క సభ్యత్వ నమోదును కమిటీ సభ్యులు చేపట్టారు. కమిటీ సభ్యులు పిట్టల సుధాకర్, బత్తుల సతీష్ బాబు మాట్లాడుతూ కుల సభ్యులు ఎవరైనా ఇంకా సభ్యత్వ నమోదు చేసుకోనట్లయితే మార్కెట్ ప్రాంతంలో గల కళ్యాణ్ సూపర్ మార్కెట్ వద్ద నమోదు చేసుకోగలరనీ తెలిపారు. అధ్యక్ష పదవి ఎన్నిక కొరకు తేదీ త్వరలో ఖరారు చేస్తామని, ఈలోగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.