డబ్బు ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి అని టాక్…?
– నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగేనా.
కొల్చారం (మెదక్) నేటిధాత్రి:
ఇందిరమ్మ ఇల్లు మంజూరులో రోజురోజుకు దుమారం రాజుకుంటోంది సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల లిస్టులపై ఆగ్రహం, అనుమానాలు, గంద రగోళం వ్యక్తమవుతోంది. పల్లె పల్లెలో కాంగ్రెస్ నేతలు మేము కష్టపడ్డాం ఓట్లు వేయించాం అధికారంలోకి వచ్చాం… ఇప్పుడు ఇల్లు తీసుకోవడం మా హక్కు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు గుసగుసలు చేస్తున్నారు. హస్తం పార్టీకి చెందిన నాయకులు అధికార దర్పంతో వ్యవహరిస్తున్నారని, మా అధికారం మా రాజ్యం అన్న తీరుతో ప్రజలపై ఆధిపత్యం చూపుతున్నా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాత్రం ఎవరైనా అర్హుల కాదని తేలితే లిస్టులు రద్దు చేస్తామని తప్పులు జరిగితే అధికారులపై చర్యలు తీసు కుంటామని చెబుతున్నారు. కానీ ఈ మాటలకూ కమిటీల చర్యలకూ పొంతన లేదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారుల సర్వేలకు గ్రామాల్లో అవ రోధాలు ఏర్పడుతున్నాయి. అధికారులు కూడా నిరుత్సా హంగా “చేస్తే చేస్తాం లేకపోతే వెళ్తాం” అన్న విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగా చాలా చోట్ల సర్వేలు పూర్తవ్వకుండానే అధికారులు వెనుదిరు గుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్లో పార్టీ జెండా పట్టి
నవారికి పెద్దపీట పడుతోంది. పేదవారికి న్యాయం జర గాలంటే పార్టీ బలమే అర్హతాగా బంధుప్రీతి, డబ్బు, ఆర్థిక బలం ఉంటేనే ఇల్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలలో ఈ రచ్చ మరింత ఉధృతంగా ఉంది. స్వయంగా మంత్రులు చేసిన ప్రకటనలను లెక్క చేయకుండా స్థానిక కమిటీలు తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లు లిస్టుల్లో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మండల నాయకులు కూడా సిఫార్సుల పేరుతో కమిటీలకు ప్రభావం చూపుతున్నట్లు చర్చ సాగుతోంది. ఇందిరమ్మ ఇల్లు లభించని పేదలు అర్హులు నిరాశతో ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలోనూ ఈ ఇళ్ల వ్యవహారాన్ని కేంద్రంగా చేసుకుని వర్గ పోరు ముదురుతోంది. కొంతమంది నేతలకు ఇల్లు రాకపోవడంతో పార్టీలో గొడవలు జరుగుతున్నాయిని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇల్లు ఇచ్చే వారు కాంగ్రెస్ నేతలే మరోవైపు అదే నేతల వల్లే గొడవలు జరుగుతు న్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు మాత్రం ఈ వ్యవహారంపై నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆర్హత కలిగిన పేదలకు గూడు కల్పిం చాలన్నదే చాలామంది అభిప్రాయం. వర్గీయతను బంధు ప్రీతిని తొలగించి నిజమైన లబ్దిదారులకు ఇంటి మంజూరుతో న్యాయం జరిగితేనే ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. నిజమైన నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో.. ఇండ్లు లేనివారికి.. అధికార పార్టీ నాయకులతో అయితదా..? అధికారులు సర్వే చేసి నిజమైన అర్హులను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేసే చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే..