సాగు నీటి కోసం రమణన్న పోరుబాట..!
*ఇక్కడి వారు రైతులు కారా!
అక్కడి వారే రైతులా!*
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంప ల్లి గ్రామంలో రైతుల పంట పొలాలకు నీరు కోసం పోరుబాట మహా ధర్నాను నిర్వహించడం జరిగింది కచంలో కూడున్న తినలేని పరిస్థితి అన్నట్లు ధర్మసాగర్ వరకు నీటిని పంపు చేసే చలివాగు ప్రాజెక్ట్ చేరువలో ఉన్న ఇక్కడి రైతులకు సాగు నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతన్న దిగ్భ్రాంతి చెంది రైతు ఆత్మహత్యలకు పాల్పడు తున్న కనీసం కనీకరం చూపించని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో రైతులు,బిఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతోఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపు హౌస్ సీఈ అశోక్ కుమార్ ప్రాజెక్ట్ వద్ద నుండి ఫోన్ చేసి చలివాగు ప్రాజెక్ట్ లో కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు చేపట్టి ఇటు చలివాగు ఆయకట్టు వెంట పండే పంట పొలాలకు సాగు నీరు విడుదల చేసిన తరువాతే పైకి ధర్మసాగర్ కి నీటిని పంపిణీ చేయాలని, అలా కాదని ఇక్కడి రైతులు రైతులు కాదన్నట్టు,వారే రైతులు అన్నట్టు ఇక్కడి పంట పొలాలను ఎండబెట్టి పైకి నీటిని తీసుకెళ్ళాలని చూస్తే,చూస్తూ ఊరుకునేది లేదని పంపు మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు.
నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటిని విడుదల బంధు పెట్టడం వల్లే ఈ సమస్య ఏర్పడింది.మా డిమాండ్ ఒక్కటే ఇక్కడి రైతులకు సాగు, తాగు నీటిని విడుదల చేసిన తరువాత కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకొని తరువాత పైకి నీటిని పంపు చేయాలి.నీటి మట్టం పెరిగే వరకు మోటార్లు బంధు పెట్టాలని డిమాండ్ చేశారు.

రైతే రాజు అన్న బీఆర్ఎస్ పార్టీ
అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న నా తెలంగాణ రాష్ట్రాన్ని అనాలోచిత పరిపాలన అసమర్థత వల్ల, చేతకానితనం వల్ల ఈ రోజు రైతులు ఎంతో ఆందోళనతో తీవ్రమైన నిరాశ నిస్పహల మధ్య రైతులు ఉన్నారు.అందుకే ఈ రోజు రైతుల పక్షాన,ప్రజల పక్షాన చలివాగు ప్రాజెక్టు వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అనాలోచిత పరిపాలన అని ఎందుకు అన్నమంటే జనవరి నెలలో దాదాపు నెల రోజుల పాటు చలివాగు ప్రాజెక్ట్ లోకి నీటి పంపిణీ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన 4 నుండి 5 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వకపోవడం,స్పందించ కపోవడంతో అక్కడి వర్కర్స్ జీతాలు ఇవ్వకపోవడం వల్ల పంపింగ్ బంధు చేయడంతో ఈ సమస్య ఏర్పడింది.
రైతులకు సంబంధించిన విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం
ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, పైనుండే పొలాలకు నీళ్లు పోతాయి ఇక్కడి పంట పొలాలు ఎండగొడితే మాత్రం ఎకరాకు రూ.50000/- ల నష్ట పరిహారం ఈ ప్రభుత్వం బేషరతుగా ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.దీక్ష చేస్తూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన తరువాత ఈ సందర్భంలో ఇక్కడికి ఇరిగేషన్ ఈఈ ఇక్కడికి వచ్చి 6 రోజుల లోపుల 15 అడుగుల నీటిమట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.ఒకవేళ కనుక 15 అడుగుల నీటిమట్టం రాకుండా ఇక్కడి పంట పొలాలు ఎండగోడితే మాత్రం రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం.అవసరం అయితే మేమే తాళాలు పగలగొట్టి, మోటార్లు బంధు పెడతామని హెచ్చరించారు.

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు పంటలు సమృద్ధిగా పండాయి
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారం రోజులకు ఒక్కసారి చలివాగు నీటిమట్టం పై అధికారులతో మాట్లాడి నీటి మట్టం తగ్గితే మోటార్లు బంధు పెట్టించి నీటి మట్టం పెరిగిన తరువాత పంపింగ్ చేయమని అధికారులకు చెప్పేది వాళ్ళు కూడా అదే విధంగా సహకరించేవారు. పర్యవేక్షణ లోపమా,నాయకత్వ లోపమా, చేతకాని తనమో తెలియదు కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది.మాకే ఉద్దేశ్యం లేదు,రైతుల సమస్యలపై రాజకీయం చేసే అవసరం లేదు.రైతుల పంట పొలాలు ఎండిపోకుండా చలివాగు ఆయకట్టు వెంట చిట్యాల, రేగొండ, మొగుళ్ళపల్లి, టేకుమట్ల వరకు వారి పంట పొట్ట దశలో ఉంది, అందరూ కూడా రైతులే,ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకొని చలివాగు తూము ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలనీ డిమాండ్ చేస్తున్నాం. డిబిఎం38 ద్వారా రావలసిన నీటి యొక్క వాట మాకు రావడం లేదు,పైనున్న వారే ఎక్కువ వాడుకోవడం వల్ల మాకు అన్యాయం జరుగు తుంది. డిబిఎం 38 ద్వారా గొరికొత్తపల్లి వరకే నీళ్ళ వస్తున్నాయి.నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఒక్క పర్యవేక్షణ పెట్టి పోలీసు అధికారులు,మా ప్రజాప్రతినిధుల సహాయంతో చిట్యాల,టేకుమట్ల వరకు నీటిని తీసుకెళ్ళి చిన్న చిన్న చెరువులని నింపి మత్తడి స్థాయి వరకు తీసుకెళ్ళం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాయంపేట, గోరికొత్తపల్లి, రేగొండ,చిట్యాల, మొగుళ్ళపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.