అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.

18 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం వ్యక్తిపై కేసు నమోదు.
నర్సంపేట టౌన్ సిఐ రమణమూర్తి.

నర్సంపేట,నేటిధాత్రి:

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు నర్సంపేట టౌన్ సిఐ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు కమలాపురంలో అనుముల రాము అనే వ్యక్తి తన ఇంటి వద్ద ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని సమాచారం మేరకు నర్సంపేట ఎస్సైలు రవి కుమార్, అరుణ్‌ లు తమ సిబ్బందితో అనుముల రాము ఇంటిపై దాడి చేయగా 18 క్వింటాల్ ల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించామని తెలిపారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకాగా PDS వాటి విలువ సుమారు రూ. 45 వేలు వుంటుందని వాటిని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలియజేశారు.నర్సంపేట మండలంలో ఎవరైనా పేకాట ,గంజాయి,రేషన్ బియ్యం, పొగాకు ఉత్పత్తులు,సంబంధిత రవాణా వంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!