పరకాల 9వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి
పరకాల నేటిధాత్రి
గత కొద్ది రోజుల క్రితం పరకాల రూరల్ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని ఎస్సి కులానికి చెందినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన, మంగళపల్లి మహేష్,భార్య శైలజ 36 సంవత్సరాలు ఆర్థిక పరిస్థితి బాగాలేక అనారోగ్యంతో అకాల మరణం చెందడం జరిగింది.వారికి ఇద్దరు చిన్న పిల్లలు కలరు, వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పరకాల మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి వారికి 50 కిలోల బియ్యం నిత్యావసర సరుకులు ఇచ్చి వారిని పరామర్శించడం జరిగింది.ఎవరైనా దాతలు వారికి సహాయం చేయగలరని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహేష్ కుటుంబ సభ్యులు మరియు ముష్క దేవేందర్,వడ్ల మొగిలి, పుట్ట రవీందర్,మోత్కూరి మహేందర్,పుట్ట నరేష్, చందుపట్ల వెంకటరెడ్డి,చెల్పూరి రాజు, కందికొండ రాజు, పల్లెబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.