నేటిధాత్రి, వరంగల్
వరంగల్ లోనే 34వ డివిజన్ మహిళా నాయకురాలు కన్నోజు వంశీ, లావణ్య 34వ డివిజన్ లోని సమస్యలను తెలుసుకొని జిల్లా మంత్రి కొండా సురేఖను హైదరాబాదు లోని స్వగృహంలో కలుసుకొని సమస్యలను వివరించారు. 34వ డివిజన్ మహిళా నాయకురాలు కన్నోజు వంశీ లావణ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం డివిజన్లోని సమస్యలను ఎప్పుడూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక సమస్య త్వరితగతిలోనే పరిష్కరించి, తగు నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంగా, డివిజన్లోని కొన్ని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా చాలా సానుకూలంగా స్పందించిన మంత్రి, డివిజన్ సమస్యలను ఎలక్షన్ కోడ్ ఉన్నందున, ఎంపీ ఎలక్షన్ తర్వాత కోడ్ తదనంతరం సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు