*ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా

*వెదురు ఉత్పత్తులనే వాడండి కాలుష్యాన్ని నివారించండి
వీణవంక,( కరీంనగర్ జిల్లా)
నేటిదాత్రి: వీణవంక మండల కేంద్రంలో మేదర కులస్తులు ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.ముఖ్యఅతిథిగా వీణవంక గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి, వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్ హాజరై ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మేదర్ కులస్తులు వెదురు బొంగులతో బతుకమ్మ పేర్చడానికి శిబ్బిలు, చాటలు, వస్తువులను తయారు చేసి వారి జీవనాన్ని సాగిస్తున్నారని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీసీ బందు పథకాన్ని తీసుకురావడంతో మేజర్ కులస్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. వారి కులస్తులకు అర్హులైన వారందరికీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో బీసీ బంద్ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందన్నారు. అర్హులైన వారికి పింఛను కూడా ఇప్పిస్తామని అన్నారు.సర్పంచ్ నీల కుమారస్వామి,వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్ లకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేదరి సంఘం మండల అధ్యక్షులు కుచనపల్లి కుమార స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సాంబయ్య, సభ్యులు హరి ప్రసాద్, రమేష్, రాజు, వినోద, సాయి, సారయ్య,కనకయ్య, మల్లయ్య సాంబయ్య, రాజ మొగిలి, సర్వేశం,రాములు, మహేందర్,వంశీ ,ప్రశాంత్ ,తదితరులు కులస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!