సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి
ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణిలో ప్రైవేటీకరణ కాంట్రాక్టు పద్ధతి తక్షణమే నిలిపివేయాలని ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా చేయడం ద్వారా కోడ్ ఆఫ్ డిసిప్లేన్, కార్మికులు మేనేజ్మెంట్తో చెప్పుకునే బాధలు లేకుండా హరిచిపోతున్నవి ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్ లు కార్మిక చట్టాలకు అనుకూలంగా లేవు కాబట్టి, కేరళ, బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో మోడీ ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరించుకున్నాయి, ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలి అని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
