మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించిన బిఆర్ఎస్ నేతలు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎక్కడలేని విధంగా అద్భుతంగా కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాహుబలి మోటర్లు పెట్టి నీళ్లను పైకి లిఫ్ట్ చేసి కాలేశ్వరం నుండి మల్లన్న సాగర్ హైదరాబాదు ప్రజల తాగునీరు కోసం రైతులకు వ్యవసాయానికి నీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ రైతుల కోసం ఆలోచించే వ్యక్తిగా దేశంలోని నిలిచిపోయారు రైతులకు రైతుబంధు రైతు చనిపోతే రైతు కుటుంబానికి రైతు భీమా కింద ఐదు లక్షల రూపాయల ఇచ్చిన ఘనత కెసిఆర్ ది కానీ ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు సకాలంలో రైతులకు రైతు భరోసా నిధులను ఇవ్వడం లేదు మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగి క్రాకులు ఇచ్చినాయి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం చేసి కేసీఆర్ పేరు లేకుండా చేయాలని ఆలోచించారు కావున ఇకనైనా రేవంత్ రెడ్డి కెసిఆర్ కు క్షమాపణ చెప్పి కాలేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయించి రైతులకు వ్యవసాయానికి నీరు అందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రైతుల కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సందర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి,తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, పుట్ట మధుకర్ బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎంపీ మాలోతు కవిత, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి నాయకులు కార్యకర్తలు తదితరులు.
