Narsampet Market Reopens with New Rules
ఈ నెల 20 నుండి మార్కెట్ లో కొనుగోళ్ళు పున ప్రారంభం
మక్కజొన్నల కొనుగోలుకు కొత్త నిబంధనలు..గేట్ ఎంట్రీ తప్పనిసరి
సమయ పరిమితులు విధింపు:
నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్
నర్సంపేట, నేటిధాత్రి:
ఈ నెల 20 నుండి మార్కెట్ లో కొనుగోళ్ళు పున ప్రారంభం కానున్నట్లు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.ఈ నేపధ్యంలో
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుండి మక్కజొన్నలు సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డులోకి అనుమతించే విధానంలో మార్పులు చేస్తున్నట్లు కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ప్రకటించించారు.ఇకపై రైతులు, వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డుకు తీసుకురాగానే గేటు వద్ద ఉన్న గేట్ ఎంట్రీ రిజిస్టర్లో నమోదు చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు.నమోదు చేసిన తరువాత మాత్రమే యార్డులోకి ప్రవేశం కల్పించబడుతుందని తేల్చిచెప్పారు.అలాగే, మక్కజొన్నలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు.ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ మార్కెట్ కమిటీకి సహకరించాలని రైతులు, వ్యాపారస్తులను కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ కోరారు.
