Nagulamma Maha Jatara Begins in Mangapet
నేటి నుండి నాగులమ్మ మహా జాతర
ఆదివాసీ పూజారులు ,వడ్డే లతో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు
నాగులమ్మ ను తర తరాలుగా ప్రకృతి దేవత గా ఆరాధిస్తున్న ఆదివాసీ పూజారులు
మార్చ్ 5 న నిండు జాతర,నాగులమ్మ-పగిడిద్ద రాజు ల కళ్యాణం,అగ్నిగుండాలు
అలరించనున్న ఆదివాసీ దింసా,గుస్సాడి నృత్యాలు
కార్య క్రమాలను వెల్లడించిన బాడిశ రామకృష్ణ స్వామి
మంగపేట:నేటిధాత్రి
మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధి లో గల లక్ష్మీ నర్సా పూర్ గ్రామం లో శ్రీ నాగులమ్మ మహా జాతర ఐదు రోజుల పాటు గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధం గా ఘనం గా నిర్వహించ నున్నారు .ప్రతి రెండేళ్ల కోసారి పాల్గుణ శుద్ధ పౌర్ణమి ఉన్న వారం లో జాతర నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ గా వస్తుంది.పూజ కార్య క్రమ వివరాలను బాడిశ.రామకృష్ణ స్వామీజీ తెలియ జేసారు.మార్చ్ 03 న మండె మెలుగుట కార్యక్రమం తో జాతర ప్రారంభ

మవుతుందని,మార్చ్ 4న బుధవారం శ్రీ నాగులమ్మ అమ్మవారిని గండోర్రె గుట్ట వద్ద ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు,అదేసమయంలో యెర్రెట్టల గుట్ట వద్ద సడాలమ్మకు పూజలు చేసి నాగులమ్మ సడాలమ్మ అమ్మవార్లను రమణక్క పేట దగ్గర వున్న గోదావరి నది వద్ద పుణ్య స్నానాలు చేసి నాగులమ్మ ఆలయం వద్ద కు తీసుకు వొచ్చి ప్రతిష్టిస్తారు.మార్చి 5 న నిండు జాతర.అందులో భాగంగా సాయంత్రం 3 గంటలకు రాజుపేట సెంటర్ నందు పాలమాకు వొర్రె నుండి తీసుకువచ్చిన కంక వనం(వనదేవత) కు శ్రీ నాగులమ్మ అమ్మవారికి ఎదురుకోలు కార్య క్రమాన్ని నిర్వహిస్తారు.

రాత్రి 12:05 నిమిషాలకు శ్రీ నాగులమ్మ అమ్మవారికి పగిడిద్ద రాజులకు కళ్యాణాన్ని యాశాస్త్రోక్తం గా గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు.జాతర లో ముఖ్య ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం.తెల్ల వారు జామున 3 గంటల సమయం లో నాగులమ్మ తల్లి ఉపాసకులు బాడిశ రామకృష్ణ స్వామి లోక కళ్యాణం
కోసం అగ్ని గుండాలలో నడవడం జరుగుతుంది.మార్చి 6 న అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుట జరుగుతుందని,మార్చి 7 న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జాతర ముగుస్తుందని తెలిపారు.
