Ex-Sarpanch Jagadishwar Visits Siddhi Vinayaka Temple
సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న తమ దంపతులతో మజీ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సిద్ధి వినాయకుడిని ఝరాసంగం గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ తమ దంపతులతో స్నేహితులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మాజీ సర్పంచ్ జగదీశ్వర్ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజనీ, స్వయంభూ వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు నాయకత్వంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం గ్రామం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మాజీ సర్పంచ్ తెలిపారు. అతనితోపాటు సజ్జన్ నాగేశ్వర్ దంపతులు కూడా దర్శించుకున్నారు,
