Indiramma Houses Symbol of Dignity for Poor
ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరానికి ప్రతీక
3వ వార్డ్ కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరానికి ప్రతీక అని భూపాలపల్లి మున్సిపాలిటీ 3వ వార్డ్ కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు అన్నారు సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ హనుమాన్ నగర్ కాలనీలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునేందుకు బుధవారం12 ఇందిరమ్మా ఇళ్లకు ముగ్గు పోయడం జరిగింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎర్రవెల్లి అరుణ్ రావు మాట్లాడుతూ పేదలకు సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అదేవిదంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎంతో కృషి చేస్తున్నారని వారు అరుణ్ రావు అన్నారు.అదేవిధంగా గతంలో 15 ఇల్లు రాగా 12 ఇల్లు ప్లాస్టింగ్ కంప్లీట్ అయినయ్ కాగా ఇంకా 18 ఇండ్లు ముగ్గు పోయాల్సి ఉంది అని అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంకు ఇందిరమ్మ ఇల్లు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, తుమ్మల నాగేశ్వరావుకి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్,మోటo శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు.
