`పార్టీ సిద్ధాంతాలకు పెన్నిధి తలసాని!
`నమ్మిన నాయకుడి కోసం ఎంత దూరమైన వెళ్ళగలిగే సాహసి!

`ఈ తరం రాజకీయాలలో ఆదర్శ వాది తలసాని.
`బీఆరఎస్ లోకి తర్వాత వచ్చినా తలసాని ఒక్కడు ఎంతో నమ్మకస్తుడు!

`అవకాశ వాదులు వచ్చారు.. వెళ్లారు!
`తలసాని ఒక్కడే నిటారుగా నిలబడ్డాడు!
`పార్టీ కష్టకాలంలో నిలబడిన తలసాని అసలైన సైనికుడు.
`ఆ పాత్ర పోషిస్తున్న తలసాని గొప్ప నాయకుడు.
`రాజకీయాలలో అంకిత బావం వున్న నాయకుడు.
`గిట్టని వారు ఎన్ని ఆరోపణలు చేసినా తొనకని నాయకుడు తలసాని.
`ఎలాంటి సమస్యనైనా ఎదుర్కునే దీరుడు.
`పార్టీలో, పాలనలో కెసిఆర్ కు తోడుగా నిలిచిన పాలకుడు.
`పదవుల కోసం వచ్చి పార్టీ ఓడిపోయాక పారిపోయిన వారున్నారు?
`పదవులే పరమార్థంగా స్వార్ధ పరులు వెళ్లి పోయారు.
`కేసీఆర్ ఎంతగానో నమ్మిన వాళ్ళలో కొంత మంది మోసం చేశారు.
`పెద్ద పెద్ద పదవులు పొంది కృతజ్ఞతలు లేకుండా జారుకున్నారు.
`పదవులకన్నా నైతికత నిండిన నాయకుడు తలసాని.
`పెత్తనం లేదని కవిత కూడా తండ్రిని కాదని వెళ్లిపోయారు.
`సామాన్య కార్యకర్తగానే తలసాని పార్టీకి సేవ చేస్తున్నారు.
`కేసీఆర్ పక్కన తలసాని లాంటి నికార్సైన నలుగురు నాయకులుంటే చాలు!
`వచ్చే ఎన్నికలలో బీఆరఎస్ కు తిరుగుండదు!
`బీఆరఎస్ కు ఎదురు నిలిచే దమ్ము ఏ పార్టీకి వుండదు.
హైదరాబాద్, నేటిధాత్రి:
రాజకీయాల్లో నైతికత అనే పదం ఇంకా బతికి వుందంటే అందుకు కొందరు నాయకులు కారణం. అందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకుడు వుండడం తెలంగాణకు గర్వకారణమనే చెప్పాలి. ఎందుకంటే పార్టీకి కష్ట కాలం వున్నప్ప్పుడు అండగా నిలిచిన నాయకులే అసలైన నాయకులు. అసలైన రాజనీతిజ్ఞులు. పార్టీ కోసం ప్రాణం పెట్టేవారు. అంతే కాని అవకాశ వాద రాజకీయాలు చేసేవారు ఇలాంటి నాయకుల కాలి గోరుకు కూడ సరిపోరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆరఎస్లో చేరినప్ప్పుడు అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయనను చేర్చుకునే ముందు బీఆరఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేతను కేసీఆర్ను కూడా ఎంతో తిట్టిపోశారు. కాని తలసాని రాజకీయం ఏమిటో? ఆయన గుణం ఏమిటో, తలసాని ఎంత నిబద్దత కలిగిన నాయకుడో కేసిఆర్కు మాత్రమే తెలుసు. అందుకే ఎన్ని రకాల విమర్శలు ఆనాడు తెలంగాణ వాదుల ముసుగులో వున్న వారు చేశారో తెలుసు. అసలు తెలంగాణ వాది కాని తలసాని శ్రీనివాస్ యాదవ్ను క్యాబినేట్లోకి ఎలా తీసుకుంటారు? అంటూ ఫ్రశ్నించారు. కాని అసలు తెలంగాణ ఉద్యమ కారులను అణచి వేయాలని చూసిన వారిని ముఖ్యమంత్రి స్దానంలో కూర్చోబెట్టిన అవకాశవాదులు తెలంగాణ ఉద్యమంలో కూడా వున్నారని నిరూపించుకున్నారు. నిజానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏనాడు తెలంగాణకు వ్యతిరేకం కాదు. తెలంగాణ వద్దని ఆయన ఏనాడు చెప్పలేదు. కాని ఆయన తెలుగుదేశం పార్టీలో వున్నా తెలంగాణ కోసం అంతర్గతంగా ఆయన చేసిన కషి కేసిఆర్కు తెలుసు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆహ్వానించారు. మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ ఉత్తరం ఇవ్వడంలో ఆయన చేసిన కషి కూడా వుంది. అయితే నమ్మిన సిద్దాంతం కోసం, నమ్మిన నాయకుడి కోసం ఎంత దూరమైనా తలసాని వెళ్తారు. అందుకే తెలుగుదేశం పార్టీలో వున్నంత కాలం ఆయన ఆ పార్టీ సిద్దాంతాలనే మాట్లాడారు. పార్టీలైన్లోనే మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు వ్యతిరేక తెలుగుదేశం నుంచి వచ్చేశారు. ఎందుకంటే తెలంగాణలో ఇక తెలుగుదేశం పార్టీ మనుగడ సాధ్యం కాదన్న సంగతి తలపండిన రాజకీయం చూసిన తలసాని ఆ పార్టీని వదులుకున్నారు. తెలంగాణకు సేవ చేయాలనుకున్నారు. అయినా పార్టీ మారినా ఆయన ఏనాడు పాత నాయకుల మీద కూడా ఏనాడు మాట్లాడలేదు. అవకాశ వాద రాజకీయలు ఏనాడు చేయలేదు. తెలుగుదేశం పార్టీ కష్టకాలం వున్నప్ప్పుడు అండగా నిలిచారు. పదేళ్లపాటు తెలుగుదేశం ప్రతిపక్షంలో వున్నా ఆనాడు తలసాని ఆ పార్టీని వదిలిపెట్టలేదు. అప్ప్పుడే తలసాని తెలుగుదేశం పార్టీని వదిలిపెడితే కాంగ్రెస్లో కూడా మంత్రి అయ్యేవారు. కాని అలాంటి రాజకీయాలు ఏనాడు తలసాని చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తప్పని పరిస్దితిల్లో మాత్రమే వచ్చారు. అయితే వచ్చిన నాటి నుంచి ఏనాడు పదవుల కోసం ఆలోచించలేదు. పరపతి కోసం ఆలోచించలేదు. హైదరాబాద్ మీద తనదే పెత్తనం కావాలని కోరుకోలేదు. ఎంత ఎదిగినా ఒదిగి వుండే నాయకుడు తలసాని. తన పరిది ఏమిటో తనకు తెలుసు. తనను నమ్ముకున్నవారికి ఎలా న్యాయం చేయాలో తలసానినికి తెలుసు. రాజకీయ చికాకులు ఏనాడు సష్టించని నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎందుకంటే అవకాశ వాద రాజకీయాల కోసం ఇతర పార్టీ నుంచి వచ్చిన పదవులు పొందిన వారి కన్నా వెయ్యి రెట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ బెస్టు అని చెప్పకతప్పదు. ఎందుకంటే కప్పదాటు రాజకీయాలు చేసిన వారు బీఆరఎస్లో చాలా మంది వున్నారు. కేసీఆర్ ఎంత నమ్మకం పెట్టుకున్న నాయకులు కూడా ఆయనను విడిచి వెళ్లారు. బీఆరఎస్ అదికారంలో వున్నప్ప్పుడు కేసీఆర్ను వెతుక్కుంటూ వచ్చారు. బీఆరఎస్ అదికారం కోల్పోగానే పార్టీ మారిపోయారు. అవకాశ వాద రాజకీయాలకు తాము ఐకాన్ అనే ముద్ర పడుతుందని తెలిసినా పదవులే ముఖ్యమనుకొని వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక భవిష్యత్తులో బిఆరఎస్కు ఎదురలేదు. తిరుగులేదు. అనుకున్నప్ప్పుడు బీఆరఎస్ గూటికి చేరిన అత్యంత సీనియర్ నాయకుల్లో కే. కేశవరావు ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తన ప్రాదాన్యం తగ్గుతుందని తెలిసిన తర్వాత బీఆరఎస్లో చేరితే రాజ్యసభ ఖాయమని తెలుసుకొని బీఆరఎస్ గూటికి చేరుకున్నారు. వేసుకున్న డ్రెస్సు మడత కూడ చెదరకుండా వున్న నాయకుడు బీఆరఎస్లో ఎవరైనా వున్నారంటే అది కే.కేశవరావు. ఆయనను వరుసగా మూడుసార్లు కేసీఆర్ రాజ్యసభకు పంపించారు. ఆయన వుండగా ఎవరికీ అవకాశమివ్వకుండా చూసుకున్నారు. అలాంటి నాయకుడు బీఆరఎస్ ఓడిపోగానే పార్టీ మారిపోయారు. బీఆరఎస్లో వున్నప్ప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారుడు, తన కుమార్తె జిహెచఎంసి. చైర్పర్సన్, కుమారుడు ఓ కార్పోరేషన్కు చైర్మన్ ఇన్ని పోస్టులు తీసుకున్నారు. ఆఖరుకు కేసీఆర్ నమ్మకాన్నే మోసం చేసిపోయారు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా అదే పనిచేసి వెళ్లిపోయారు. తెలంగాణ ఉద్యమ కారుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పక్కన పెట్టి ప్రాదాన్యత కల్పిస్తే ఆయన కూడా ఆఖరుకు పార్టీకష్టకాలంలో వున్నప్ప్పుడు కేసీఆర్ను వదిలి వెళ్లిపోయాడు. అవకావ వాద రాజకీయాలకు తానేమీ అతీతుడిని కాదని నిరూపించుకున్నారు. ఇంకా దౌర్భాగ్యమేమిటంటే తన కూతురు కావ్యకు అందర్నీ కాదని కేసీఆర్ లోక్సభ టికెట్, బీఫామ్ అందజేసిన తర్వాత పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. ఎంతో నమ్మకస్తుడిగా సీఎం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిండు అసెంబ్లీలో ఆరోపణలు చేసినట్లే చేసి మరీ అదే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. రాత్రికి రాత్రి కండువా మార్చుకున్నారు. ఇప్ప్పుడు కేసీఆర్ను, ఆయన పాలనను తిట్టిపోస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు చేసిన వారు మరెవరూ లేరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాగే మాజీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని వీడి కేవలం పదవులకోసం బీఆరఎస్లోచేరి 2014లో బీఆరఎస్ ప్రభుత్వంలో తొలి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. కేసీఆర్ను అపరభగీరదుడు అని పొగిడుతూ పదవులు అనుభవించారు. రండోసారి స్పీకర్గా అవకాశం పొందారు. కాని బీఆరఎస్ ఓటమి పాలైన కొద్ది రోజులకే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. పుట్టింటికి వచ్చినంత సంబరంగా వుందన్నారు. కేవలం తన కుమారుడు రాజకీయ పదవి కోసం పార్టీ మారారు. ఇక కాంగ్రెస్లో ఉన్నత పదవులు పొంది, తెలంగాణ రాగానే కాంగ్రెస్ను వీడి బీఆరఎస్లో చేరి, రాజ్యసభ సభ్యుడైన నాయకుడు దివంగత డి. శ్రీనివాస్. ఆయన కాంగ్రెస్పార్టీ అదికారంలోకి రాగానే కండువా మార్చుకున్నారు. రాజకీయాల్లో ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు అవకాశ వాద రాజకీయాలను వెతుక్కుంటూ వెళ్లారు. ప్రస్తుతం మండలి చైర్మన్గా వున్న గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వారు కూడా తన వారసుల కోసం పార్టీ మారిపోయారు. బీఆరఎస్లో చేరి పదవులు పొందారు. మండలి చైర్మన్గా అవకాశం అందిపుచ్చుకున్నారు. ఒక వేళ మళ్లీ బీఆరఎస్ అదికారంలోకి వచ్చి వుంటే మంత్రి కావాలని కలలు కన్న నాయకుడు. కాని ఇప్ప్పుడు తన కుమారుడి తాత్కాలిక రాజకీయం కోసం పార్టీ మారారు. ఆఖరుకు కేసిఆర్ కన్న కూతురు కూడా బీఆరఎస్ను వీడివెళ్లిపోయింది. పార్టీలో వుంటూనే పార్టీని బజారున పడేయాలని చూసింది. దాంతో పార్టీ సస్పెండ్ చేసేలా రాజకీయం చేసి, తనను పార్టీ నుంచి పంపించారని ప్రచారం చేస్తోంది. పైగా బీఆరఎస్ అగ్రనేత కేసీఆర్ పదేళ్ల పాలననే ఆమె తూర్పార పడుతోంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివద్ది కాలేదని చెబుతోంది. ఇలాంటి నాయకులు వున్న ఈ తరుణంలో ఆణిముత్యం లాంటి నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పక తప్పదు. పదేళ్ల కాలమే, కాదు పార్టీ ఓడిపోయినా బీఆరఎస్ను కాదనుకోలేదు. ఆయన పార్టీ మారితే పదవులు అందుకునే అవకాశం వుంది. కాని ఆ పని చేయలేదు. నైతిక రాజకీయాలకు తిలోదకాలు ఇవ్వలేదు. తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇలాంటి అతి కొద్ది మంది నాయకులు ఇంకా వుండడం వల్లనే ప్రజలు రాజకీయాలను నమ్ముతున్నారు. నాయకులను నమ్మి గెలిపిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నాయకులే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నారు.
