India vs Pakistan Clash Again?
మళ్లీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే…
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పవచ్చు. అయితే అలాంటి మరో మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడే విషయంపై క్రేజీ న్యూస్ వచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. అలానే వ్యూయర్ షిప్ కూడా విపరీతంగా ఉంటుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్, పాక్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. ఈ క్రమంలో మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగితే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. మరోసారి భారత్, పాక్ తలపడనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
