CPI ML Demands End to Slot Booking System for Tenant Farmers
స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసివేయాలి
కౌలు రైతుల
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
కౌలు రైతులు పండించిన పంటను ఎలా అమ్ముకోవాలి మధ్య దళారులక
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
పట్టా పాస్ బుక్ ఉన్న రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని వారు పండించిన ధాన్యాన్ని కానీ పత్తిని సీసీఐకి అమ్మడానికి వీలు ఉంది కానీ కౌవులు రైతులు పండించిన పంటను అమ్మాలంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. సందర్భంగా వారు మాట్లాడుతూ
భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులు 45 శాతం ఉంటారు ఒక ఎకరానికి కౌలు 15000 పెట్టుబడి 60000 పెట్టి సాగు చేసుకుంటున్నారు గతంలో వ్యవసాయ అధికారుల ద్వారా మాన్యువల్ ద్వారా కొనుగోలు చేసేది ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది తాము పండించినటువంటి పత్తి వడ్లు ఎవరికి అమ్ముకోవాలో తెలవక ప్రభుత్వంస్లాట్ బుక్ చేసుకో మంటుంది కౌలు రైతు ఏ పట్టా పాస్ పుస్తకం తో స్లాట్ బుక్ చేసుకోవాలి . ఎవరికి అమ్ముకోవాలి మధ్యదళారులక లేక సీసీఐకా అని దిక్కుతోచని పరిస్థితిలో పండించిన పంటను ఎవరికి అమ్మాలి అర్థం కాక బోరుమంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళ పట్ల వివక్ష చూపుతా ఉంది వీళ్ళు పండించిన పంటను మధ్య దళారులకు అమ్ముకొని మద్దతు ధర రాక ఇబ్బంది పడతా ఉన్నారు అసలే అకాల వర్షం కురవడం వలన పత్తి పంట తీవ్రంగా నష్టపోయినది పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై విలవిలాడుతున్నారు ప్రభుత్వం మాత్రం వీళ్లకు ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన దాఖలు కానరావడం లేదు తక్షణమే రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పైసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ ఏఐసి సిటీ యు జిల్లా కార్యదర్శి కన్నూరి డానియల్ అనిల్ రాజేష్ పాల్గొన్నారు
