Students Demand Reduction in Degree First Year Fees
డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలి
ఫీజులు తగ్గించకపోతే ఆందోళన చేపడుతాం
పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్
మంచిర్యాల,నేటి ధాత్రి:
కేయూ పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను తగ్గించాలని పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్,ఖమ్మం,ఆదిలాబాద్ జిల్లాలలో డిగ్రీ కోర్సులు 2025-26 ప్రవేశాలు పొందిన ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచి పేద విద్యార్థులపై భారాన్ని మోపింది అని అన్నారు.ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో 80 ఉండగా ఇప్పుడు 1200 రూపాయలకు పెంచారు. రికగ్నేషన్ ఫీజు గతంలో 400 ఉండగా ఇప్పుడు 800 కు
ఐ యు డి ఎఫ్ ఫీజు గతంలో 60 ఉండగా ఇప్పుడు 300 కు ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఫీజు గతంలో 50 ఉండగా ఇప్పుడు 200 కు పెంపుదల చేసి విద్యార్థులపై తీవ్ర భారాన్ని మోపారు.ఒక్క పరీక్ష ఫీజు మాత్రమే 750 గతంలో మాదిరిగానే యధావిదంగా కొనసాగిస్తున్నారు.గతంలో ఒక్కొక్క విద్యార్థి ఆయా అన్ని రకాల ఫీజుల కింద 1340 చెల్లించేవారు.ఇప్పుడు ఏకంగా ఆ ఫీజులు అన్ని కలిపి 3,250 కి పెంపుదల చేశారు.గతం కంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై 1910 రూపాయలు ఫీజు భారం పడుతుంది.ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పేద విద్యార్థులు ఏమాత్రం కట్టలేనటువంటి ఫీజుల భారాన్ని విద్యార్థులపై ప్రభుత్వం మోపడం సరికాదని తక్షణమే ప్రభుత్వం పున:ర ఆలోచించి ఫీజుల భారం తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వంశీ,మనోహర్ పాల్గొన్నారు.
