* ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘం*
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత & అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్
మొగుళ్లపల్లి నేటి దాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద
76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా
అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి
నివాళులర్పించారు అనంతరం మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం వల్ల నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి లో ఉన్న నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగని రాయడం జరిగింది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యంలో మనిషిగా గుర్తించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు అందరు సమాన హక్కు కల్పించింది కుల మతాలకు అతీతంగా సమాజంలో ఉన్న మానవులంతా ఒకటేనని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఆరోజు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయకుండా ఉండి ఉంటే భారత దేశంలోని ప్రజలు ఈ విధంగా ఉండేవారు కాదన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి రాజు, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్ తదితరులు పాల్గొన్నారు
