42 శాతం రిజర్వేషన్ తోబీసీలకు సామాజిక న్యాయం

42 శాతం రిజర్వేషన్ తోబీసీలకు సామాజిక న్యాయం
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

42% శాతం రిజర్వేషన్ తో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని మొగుళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కాత్య రాజు రమేష్ తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని అన్నారు.

క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించినది. విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం తెలిసిందే 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగ్గ విషయమని ఆయన అన్నారు

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చేసిన “జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి” అన్న డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. బిసి డిక్లరేషన్ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అలాగే మంత్రివర్గ వర్గ సభ్యులందరికీ మరియు మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, సామజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version