Headlines

బంధు సక్సెస్

@ కాంగ్రెస్ నాయకుల అరెస్టు
@ తెలంగాణ వచ్చింది రైతుల కోసమే : పెద్ది
@ బందులో పాల్గొన్న సిపిఎం ఎమ్మార్పీఎస్ రైతు అనుబంధ సంఘాలు టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు


#నెక్కొండ, నేటిదాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపడుతున్న భారత్ బంద్ లో భాగంగా నెక్కొండ మండలం లోని రైతులకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ టిఆర్ఎస్ సిపిఐ ఎమ్మార్పీఎస్ నాయకులు మండలంలోని బందును సంపూర్ణంగా పాటించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి పాల్గొని నెక్కొండ నర్సంపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతుల పాలిట యమకింకరులు వ్యవహరిస్తుందని దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడవలసిందిగా పై రైతుల పై లాఠీఛార్జ్ చేయడం ఎంతో బాధాకరమైన విషయమని ఇక ముందు రైతుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకున్న తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీజేపీ ప్రభుత్వానికి చురకలంటించారు.
ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
@ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెక్కొండ మండల కేంద్రంలో చేపట్టిన బంద్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది రైతుల సమస్య రాజకీయాలను పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చింది రైతు బతుకుల కోసమేనని రైతులను కాపాడుకోవాలని రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీ దేనికైనా వెనకాల ఓ దని ఇది ఆరంభం మాత్రమేనని రైతు ఉద్యమం మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని మద్దతు ధర అనే స్టీరింగ్ను కేంద్రం చేతుల్లో తీసుకుని రాష్ట్రాలకు అధికారం ఇవ్వకుండా దేశ రైతులను ఆగం చేస్తున్నారని గత 11 రోజులుగా పది డిగ్రీల చలిలో రైతులను వృద్ధులను చేస్తున్న దీక్ష లక్ష్యాన్ని నెరవేరాలని ఈరోజు రైతులందరూ బందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని రాష్ట్రాల స్థితిగతులపై అధ్యయనం చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఖండించిన తెలంగాణ రైతులకు సన్నబియ్యం ఎక్కువ దిగుబడి వస్తే దాన్ని కొనడానికి కేంద్రం ముందుకు రాకుండా లేవి పేరుతో జాప్యం చేస్తోందని కరువు కాలంలో తెలంగాణ రైతాంగం తరికి సన్న బియ్యం పెట్టి కేంద్రం దిగి రాకుంటే ఇక్కడి నుండి ఢిల్లీ వరకు లక్ష మంది రైతులతో రాజధాని లో నిరసన చేపడతామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంఘాని సూరయ్య నెక్కొండ ఎంపీపీ రమేష్ నాయక్ జెడ్పిటిసి సరోజ హరికిషన్ చైర్మన్ లు మారం రాము దామోదర్ రెడ్డి ఆర్ ఎస్ ఎస్ కన్వీనర్లు కార్యకర్తలు ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు యాకయ్య, సిపిఐ నాయకులు వెంకన్న, అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *