కబ్జాకోరు దార్కారిజం

కబ్జాకోరు దార్కారిజం

– ‘నేటిధాత్రి’ కార్యాలయంపై దాడికి రెక్కి

– కార్యాలయం మూసి ఉండడంతో స్థానికులను ఆరా తీసిన మోట దార్కారులు

– ఐదు ద్విచక్రవాహనాలపై వచ్చిన కబ్జాకోరు గుండా గ్యాంగ్‌

– ఎప్పుడు వస్తారు…? ఎప్పుడు వెళ్లారంటూ హమాలీ కార్మికుడిని ప్రశ్నించిన కబ్జాకోర్లు

– దాడికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడే…?

– గ్రేటర్‌లో కబ్జాలన్నింటికి తెరవెనుక అతగాడే…?

– త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తాం…

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గోపాలపురం ప్రాంతంలో ఓ సామాన్యుని భూమిని అన్యాయంగా కబ్జాచేసి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతూ, అదే స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న ఓ కబ్జాకోరు నేటిధాత్రి కార్యాలయంపై దాడి చేసేందుకు తన కబ్జాగ్యాంగ్‌ను ఉసిగొల్పాడు. బరితెగించి సామాన్యుని భూమిని కబ్జా చేయడమే కాకుండా ఆ నీచపు పనిని సామాన్యుడి తరపున ‘నేటిధాత్రి’ ప్రశ్నించినందుకు దాడి చేసుందుకు రెక్కి నిర్వహించారు. గురువారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఐదు మోటారు సైకిళ్లపై మోటాదర్కార్లు నేటిధాత్రి కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కార్యాలయం మూసిఉండడంతో పక్కనే ట్రాన్స్‌ఫోర్టులో పనిచేసే ఓ హమాలీ కార్మికుడిని ఎప్పుడు వస్తారు…; ఎప్పుడు వెళ్తారు…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట.

ఇంత ధైర్యం ఎక్కడిది

కాసేపు బిల్డర్‌నంటూ బిల్డప్‌ కాదు, కాదు పైనాన్సర్‌ను అంటూ బిల్డప్‌ ఇచ్చే హనుమంతరావు అనే వ్యక్తి ‘నేటిధాత్రి’ కార్యాలయానికి సైతం ఫోన్‌చేసి బెదిరింపులకు దిగాడు. ఆధారాలతో రమ్మని అనడంతో తగ్గిన సదరు బిల్డర్‌ అలియాస్‌ కబ్జాకోరు. గురువారం రాత్రి దాడి చేసేందుకు తెగించాడు. అయితే అతనికి ఇంత ధైర్యం ఎక్కడిది…? కబ్జా వెనకాల ఉండి అంతా నడిపిస్తూ గ్రేటర్‌ వరంగల్‌లో కబ్జా కథలన్నింటికి సూత్రధారి అయిన ఎమ్మెల్యే తమ్ముడి అండ చూసుకునే ఇలా చేస్తున్నట్లు తెలిసింది. వీరు కబ్జా చేసే దగ్గర బాధితులను బెదిరించేందుకు ఉపయోగించుకునే చిల్లర రౌడీమూకలను ‘నేటిధాత్రి’ కార్యాలయం పైకి ఎమ్మెల్యే తమ్ముడే పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం కబ్జాలు8 చేయడానికే ఈ గ్యాంగ్‌ను ఉపయోగించుకుంటూ బలవంతంగా బాధితులను బెదిరించి దాడులతో లొంగదీసుకుని భూములను కబ్జా చేసేందుకు ఈ ముఠాను ఎమ్మెల్యే తమ్ముడు పెంచి పోషిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఈ గ్యాంగ్‌ గతంలో అనేకమందిని బెదిరించి దాడులకు దిగి భూములను కబ్జా చేశారని విశ్వసనీయ సమాచారం. బాధితులను బెదిరించినట్లే ‘నేటిధాత్రి’ని బెదిరించాలని చూశౄరు.

బెదిరింపులకు లొంగుతామా…?

జనం పొట్టగొట్టి, పాపాలు మూటగట్టుకుని సంపదను పోగేయాలనుకుంటున్న వారి బెదిరింపులకు ‘నేటిధాత్రి’ ఎప్పుడు లొంగదని గుర్తుంచుకోవాలని సామాన్యులను బెదిరించి భూములు కబ్జా పెట్టి అధికార బలాన్ని ఉపయోగించి కోట్లు కూడబెట్టి ప్రజాప్రతినిధిని అంటూ నిసిగ్గుగా చెప్పుకుంటూ తిరుగుతున్న గోముఖ వ్యాఘ్రాలకు ప్రజాస్వామ్యయుతంగా అక్షరాలతో గట్టి సమాధానమే చెప్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *