ఆలయ ట్రస్ట్ బోర్డులో యాదవులకు చోటు కల్పించాలి…

ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో యాదవులకు చోటు కల్పించాలి
ఐలోని మల్లన్న స్వామిని యాదవులు కులదైవంగా కొలుస్తారు
స్వామివారి సేవకు యాదవులను దూరం చేసే కుట్ర జరుగుతుంది
అందుకే యాదవులకు ట్రస్ట్ బోర్డులో చోటు ఇవ్వలేదు
స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని యాదవులకు చోటు కల్పించాలి
జి ఎం పి ఎస్ మండల కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు

నేటి ధాత్రి అయినవోలు :

 

 

 

అయినవోలు మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా కొలువుదీరిన ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ నియామకంలో స్థానిక యాదవులను గుర్తించకపోవడం స్థానిక యాదవులను అవమానపరచడమేనని జి.ఎం.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు విమర్శించారు. శుక్రవారం ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అయినవోలు మండలంలో అయినవోలు గ్రామానికి చెందిన గత పది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా యాదవులను గుర్తింపు లేకుండా అవమానపరుస్తున్నారని నల్లబెట్ట రాజు యాదవ్ ఆవేదన వ్యక్తపరిచినారు. మేము ఓట్ల బ్యాంకు వరకేనా, కనీసం నామినేట్ పోస్టులకు కూడా అర్హత లేకుండా పోయినామా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి యాదవులను గుర్తించి ట్రస్ట్ బోర్డులో కనీస గౌరవప్రధ స్థానాలనైనా స్థానిక యాదవులకు కేటాయించాలని చినరాజు విజ్ఞప్తి చేసినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version