ఘనంగా జరుపుకున్న ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు
పర్వతగిరి నేటి ధాత్రి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్ పాల్గొని చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అతి సార, శ్వాస కోశ వంటి రోగాల నుండి దూరంగా ఉండవచ్చని సూచించారు. జిల్లా స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ మలినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ స్నానం కన్నా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అతి ముఖ్యమని అన్నం తినే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో బాగా రుద్ది శుభ్రపరచుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పాక శ్రీనివాస్ , ఎంఈఓ జి. లింగారెడ్డి పంచాయతీ కార్యదర్శి రఘు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..