బీసీ జేఏసీ మరియు రజక సంఘం నాయకులతో క్యాండిల్ ర్యాలీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లో వివిధ కుల సంఘాలు నాయకులతో, బీసీ జేఏసీ మరియు రజక సంఘం నాయకులతో క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.మొన్న నాగర్ కర్నూల్ లో జరిగిన దాడిని నిరసిస్తూ టీఆర్పీ పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి పిలుపుమేరకు జ్యోతి పండాల్ జహీరాబాద్ నియోజకవర్గం లో వివిధ కుల సంఘాల నాయకుల, రజక సంఘం నాయకుల, రజక సంఘం పెద్దల, వివిధ పార్టీల బీసీ నాయకుల, బీసీ జేఏసీ నాయకుల సమన్వయంతో భారీగా క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్పీ
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన పార్టీల నాయకులు, రజక సంఘం నాయకులు, వివిధ పార్టీ నాయకులు, బిసి జేఏసీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మరియు తదితరులు భారీగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారని జ్యోతి పండాల్ అన్నారు.ఈ క్యాండిల్ ర్యాలీని జహీరాబాద్ నియోజకవర్గంలో వివిధ పార్టీ నాయకులు రజక సంఘం నాయకులు అన్ని వర్గాల బీసీ నాయకులు నుంచి మద్దతు లభించడం చాలా చాలా సంతోషంగా ఉందని జ్యోతి పండాల్ అన్నారు మరియు ఈ క్యాండిల్ ర్యాలీ లో పాల్గొన్న అన్ని వర్గాల నాయకులందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు..
