ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమం.

AIDS

ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమం

ఎయిడ్స్ పై అప్రమత్తంగా ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని వ్యాధి నిర్మూలనపై విస్తృత ప్రచారం జరుగుతుంది. అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలమేరకు జిల్లా కలెక్టర్, డిఎం అండ్ హెచ్ ఓ, వైఆర్ జి కేర్ సహాయ సహకారము తోటి కళారంజని సందీప్ కళాబృందం ద్వారా కూడలి వద్ద హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై కళా ప్రదర్శనలు నిర్వహించారు హెచ్ఐవి వ్యాధి నాలుగు కారణాల ద్వారా వస్తుంది. రక్షణ లేని సెక్స్,కలుషితమైన రక్త మార్పిడి,కలుషితమైన చిరంజీలు,తల్లికి హెచ్ఐవి వ్యాధి ఉంటే గర్భంధాలిస్తే పుట్టబోయే బిడ్డకు వస్తుంది

AIDS
AIDS

హెచ్ఐవి అంటువ్యాధి కాదు ఈ నాలుగు కారణాల వల్ల మాత్రమే వస్తుంది.సుఖ వ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవి వ్యాధి వచ్చే అవకాశం పది రెట్లు ఎక్కువ సుఖ వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. హెచ్ఐవి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి యువకులు దీని పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి తల్లికి హెచ్ఐవి వ్యాధి ఉంటే ఆమె గర్భం దాలుస్తే పుట్ట బోయే బిడ్డను కాపాడడానికి మందులు ఉన్నాయి పుట్టబోయే బిడ్డను కాపా డవచ్చు కనుక గర్భం దాల్చిన ప్రతి తల్లి హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలి.హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను హింసించకుం డా ప్రేమ ఆప్యాయతలు చూపిస్తే వారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశ ముంది.కళాకారులు,పాటల ద్వారా, పల్లె సూక్తుల ద్వారా నాటకాల ద్వారా తెలియ జేశారు, ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 1097 గూర్చి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైఆర్ జి కేర్ , డి ఆర్ పి ముస్తక్ ,పంచాయితీ కార్యదర్శి రత్నాకర్, సిబ్బంది మరియు హెడ్ కానిస్టేబుల్, రవీందర్, కారోబార్. రమేష్ బాబు సూపర్ వేజర్ రంజిత్, మామిడి స్వప్న,సిబ్బంది,
కళాకారులు పోలేపాక సందీప్,,కృష్ణం రాజు , రజని, కరుణాకర్, సమ్మయ్య ,రామ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!